అన్వేషించండి

Jayasudha : హీరో పక్కవాళ్ళ డ్రామా ఎక్కువ, టాలీవుడ్‌లో వివక్ష ఉంది - జయసుధ షాకింగ్ కామెంట్స్

Jayasudha Comments On Tollywood and Padma Shri Award : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వివక్ష ఉందని ఒకప్పటి కథానాయిక, నటి జయసుధ అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు.

జయసుధ... తెలుగు ప్రేక్షకులు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. రెండు మూడు తరాల ప్రేక్షకులకు ఆవిడ తెలుసు. ఈ తరం ప్రేక్షకులకు నటిగా పరిచయం అయితే... కొన్నేళ్ళ క్రితం ప్రేక్షకులకు కథానాయికగా తెలుసు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుతో పాటు ఆ తరం హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితరుల సరసన కథానాయికగా సినిమాలు చేశారు. ఆ తర్వాత తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల‌తో సినిమాలు చేశారు. ఈ తరం హీరోలకు తల్లిగా నటిస్తున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జయసుధ ప్రస్థానం మొదలై యాభై సంవత్సరాలు. ఈ 50 ఏళ్ళలో ఎన్నో సినిమాలు చేసి, అందరి మన్ననలు పొందిన ఆవిడ... లేటెస్టుగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో వివక్ష ఉందని ఆమె అన్నారు.
 
ఎవరూ ఫ్లవర్ బొకే కూడా పంపలేదు
Jayasudha Completes 50 Years In Films: ''ఎవరైనా పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటే... హిందీ సినిమా ఇండస్ట్రీలో అయితే ఫ్లవర్ బొకేలు అయినా పంపిస్తారు. ఇక్కడ ఫ్లవర్ బొకే పంపించిన వాళ్ళు కూడా లేరు'' అని ఇండస్ట్రీలో పరిస్థితి గురించి జయసుధ చెప్పుకొచ్చారు. అదే ఒక హీరో అయితే... పరిస్థితి వేరేలా ఉంటుందన్నట్టు ఆమె వ్యాఖ్యానించారు. చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళను పిలిచి పార్టీ  ఇవ్వమని సలహా ఇచ్చారని, తనకు పార్టీ వద్దని అనిపించిందని ఆమె అన్నారు.
 
వివక్ష ఉంది... ముంబై నుంచి వస్తే కుక్కపిల్లకు రూమ్ ఇస్తున్నారు!
తెలుగు సినిమా పరిశ్రమలో వివక్ష ఉందని తనకు అనిపించినట్లు జయసుధ కాస్త బాధతో చెప్పారు. ''బాగా సక్సెస్ అయిన పెద్ద హీరోలను ఒకలా ట్రీట్ చేయడం... హీరో కంటే హీరోయిన్లను తక్కువగా ట్రీట్ చేయడం వంటివి ఉన్నాయి'' అని ఆమె అన్నారు. టాప్ హీరోయిన్ అయిన తర్వాత కూడా వివక్ష ఉందన్నారు. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లను ఒకలా ట్రీట్ చేస్తున్నారని... కుక్కపిల్లకు కూడా స్టార్ హోటల్ రూమ్ ఇస్తున్నారని జయసుధ ఘాటుగా వ్యాఖ్యానించారు.

హీరో కంటే హీరో పక్కన ఉన్నవాళ్ళ డ్రామా ఎక్కువ ఉంటుందని జయసుధ సూటిగా చెప్పారు. హీరోకు డ్యాన్స్ రాకపోతే హీరోయిన్ దగ్గరకు వచ్చి 'మూమెంట్ కరెక్టుగా చేయలేదేంటి?' అని అడుగుతారని ఆమె నవ్వేశారు. 

'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) బిల్డింగ్ కడతామని మురళీమోహన్ గారు అధ్యక్షులుగా పని చేసినప్పటి నుంచి చెబుతున్నారని, మరో 25 ఏళ్ళ తర్వాత అయినా కడతారో? లేదో? అని జయసుధ సందేహం వ్యక్తం చేశారు. 'మా' ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల గురించి చెప్పాలంటే... తన 50 ఏళ్ళ కెరీర్ అంత ఉంటుందని ఆమె అన్నారు.

Also Read : ఫుడ్ బిజినెస్‌లోకి మహేష్ బాబు - త్వరలో హైదరాబాద్‌లో రెస్టారెంట్
 
పద్మశ్రీ ఎందుకు రాలేదు?
పద్మ పురస్కారాల ప్రస్తావన కూడా జయసుధ ఇంటర్వ్యూలో వచ్చింది. 'మీకు ఎందుకు పద్మశ్రీ రాలేదు?' అని తనను చాలా మంది అడిగినట్లు జయసుధ తెలిపారు. కంగనా రనౌత్‌కు పద్మశ్రీ ఇచ్చారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బహుశా... కంగనా కంటే తాను ఏమి తక్కువ అనేది జయసుధ ఉద్దేశం కాబోలు! జయసుధ పద్మశ్రీ పురస్కారానికి అర్హురాలు అనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. వచ్చే ఏడాది అయినా ఆమెకు దక్కాలని ఆశిద్దాం!

Also Read : ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget