News
News
X

ఒక ఎన్టీఆర్, ఒక చిరు, ఒక రాజమౌళి - టాలీవుడ్‌కు నడక నేర్పారు, ఉనికి చాటారు, ఎల్లలు దాటించారు!

టాలీవుడ్ గురించి ఈ రోజు ప్రపంచం మాట్లాడుకుంటోంది అంటే ఎంతోమంది సినీ ప్రముఖుల శ్రమ ఉంది. నాడు ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినీ దిగ్గజాలు పునాది వేస్తే దాన్ని చిరు నిలబెట్టారు. రాజమౌళి ఎల్లలు దాటించారు.

FOLLOW US: 
Share:

తెలుగు సినిమా.. ఒక్కసారిగా గర్వంతో తలెత్తుకొంది. జక్కన్న గా ముద్దు పేరుతో టాలీవుడ్ పిలుచుకునే రాజమౌళి ప్రపంచ సినిమాపై రాజముద్ర వేసేశారు. ఇప్పుడు ఆ పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. ఆయనతో పాటే తెలుగు సినిమా కూడా..! ఇకపై ప్రపంచ సినిమా టాలీవుడ్ వైపు చూస్తుంది అనడం లో ఎలాంటి అనుమానం లేదు. ఆస్కార్ వచ్చింది ఒక పాటకే కావొచ్చు. కానీ దాని వెనుకున్న విజన్ మాత్రం 100 శాతం జక్కన్న దే. అయితే తెలుగు సినిమా అసలు ఈ స్థాయికి చేరడం వెనుక మూడు కీలక దశల్లో ముగ్గురు కీలక వ్యక్తుల చరిష్మా, విజన్ అని చెప్పవచ్చు.

టాలీవుడ్ ఉనికి చాటిన NTR

ఎప్పుడో 1921లో (అప్పటికే సినిమా మేకింగ్ పై ఉన్న అనుభవంతో) రఘుపతి వెంకయ్య తన కుమారుడు సూర్య ప్రకాష్ నాయుడుతో కలిసి నిర్మించిన తొలి తెలుగు మూవీ (మూకీ ) భీష్మ ప్రతిజ్ఞను రూపొందిస్తే.. 1931లో తొలి తెలుగు టాకీగా HM రెడ్డి నిర్మించిన భక్త ప్రహ్లాద ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి కమర్షియల్  సక్సెస్ మాత్రం తెలుగు సినిమాకు 1934లో సి.పుల్లయ్య తీసిన ‘లవకుశ’(NTRది కాదు)తో లభించింది. ఆ తరువాత తెలుగులో మంచి సినిమాలు రూపొందినా.. ఒకానొక దశలో తమిళ సినిమా డామినేషన్ ఎక్కువగా ఉండేది. ఆ సమయంలోనే.. అంటే 1948లో NTR టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే తెలుగులో ప్రముఖ జోనర్ గా ఉన్న జానపదాలు.. పౌరాణికాలు NTR రాకతో మరింత ఊపందుకున్నాయి. ఆయన స్పుర ద్రూపం.. వాయిస్.. ఆహార్యం.. ఇవన్నీ ప్రేక్షకులను తెలుగు సినిమాను ఓన్ చేసుకునేలా చెయ్యడంతో పాటు.. ఆ రెండు జోనర్స్ తీయాలంటే తెలుగు వారికే సాధ్యం అనేలా NTR ముద్ర వేశారు. సౌత్ సినిమా అంటే తమిళ సినిమా మాత్రమే అనే ఫీలింగ్ ను చేరిపేసింది NTR నటించిన సినిమాలే అంటే అతిశయోక్తి లేదు. ఆయన లాంటి హీరో చేతిలో ఉండడంతో KV రెడ్డి.. BN రెడ్డి.. కమలాకర కామేశ్వర రావు, విఠలాచార్య లాంటి దర్శకులు తమ దైన కథలతో చెలరేగిపోయారు. ఆ విధంగా భారతీయ సినిమాపై తెలుగు సినిమా ఉనికిని ఘనంగా చాటారు NTR.

