By: ABP Desam | Updated at : 05 May 2023 07:18 PM (IST)
Image Credit: Aditya Music/YouTube
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న మూవీ ‘మళ్లీ పెళ్లి’. ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ఇప్పటికే తాము రిల్ కపుల్స్ కాదు, రియల్ కపుల్స్ అని ఒప్పుకున్న ఈ జంట ఇందులో మళ్లీ పెళ్లి చేసుకోవడం, మూవీ సీన్స్ అన్నీ వారి నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో ప్రేక్షకులు ఈ మూవీ అప్డేట్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ట్రోలర్స్ కూడా ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా.. వాడేద్దామని చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజైంది. అయితే ఇది సాదాసీదా సాంగ్ కాదు. రొమాంటిక్ రైన్ సాంగ్.
'మళ్ళీ పెళ్లి' చిత్రంలోని 'రా రా హోసూరు నాతో' పాటను చిత్రయూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఆల్రెడీ విడుదల చేసిన 'ఉరిమే మేఘమా...' పాటకు మంచి స్పందన లభిస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. 'రా రా హోసూరు నాతో' సాంగ్లో నరేష్, పవిత్ర లోకేష్తోపాటు మరో జంట కూడా ఉంది. అనన్య నాగళ్ల తొలిసారి ఈ రైన్ సాంగ్ చేస్తోంది. ‘వర్షం’ సినిమాకు నిర్మాతగా ‘వాన’ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన ఎంఎస్ రాజుకు వర్షం పాటలు కొట్టిన పిండి. ఈ నేపథ్యంలో ఈ పాట కూడా ప్రేక్షకులకు నచ్చే అవకాశాలున్నాయి.
Read Also: అసత్య వార్తలపై శరత్ బాబు కుటుంబ సభ్యుల ఆగ్రహం, కేసు పెడతామని హెచ్చరిక
Malli Pelli Release On May 26th : వేసవిలో 'మళ్ళీ పెళ్లి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నెల 26న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
'మళ్ళీ పెళ్లి' చిత్రానికి మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకుడు. నరేష్ విజయ కృష్ణ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పున:ప్రారంభించారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు.
ఇటీవల సినిమాలో తొలి పాట 'ఉరిమే కాలమా...'ను విడుదల చేశారు. ఆ గీతానికి అనంత శ్రీరామ్ (Anantha Sriram) సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సురేష్ బొబ్బిలి అందించిన బాణీ అందించారు. లేటు వయసులో ప్రేమలో పడిన ఓ జంట పరిస్థితిని పాటలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక, టీజర్ చూస్తే నరేష్, పవిత్ర నిజ జీవితంలో జరిగిన అంశాలతో సినిమా తీసినట్లు అర్థం అవుతోంది. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు... ఆమె ప్రెస్ మీట్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని హోటల్ కు వెళ్లడం... ఆ మధ్య బెంగళూరులో నడిచిన హై డ్రామా... 'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తే అవన్నీ గుర్తుకు వస్తాయి.
జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
Arjun Kapoor-Malaika Arora: బెడ్పై అర్ధనగ్నంగా బాయ్ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపే!