RC15 Update: యూనివర్సిటీకి వెళ్తున్న రామ్ చరణ్, కియారా అడ్వాణీ! ఎక్కడంటే?
Ram Charan Shankar movie latest update: రామ్ చరణ్, కియారా అడ్వాణీ యూనివర్సిటీకి వెళ్తున్నారు. ఎక్కడ? ఏమిటి? అంటే...

'ఆర్ఆర్ఆర్' యూనిట్ అంతా సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉంది. ఇటీవల రాజమౌళి అండ్ కో, చిత్ర బృందానికి 'దిల్' రాజు పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్... మరోవైపు నెక్స్ట్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు.
మెగా పవర్ రామ్ చరణ్ కథానాయకుడిగా సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి పంజాబ్ రాజధాని అమృత్సర్లో లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. అక్కడ రామ్ చరణ్, హీరోయిన్ కియారా అడ్వాణీ తదితరులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.
అమృత్సర్లో ఒక యూనివర్సిటీలో షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఆల్రెడీ పుణె, రాజమండ్రి, హైదరాబాద్లో సినిమా షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ లేటెస్ట్ షెడ్యూల్ ఈ నెలాఖరు (ఏప్రిల్ 25) వరకూ కొనసాగుతుందని తెలిసింది. అమృత్సర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత విశాఖలో ఒక షెడ్యూల్, ఆ తర్వాత రాజమండ్రిలో మరో షెడ్యూల్ చేయాలని ప్లాన్ చేశారట.
Also Read: 'గాడ్ ఫాదర్' విడుదల తేదీ కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్!?
రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















