అన్వేషించండి

Sandhya Theatre : 'గేమ్ ఛేంజర్'పై 'పుష్ప 2' వివాదం ఎఫెక్ట్... ఇకపై ఆ పనులు కుదరవంటూ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన సంధ్య థియేటర్

Sandhya Theatre : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ దగ్గర 'గేమ్ ఛేంజర్' రిలీజ్ సందర్భంగా అనుకోని ఘటనలు జరగకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు.

అభిమాన హీరోల సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే చాలు ఫ్యాన్స్ చేసే సందడి అంతా కాదు. థియేటర్ల ముందు టపాసులు పేల్చడం దగ్గర నుంచి మొదలు పెడితే... భారీ కటౌట్లు, థియేటర్లలో ఈలలు గోలలు, హీరో ఎంట్రీ రాగానే పేపర్లు చల్లడం వంటి హంగామా గట్టిగానే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అందరినీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ ఘటన ఇకపై థియేటర్ల దగ్గర ఎలాంటి హంగామా లేకుండా చేసింది. 

సంధ్య థియేటర్ వద్ద కొత్త రూల్స్ 
హైదరాబాద్లో ఉన్న కొన్ని థియేటర్లను సెంటిమెంట్ గా భావిస్తారు. అందులో సంధ్య థియేటర్ కూడా ఒకటి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న ఈ థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో తమ అభిమాన హీరోల సినిమాలు చూడాలని ఎంతోమంది అభిమానులు ఉత్సాహపడుతుంటారు. కానీ ఆ ఉత్సాహం ప్రాణాల మీదకు తీసుకొస్తే, అది పూడ్చలేని నష్టం అవుతుంది. అందుకే తాజాగా జరిగిన తొక్కిసలాట ఘటనతో ఒకసారిగా ఉలిక్కిపడింది టాలీవుడ్. దీంతో ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా కండిషన్స్ పెట్టింది సదరు థియేటర్ యాజమాన్యం.

అందులో భాగంగా ప్రతి ఒక్కరూ లైన్ లోనే థియేటర్లోకి అడుగు పెట్టాలని, టికెట్ లేనివారికి ఎంట్రీ లేదని స్ట్రిక్ట్ గా గేటు బయట పెద్ద పెద్ద పోస్టర్ల ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా థియేటర్లలో క్రాకర్స్ పేల్చవద్దని, మంటలకు కారణమయ్యే ఇతర ఐటమ్స్ ని, లైటర్స్ లాంటి వాటిని తీసుకురావద్దని హెచ్చరించింది. ఒకవేళ ఈ కండిషన్స్ ను ఫాలో అవ్వకపోతే చట్టపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు "క్రాస్ రోడ్స్ లో ఇకపై సెలబ్రేషన్స్ ఉండవా?" అంటూ డిలా పడుతున్నారు. 

అసలు వివాదం ఏంటంటే ? 
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' అనే పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోలలో భాగంగా డిసెంబర్ 4న రాత్రి అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో సినిమాను చూడడానికి వచ్చారు. ఈ విషయం తెలిసిన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి తరలిరాగా, ఓ మహిళ అక్కడ జరిగిన తొక్కిసలాటలో చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన తీవ్ర వివాదానికి దారి తీయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు. ఇక ఈ ఘటనకు కారణం అంటూ అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు కాగా, 'పుష్ప 2' చిత్ర బృందం శ్రీతేజకి రెండు కోట్ల భారీ సాయాన్ని ప్రకటించింది.

వివాదమైతే సద్దుమణిగింది. కానీ అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం ఈ కేసులో ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని తెలిసినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు వినిపించాయి. దీంతో మరోసారి అలాంటి ఘటన రిపీట్ కాకుండా ఉండడానికే సంధ్య థియేటర్ యాజమాన్యం తాజాగా ఈ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దీంతో 'గేమ్ ఛేంజర్' మూవీకి ఎలాంటి హడావిడి లేకుండా పోయింది.

Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhurandhar 2 Review : ధురంధర్‌లో మేజర్ ఇక్బాల్ - అది నా రివెంజ్... 26/11 భయానక అనుభవంపై నటుడు అర్జున్ రాంపాల్ రియాక్షన్
ధురంధర్‌లో మేజర్ ఇక్బాల్ - అది నా రివెంజ్... 26/11 భయానక అనుభవంపై నటుడు అర్జున్ రాంపాల్ రియాక్షన్
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Singer Mangli : మైక్రో ఫైనాన్స్... కోట్ల స్కామ్ ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్
మైక్రో ఫైనాన్స్... కోట్ల స్కామ్ ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్
Hey Balwanth OTT : ఓటీటీలోకి సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుహాస్ కామెడీ ఎంటర్టైనర్ హే బల్వంత్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget