Peddi Release Date : రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ ఫిక్స్? - ప్లానింగ్ అయితే పర్ఫెక్ట్...
Peddi Update : రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పెషల్ సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉండగా... మిగిలిన పార్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

Ram Charan's Peddi Release Date Locked : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబోలో రాబోతోన్న విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ నెల 30న రిలీజ్ కావాల్సిన మూవీ అనుకోని కారణాలతో జూన్కు వాయిదా పడింది. రిలీజ్ డేట్పై లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిలీజ్ ఎప్పుడంటే?
మొదటి నుంచి పెద్ది జూన్ ఫస్ట్ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ రిలీజ్ కావొచ్చంటూ ప్రచారం సాగింది. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల పెండింగ్ దృష్ట్యా జూన్ 4న వచ్చే ఛాన్స్ లేదని... జూన్ 25న విడుదల కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. అంతే కాకుండా 24న రాత్రి నుంచే ప్రీమియర్స్ కూడా పడే అవకాశం ఉందని ఇన్ సైడ్ వర్గాల టాక్. వీటిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఈ మూవీలో స్పెషల్ సాంగ్ షూట్ మినహా మిగిలిన పార్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్గానే షూటింగ్ అప్జేట్ను షేర్ చేసుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. చరణ్తో ఫోటోను షేర్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఈక్వెల్గానే జరుగుతున్నట్లు చెప్పారు.
Also Read : కియారా అద్వానీ మెడలో శిలువ లాకెట్స్ - ఫ్యాషన్ వర్సెస్ నమ్మకం... నెట్టింట ఇదే హాట్ టాపిక్
స్పెషల్ సాంగ్లో శ్రుతి హాసన్
పెద్దిలో స్పెషల్ సాంగ్లో హీరోయిన్ శ్రుతి హాసన్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో పూాజ హెగ్డే, మృణాల్ ఠాకూర్, మానస వారణాసి, సంయుక్త మీనన్ పేర్లు వినిపించినా స్టార్ హీరోయిన్ శ్రుతినే ఈ సాంగ్ కోసం సెలక్ట్ చేశారట. అయితే, అఫీషియల్గా దీనిపై ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. గతంలో ఆమె మహేశ్ బాబు ఆగడు మూవీలో చేసిన స్పెషల్ సాంగ్ భారీగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు చరణ్తో కలిసి శ్రుతి స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా స్టెప్పులు వేయనున్నారట.
బాలీవుడ్లోనూ శ్రుతి హాసన్ పలు స్పెషల్ సాంగ్స్ చేయగా ట్రెండ్ అయ్యాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ డ్యాన్స్ నెంబర్కు ఆమెను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ షూట్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నారు.
ఈ మూవీలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా... కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు, సాయి కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















