Thalapathy Vijay : జన నాయగన్ రిలీజ్, లీక్ ఇష్యూస్ - మేకర్స్ కోసం దళపతి విజయ్ కీలక నిర్ణయం!
Vijay Next Movie : దళపతి విజయ్ లాస్ట్ మూవీ జన నాయగన్ సెన్సార్ ఇబ్బందులు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Vijay Might Do New Movie With Jana Nayagan Makers : జన నాయగన్... గత కొద్ది రోజులుగా అటు ఇండస్ట్రీ ఇటు సోషల్ మీడియాను కుదిపేస్తోన్న పేరు. దళపతి విజయ్ లాస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ ఇప్పటివరకూ వాయిదా పడింది. ఈలోపు ఆన్ లైన్లో పైరసీ లీక్, లోకల్ ఛానల్లో సినిమా టెలికాస్ట్ కావడం మేకర్స్కు మరో షాక్.
మేకర్స్తో విజయ్ మరో మూవీ?
ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ప్రస్తుతం వరుస ఇబ్బందుల్లో ఉన్న మేకర్స్కు విజయ్ అండగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 'జన నాయగన్' కాంబోలోనే విజయ్ మరో మూవీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ మూవీ గురించి ఆలోచిస్తారని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ఈ ప్రచారంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. టీవీకే పార్టీ ప్రారంభించి పాలిటిక్స్లోకి వెళ్లిన విజయ్... 'జన నాయగన్' తన లాస్ట్ మూవీ అని ఈవెంట్లో అనౌన్స్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. కారణాలేమైనా మళ్లీ ఆయన మూవీ చేస్తున్నారనే న్యూస్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు విజయ్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు. వరుస ఇబ్బందులతో ఉన్న మేకర్స్కు అండగా నిలుస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ఓటీటీలోకి తాప్సీ కోర్టు రూం డ్రామా - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
టీవీలో మూవీ టెలికాస్ట్
ఓ వైపు సోషల్ మీడియాలో పైరసీ లీక్పై సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ సాగుతుండగానే... మరోవైపు లోకల్ ఛానల్లో ఫుల్ మూవీ టెలికాస్ట్ కావడం కలకలం రేపింది. కోయంబత్తూర్ సమీపంలోని కరుమత్తంపట్టిలో కేబుల్ టీవీ నెట్వర్క్ నిర్వహిస్తోన్న పళని స్వామి అనే వ్యక్తి తన లోకల్ ఛానల్లో ఈ నెల 11న రాత్రి జన నాయగన్ ప్రసారం చేశాడు. విషయం తెలుసుకున్న ఫాన్స్, టీవీకే కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే అతని అరెస్ట్ చేసి కంప్యూటర్, హార్డ్ డిస్క్లు సీజ్ చేశారు. అయితే, అప్పటికే పూర్తి మూవీ ప్రసారం అయ్యిందని టీవీకే నేతలు చెబుతున్నారు.
సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో ఇప్పటివరకూ ఆరుగురిని అరెస్ట్ చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఇన్ సైడ్ విచారణ చేస్తుండగా... పోస్ట్ ప్రొడక్షన్ టైంలోనే సినిమా లీక్ అయ్యిందని గుర్తించింది. అటు, ఎడిటింగ్ విభాగం నుంచి లీక్ అయినట్లు వచ్చిన వార్తలను ఎడిటర్స్ యూనియన్ ఖండించింది. పైరసీ కంటెంట్ కానీ వీడియోస్ కానీ డౌన్ లోడ్ చేసినా షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని టీం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మూవీ సెన్సార్ రివ్యూ కోసం రివైజింగ్ కమిటీకి పంపి నెలలు గడుస్తున్నా ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్పై ఇంతవరకూ క్లారిటీ లేదు.
ట్రెండింగ్ వార్తలు























