![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mahesh Babu Pooja Hegde : మహేష్ బాబు సినిమా నుంచి పూజా హెగ్డే అవుట్? తమన్ కూడా!
Guntur Kaaram Movie Changes : 'గుంటూరు కారం' సినిమా ,చిత్రీకరణ ఓ అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉంటుందని ఫిల్మ్ నగర్ గుసగుస. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం... ఈ సినిమాలో పూజా హెగ్డే లేరట!
![Mahesh Babu Pooja Hegde : మహేష్ బాబు సినిమా నుంచి పూజా హెగ్డే అవుట్? తమన్ కూడా! Pooja hegde and music director Thaman Out Of Mahesh Babu Trivikram's Guntur Kaaram, Deets Inside Mahesh Babu Pooja Hegde : మహేష్ బాబు సినిమా నుంచి పూజా హెగ్డే అవుట్? తమన్ కూడా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/20/3766fb50e5b82cb262cd45f8eebf62b71687238174842313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)ది సూపర్ హిట్ కాంబినేషన్! వాళ్ళిద్దరి కలయికలో 'అతడు', 'ఖలేజా' వంటి క్లాసిక్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం' తెరకెక్కుతోంది. అయితే... ఈ సినిమా చిత్రీకరణ అంత సాఫీగా జరగడం లేదని ఫిల్మ్ నగర్ గుసగుస.
ఓ అడుగు ముందుకు పడితే, రెండు అడుగులు వెనక్కి అన్నట్టు 'గుంటూరు కారం' సినిమా పరిస్థితి ఉందని సమాచారం. కథ మాత్రమే కాదు... కీ టెక్నీషియన్, ఇంకా హీరోయిన్ కూడా మారుతున్నారని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
బుట్టబొమ్మ పూజా హెగ్డే అవుట్!?
'గుంటూరు కారం'లో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. ఒకరు పూజా హెగ్డే (Pooja Hegde) కాగా... ఇంకొకరు శ్రీ లీల. త్రివిక్రమ్ లాస్ట్ రెండు సినిమాలు 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత వీర రాఘవ'లో పూజా హెగ్డే నటించారు. ఆయన దర్శకత్వంలో ఆమెకు మూడో చిత్రమిది.
ఇంతకు ముందు సమంతతో మూడు సినిమాలు చేశారు త్రివిక్రమ్. ఇలియానాతో రెండు సినిమాలు చేశారు. సమంత తర్వాత మరోసారి పూజా హెగ్డేతో మూడు సినిమాలు చేస్తున్నారని 'గుంటూరు కారం' సినిమా ప్రకటన వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకొన్నారట! ప్రస్తుతానికి కారణాలు ఏమిటనేది బయటకు రాలేదు కానీ 'గుంటూరు కారం'లో పూజా హెగ్డే లేరనే మాట నిజమేనని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిజం చెప్పాలంటే... కొన్ని రోజులు పూజా హెగ్డే షూటింగ్ కూడా చేశారు.
సంగీత దర్శకుడు తమన్ కూడా అవుట్!
పూజా హెగ్డే కంటే ముందు సంగీత దర్శకుడు తమన్ (SS Thaman)ను సైతం 'గుంటూరు కారం' నుంచి తప్పించారని తెలిసింది. అసలు, సినిమా ప్రారంభం కావడానికి ముందు నుంచి తమన్ బదులు మరొక సంగీత దర్శకుడిని తీసుకోమని త్రివిక్రమ్ మీద మహేష్ బాబు ఒత్తిడి తీసుకొచ్చినట్టు వార్తలొచ్చాయి.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
'అరవింద సమేత వీర రాఘవ' సినిమాతో మొదలైన త్రివిక్రమ్, తమన్ బంధం మొదలు అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన, చేస్తున్న కొన్ని సినిమాలతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన కొన్ని సినిమాలకు కూడా కంటిన్యూ అవుతోంది. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', ఇప్పుడు 'బ్రో' సినిమాలకు తమన్ సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం వెనుక త్రివిక్రమ్ ఉన్నారని ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకూ తెలుసు. త్రివిక్రమ్ వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలకు పని చేసే అవకాశం వచ్చిందని తమన్ సైతం చెప్పారు. త్రివిక్రమ్ సినిమాలకు ఆయన సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. అయితే... తమన్ సంగీతం పట్ల మహేష్ బాబు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? 'సర్కారు వారి పాట' సంగీతం ఆయనకు నచ్చలేదా? మరొక కారణం ఉందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
తమన్ బదులు జీవీ ప్రకాష్ కుమార్!
తమన్ బదులు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన 'సార్'కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సితార, ఫార్చ్యూన్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న కొన్ని సినిమాలకూ ఆయన పని చేస్తున్నారు. తమన్ వద్దంటే వద్దని మహేష్ ఒత్తిడి చేయడంతో జీవీని తీసుకున్నారట.
Also Read : తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)