అన్వేషించండి

Pushpa 2 : పుష్ప 2 సెకండ్ హాఫ్ మాత్రమే చూపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన థియేటర్ యాజమాన్యం, చివరకు ఏమైందంటే?

Pushpa 2 The Rule : కొచ్చిలోని ఒక థియేటర్‌లో అనుకోకుండా 'పుష్ప 2: ది రూల్' మూవీ సెకండాఫ్‌ను మాత్రమే ప్రదర్శించడం కలకలం రేపింది. థియేటర్ యాజమాన్యం పొరపాటు కారణంగా ప్రేక్షకులు అయోమయంలో పడ్డారు.

Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2 : ది రూల్' మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ ని రూల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాను ప్లే చేస్తున్న టైంలో ఓ థియేటర్లో వింత సంఘటన చోటు చేసుకుంది. థియేటర్ యాజమాన్యం 'పుష్ప 2' సెకండ్ హాఫ్ ను మాత్రమే స్క్రీనింగ్ చేసి ప్రేక్షకులని అయోమయంలో పడేసింది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2 : ది రూల్' మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు థియేటర్లలో ఈ మూవీ ద్వారా మాస్ ఫీస్ట్ అందించాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. సాధారణంగా సినిమా అంటే ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, సెకండ్ ఆఫ్ ఉంటాయి. కానీ విచిత్రంగా కొచ్చిలోని సినీ పోలీస్ సెంటర్ స్క్వేర్ థియేటర్లో మాత్రం కేవలం సెకండ్ హాఫ్ తో సినిమాను పూర్తి చేశారు. భారీ అంచనాలున్న ఈ సినిమాను చూడడానికి ఎంతో ఆతృతగా థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విచిత్రమైన అనుభవం ఎదురైంది. థియేటర్ యాజమాన్యం పొరపాటున సినిమా మొత్తాన్ని ప్రేక్షకులకు చూపించకుండా, కేవలం సెకండ్ హాఫ్ ని మాత్రమే ప్లే చేశారట. 

సాయంత్రం 6:30 గంటల షో సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వీక్షకులు ఎండ్ టైటిల్స్ పడుతున్న టైంలో అది ఇంటర్వెల్ అని అనుకున్నారట. ఎందుకంటే ఈ ఆధునిక సినిమా యుగంలో నాన్ లీనియర్ గా కథను చెప్పే ధోరణి పెరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది మాత్రం డౌట్ వచ్చి థియేటర్ మేనేజ్మెంట్ కి కంప్లైంట్ చేశారట. దాదాపు 3 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని తమ మిస్టేక్ వల్ల ప్రేక్షకులు చూడలేకపోయారని అసలు విషయం తరువాత తెలిసిందట. అది కూడా కొంతమంది థియేటర్ యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్ళాక. వాళ్ళు చేసిన తప్పిదం వల్ల నిరాశ చెందిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంపై ఫైర్ అయ్యారట. 

కొంతమంది ఆడియన్స్ థియేటర్ యాజమాన్యం చేసిన తప్పుకి తమ టికెట్ రేట్లకు చెల్లించిన డబ్బుని వాపస్ చేయాలని డిమాండ్ చేయగా, కొంతమంది మాత్రం సినిమా మొదటి అర్ధ భాగాన్ని మళ్ళీ ప్లే చేయాలని పట్టుబట్టారట. దీంతో సినీ పోలీస్ మేనేజ్మెంట్ స్పందిస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ను రాత్రి 9 గంటల షో టైంలో దాదాపు పది మందికి ప్లే చేయాలని డిసైడ్ అయ్యిందట. ఇక డబ్బు వాపస్ కావాలని డిమాండ్ చేసిన వారికి కూడా రిఫండ్ చేస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. మొత్తానికి ఈ గోల్ మాల్ తర్వాత ప్రేక్షకుల డిమాండ్ ను థియేటర్ యాజమాన్యం ఒప్పుకోవడంతో, అందరూ సంతోషంగా ఇళ్లకు వెనుదిరిగినట్టు తెలుస్తోంది.

Also Readనా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా వీరాంజనేయులు- పూర్తి వివరాలు
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా వీరాంజనేయులు- పూర్తి వివరాలు
India Pak Ceasefire: కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం చేయడానికి అసలు కారణం ఇదే! షాకింగ్ రిపోర్ట్
కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం చేయడానికి అసలు కారణం ఇదే! షాకింగ్ రిపోర్ట్
Murali Naik Final Rites: వీర జవానుకు కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో ముగిసిన మురళీ నాయక్ అంత్యక్రియలు
వీర జవానుకు కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో ముగిసిన మురళీ నాయక్ అంత్యక్రియలు
BrahMos Missiles in Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో టార్గెట్స్ ఛేదించాం- సీఎం యోగి ఆదిత్యనాథ్
ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో టార్గెట్స్ ఛేదించాం- సీఎం యోగి ఆదిత్యనాథ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Brahmos Missiles in Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ లో బ్రహ్మాస్త్రాన్ని వాడిన భారత సైన్యం | ABP DesamPM Modi Strategy no War | యుద్ధం వద్దని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం తప్పా | ABP DesamMurali Naik Final Rituals Army Respect | ముగిసిన అమరవీరుడు మురళీనాయక్ అంత్యక్రియలు | ABP DesamPakistan PM Shehbaz Sharif | భారత్ పై విజయాన్ని ప్రకటించుకున్న పాకిస్థాన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా వీరాంజనేయులు- పూర్తి వివరాలు
ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా వీరాంజనేయులు- పూర్తి వివరాలు
India Pak Ceasefire: కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం చేయడానికి అసలు కారణం ఇదే! షాకింగ్ రిపోర్ట్
కాల్పుల విరమణలో అమెరికా మధ్యవర్తిత్వం చేయడానికి అసలు కారణం ఇదే! షాకింగ్ రిపోర్ట్
Murali Naik Final Rites: వీర జవానుకు కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో ముగిసిన మురళీ నాయక్ అంత్యక్రియలు
వీర జవానుకు కన్నీటి వీడ్కోలు, అధికార లాంఛనాలతో ముగిసిన మురళీ నాయక్ అంత్యక్రియలు
BrahMos Missiles in Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో టార్గెట్స్ ఛేదించాం- సీఎం యోగి ఆదిత్యనాథ్
ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో టార్గెట్స్ ఛేదించాం- సీఎం యోగి ఆదిత్యనాథ్
Rag Mayur: 'శుభం'తో మరోసారి అప్రిసియేషన్... నెక్స్ట్ 'పరదా' & మోర్... డిఫరెంట్ రోల్స్‌తో రాగ్ మయూర్ జర్నీ
'శుభం'తో మరోసారి అప్రిసియేషన్... నెక్స్ట్ 'పరదా' & మోర్... డిఫరెంట్ రోల్స్‌తో రాగ్ మయూర్ జర్నీ
Crime News: కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి వ్యక్తి దారుణహత్య- మేడ్చల్‌లో ఘటన
కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి వ్యక్తి దారుణహత్య- మేడ్చల్‌లో ఘటన
Malavika Mohanan: కేరళలో మాళవికా మోహనన్ సందడి... బోట్ జర్నీలో ఎంజాయ్ చేస్తూ...
కేరళలో మాళవికా మోహనన్ సందడి... బోట్ జర్నీలో ఎంజాయ్ చేస్తూ...
Pawan Kalyan: కాళ్ల బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ తోక జాడించింది: పవన్ కళ్యాణ్
కాళ్ల బేరానికి వచ్చిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ తోక జాడించింది: పవన్ కళ్యాణ్
Embed widget