తెలుగు సినిమా మార్కెట్ పెంచిన మెగాస్టార్

‘బిగ్గర్ దేన్ బచ్చన్’ - అమితాబ్ బచ్చన్ బాలీవుడ్‌లో రారాజుగా వెలుగుతున్న సమయంలో ‘The week’ మ్యాగజైన్‌లో చిరంజీవిపై వచ్చిన ఈ కథనం ఒక్కసారిగా బాలీవుడ్ ని ఉలిక్కిపడేలా చేసింది. 1993లో ఈ స్టోరీ పబ్లిష్ అవ్వడానికి ‘ఘరానా మొగుడు’ తర్వాత మారిన చిరు ఇమేజే కారణం. అంతకుముందు సంవత్సరం 1992లో విడుదలైన ‘ఘరానా మొగుడు’ సౌత్ ఇండియాలో మొట్టమొదటి సారిగా రూ.10 కోట్లు వసూలు చేసింది.1993లో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో మెయిన్ స్ట్రీమ్ విభాగం లో ఆ సినిమాను ప్రదర్శించారు కూడా. దానితో చిరు రెమ్యునరేషన్ కూడా కోటిన్నర కు చేరింది. అప్పట్లో రూ.20 లక్షలు ఉంటే మీడియం బడ్జెట్ సినిమాలు తీసేయొచ్చు. అలాంటి సమయంలో చిరంజీవి సినిమాలు వరుస బ్లాక్ బస్టర్‌లు సాధిస్తున్న సమయం. దానితో ఇతర నిర్మాతలు కూడా తమ సినిమాల బడ్జెట్‌లు పెంచేవారు. దానికి తగ్గట్టే తెలుగు సినిమాల మార్కెట్ కూడా భారీగా పెరిగింది. కేవలం ఉమ్మడి ఆంధ్రా అనే కాక.. తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, ముంబై లాంటి చోట్ల కూడా తెలుగు సినిమాలు విడుదల కావడం మొదలయింది. ఓ వైపు యాక్షన్ స్టార్ లుగా అమితాబ్, రాజేష్ ఖన్నా, జితేంద్రల శకం ముగుస్తున్న సమయం.. మరోవైపు ఖాన్ ల హవా ఇంకా పీక్ కు చేరుకోనే సందర్భం కావడంతో టాలీవుడ్ మార్కెట్ బాగా పెరిగింది. అప్పటి హిందీ మాస్ ప్రేక్షకులు కూడా తెలుగు హీరోలు.. సినిమాల వైపు ఆశక్తిగా చూసేవారు. ఆ ప్రభావాన్ని చూసే చిరంజీవితో ఏకంగా బాలీవుడ్ లో సినిమాలు తీసేవారు. అలా వచ్చినవే ‘ప్రతిబంధ్’, ‘ఆజ్ కా గుండా రాజ్’, ‘ది జెంటిల్ మేన్’. అదే సమయంలో నాగార్జున, వెంకటేష్ లాంటి తెలుగు స్టార్స్ కూడా హిందీలో నటించేవారు. ఇదంతా ఒక్కసారిగా తెలుగు సినిమాల మార్కెట్ పెరగడంతో వచ్చిన మార్పు. అయితే ఆ మార్పుకు కారణం చిరంజీవి సినిమాలు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ రోజుల్లో చిరంజీవి ఇమేజ్ రోజురోజుకీ పెరుగుతూ ఉండేది అంటారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ లాంటి వారు.

ప్రపంచ సినిమాపై జెండా పాతిన రాజమౌళి

చిరంజీవి లాంటి స్టార్ తీసుకున్న విరామం... ఖాన్‌ల హవా... వీటన్నింటి మధ్యా తెలుగు సినిమా కొన్నేళ్ల జాతీయ స్థాయిలో ఎఫెక్ట్ చూపించ లేదన్న మాట వాస్తవం. ఆ సమయంలో ‘బాహుబలి’తో ప్రభంజనం సృష్టించాడు రాజమౌళి. నిజానికి అంతకు ముందే ఈగ సినిమాతో టెక్నాలజీ పై తనకున్న పట్టు నిరూపించుకున్న రాజమౌళి తన ఊహల్లోని కథకు సాంకేతిక జోడిస్తూ ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అన్ని వుడ్ లనూ తన దర్శకత్వ ప్రతిభతో కమ్మ్మేశాడు. రోజుకో రకంగా మారే ట్రెండ్ ను ఐదేళ్ల ముందే ఊహిస్తూ.. దానికి తగ్గట్టు ఇప్పటి నుంచే సినిమాను చెక్కడం అంటే మాటలు కాదు. కేవలం దర్శకత్వమే కాకుండా.. సినిమాను మార్కెట్ చెయ్యడంలో కూడా ఆరితేరాడు మన జక్కన్న. దానితో ఇప్పుడు ఆయన పేరే ఒక బ్రాండ్ గా మారిపోయింది. ప్రస్తుతం తన సినిమాలో పాటకు ఆస్కార్ వచ్చినా.. క్రెడిట్ మాత్రం రాజమౌళికే ఇస్తున్నారు అంటే అందులో ఎలాంటి పొరబాటు కనిపించడం లేదు. దీనితో కేవలం రాజమౌళి మాత్రమే కాదు.. తెలుగు సినిమా అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఒక క్రొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది. OTT ల కాలంలో ఇది కొత్త తెలుగు దర్శకులకు మంచి అవకాశాలు తెచ్చే పరిణామమే కాకుండా.. ఇతర తెలుగు బడా దర్శకులకు కూడా తమ సినిమాలకు సంబంధించి మార్కెట్ విస్తరణకు మరిన్ని అవకాశాలు కల్పించినట్టే. అందుకే రాజమౌళి సినిమాలో పాటకు లభించిన ఆస్కార్ అవార్డ్ ను మొత్తం తెలుగు ఇండస్ట్రీ పండుగలా భావిస్తోంది. 

Also Read బాలకృష్ణ ఒక్కరే మా కుటుంబం - తారకరత్న భార్య సెన్సేషనల్ పోస్ట్ 

Published at : 14 Mar 2023 12:32 PM (IST) Tags: Rajamouli Oscars 2023 Chiranjeevi Oscars 2023 Telugu Tollywood Gaints

సంబంధిత కథనాలు

‘దసరా’కు ‘రావణాసుర’ సాయం - రవితేజను కలిసిన నాని, పెద్ద ప్లానే వేసినట్లున్నారుగా!

‘దసరా’కు ‘రావణాసుర’ సాయం - రవితేజను కలిసిన నాని, పెద్ద ప్లానే వేసినట్లున్నారుగా!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?

Kangana Ranaut on Thalaivii: కంగనాకు ‘తలైవి’ రూపంలో కొత్త చిక్కులు, ఆరు కోట్లు ఇవ్వాలంటూ ఆ సంస్థ డిమాండ్?

Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్ 

Padipotunna Song : ప్రేమలో 'పడిపోతున్న' అబ్బాయ్ - 'గేమ్ ఆన్'లో కొత్త సాంగ్ 

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

AP Highcourt : చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు - కర్నూలుకు తరలించాలంటే ఏం చేయాలో చెప్పిన కేంద్రం !

AP Highcourt : చట్ట ప్రకారమే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు - కర్నూలుకు తరలించాలంటే ఏం చేయాలో చెప్పిన కేంద్రం !