అన్వేషించండి

Vishal : రాయలసీమ బిడ్డకి దాడులు కొత్త కాదు - ఏపీ నెక్స్ట్ సీఎం ఆయనే: హీరో విశాల్

తమిళ హీరో విశాల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో నెక్స్ట్ ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.

Kollywood Actor Vishal On AP Elections : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే రాజకీయ ఆరంగేట్రం చేసి సొంతంగా పార్టీ పెట్టి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ చెప్పిన విశాల్ తాజాగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన విశాల్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ క్రమంలోనే ఏపీలో మళ్ళీ వైయస్ జగన్ సీఎం అవుతారని చెప్పడం తర్వాత ఆసక్తికరంగా మారింది.

ఏపీలో మళ్ళీ జగనే సీఎం అవుతారు - విశాల్

కోలీవుడ్ హీరో విశాల్ త్వరలోనే 'రత్నం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళ దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయనుంది. ప్రస్తుతం విశాల్ ఈ మూవీ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాదులో సందడి చేసిన విశాల్ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే వైయస్ జగన్ గురించి మాట్లాడారు." నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. కానీ జగన్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. జగన్ గారిని ఒక వ్యక్తిగా నేను ఫాలో చేస్తున్నా. వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన ఏం చేశారనేది గమనిస్తూ వస్తున్నా. ప్రజల్లోకి వచ్చి ఎలా మంచి పేరు సంపాదించుకున్నది నాకు నచ్చింది. ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి సీఎం చేయడం అనేది మామూలు విషయం కాదు. వచ్చే ఎన్నికల్లో కూడా తప్పకుండా వైఎస్ జగనే గెలుస్తారు" అని అన్నాడు

జగన్‌కు దాడులు కొత్తకాదు

ఇటీవల జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై కూడా హీరో విశాల్ స్పందించారు. "జగన్ కి దాడులు కొత్త కాదు గతంలో ఎయిర్ పోర్ట్ లోనూ ఆయన మీద దాడి జరిగింది. భుజానికి తగిలిన కత్తి మెడ మీద తగిలితే పరిస్థితి ఏంటి? రాజకీయంగా ఆయన ఎన్నో చూశారు. అన్నింటికీ ధైర్యంగా ఉన్నారు. రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తికి ఆమాత్రం ధైర్యం, దిల్ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 

ఏప్రిల్ 26న 'రత్నం' రిలీజ్

విశాల్ గత ఏడాది 'మార్క్ ఆంటోనీ' మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు 'రత్నం' అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సముద్రఖని, గౌతమ్ మీనన్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజు విడుదల చేయబోతున్నారు.

Also Read : మా నాన్న చనిపోయారనే విషయం నాకు చెప్పకుండా దాచారు, నేను ఇంటికి వెళ్లేసరికి..: నటి ఆమని

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget