అన్వేషించండి

Sandhya Theatre : 'గేమ్ ఛేంజర్'పై 'పుష్ప 2' వివాదం ఎఫెక్ట్... ఇకపై ఆ పనులు కుదరవంటూ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన సంధ్య థియేటర్

Sandhya Theatre : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ దగ్గర 'గేమ్ ఛేంజర్' రిలీజ్ సందర్భంగా అనుకోని ఘటనలు జరగకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు.

అభిమాన హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ చేసే సందడి అంతా కాదు. థియేటర్ల ముందు టపాసులు పేల్చడం దగ్గర నుంచి మొదలు పెడితే... భారీ కటౌట్లు, థియేటర్లలో ఈలలు గోలలు, హీరో ఎంట్రీ రాగానే పేపర్లు చల్లడం వంటి హంగామా గట్టిగానే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అందరినీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ ఘటన ఇకపై థియేటర్ల దగ్గర ఎలాంటి హంగామా లేకుండా చేసింది. 

సంధ్య థియేటర్ వద్ద కొత్త రూల్స్ 
హైదరాబాద్లో ఉన్న కొన్ని థియేటర్లను సెంటిమెంట్ గా భావిస్తారు. అందులో సంధ్య థియేటర్ కూడా ఒకటి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఈ థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలని ఎంతోమంది అభిమానులు ఉత్సాహపడుతుంటారు. కానీ ఆ ఉత్సాహం ప్రాణాల మీదకు తీసుకొస్తే, అది పూడ్చలేని నష్టం అవుతుంది. అందుకే తాజాగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒకసారిగా ఉలిక్కిపడింది టాలీవుడ్. దీంతో ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా కండిషన్స్ పెట్టింది సదరు థియేటర్ యాజమాన్యం.

అందులో భాగంగా ప్రతి ఒక్కరూ లైన్ లోనే థియేటర్లోకి అడుగు పెట్టాలని, టికెట్ లేనివారికి ఎంట్రీ లేదని స్ట్రిక్ట్ గా గేటు బయట పెద్ద పెద్ద పోస్టర్ల ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా థియేటర్లలో క్రాకర్స్ పేల్చవద్దని, మంటలకు కారణమయ్యే ఇతర ఐటమ్స్ ని, లైటర్స్ లాంటి వాటిని తీసుకురావద్దని హెచ్చరించింది. ఒకవేళ ఈ కండిషన్స్ ను ఫాలో అవ్వకపోతే చట్టపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు "క్రాస్ రోడ్స్ లో ఇకపై సెలబ్రేషన్స్ ఉండవా?" అంటూ డిలా పడుతున్నారు. 

అసలు వివాదం ఏంటంటే ? 
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' అనే పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోలలో భాగంగా డిసెంబర్ 4న రాత్రి అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో సినిమాను చూడడానికి వచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి తరలిరాగా, ఓ మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తీవ్ర వివాదానికి దారి తీయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. ఇక ఈ ఘటనకు కారణం అంటూ అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు కాగా, 'పుష్ప 2' చిత్ర బృందం శ్రీతేజకి రెండు కోట్ల భారీ సాయాన్ని ప్రకటించింది.

వివాదమైతే సద్దుమణిగింది. కానీ అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం ఈ కేసులో ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని తెలిసినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు వినిపించాయి. దీంతో మరోసారి అలాంటి ఘటన రిపీట్ కాకుండా ఉండడానికే సంధ్య థియేటర్ యాజమాన్యం తాజాగా ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దీంతో 'గేమ్ ఛేంజర్' మూవీకి ఎలాంటి హడావిడి లేకుండా పోయింది.

Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Metro News:  నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
నెరవేరనున్న విజయవాడ, విశాఖ మెట్రో కల - నిధులు మంజూరు చేసిన కేంద్రం
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
Nara Lokesh: ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ - మల్లవల్లిలో అశోక్ లేలాండ్ బస్సుల ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
ఔరంగజేబ్ సమాధి తొలగించాలని నాగపూర్‌లో ఆందోళనలు - ఇదంతా చావా సినిమా తెచ్చిన చావేనంటున్న మహారాష్ట్ర సీఎం
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Kannappa Songs: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
మోహన్ బాబు బర్త్ డే స్పెషల్... 'కన్నప్ప'లో 'ఓం నమః శివాయ' సాంగ్ గ్లింప్స్ రిలీజ్
Embed widget