News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..

మలయాళం ఇండస్ట్రీలో ఇటీవల విడుదలై సంచలన విషయాన్ని అందుకున్న '2018' మూవీ జూన్ 7 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే అదే రోజు కేరళలోని థియేటర్ ఓనర్స్ నిరసనకు పిలుపునిచ్చారు.

FOLLOW US: 
Share:

'2018'. రీసెంట్ టైమ్స్ లో మలయాళ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సినిమా ఇది. 2018వ సంవత్సరంలో కేరళలో వచ్చిన భారీ వరదల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వరదల వల్ల ఎంత నష్టం జరిగింది అనే తదితర అంశాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు మేకర్స్. జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మలయాళ అగ్ర హీరో థామస్ ప్రధాన పాత్రలో నటించగా. కుంచకు బోబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి ఇతర కీలకపాత్రలు పోషించారు. మే 5న ఓ చిన్న సినిమాగా మలయాళం లో విడుదలైన మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం విడుదలైన 17 రోజుల్లోనే రూ.138 కోట్లు రాబట్టి మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత మలయాళం లో పెద్ద హిట్ అవ్వడంతో ఇతర భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

ఈ క్రమంలోనే మే 26న '2018' మూవీ తెలుగులో కూడా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమాని ప్రముఖ నిర్మాత బన్నీవాస్ రిలీజ్ చేయగా తెలుగు ఆడియన్స్ ని సైతం ఈ మూవీ విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తెలుగులోను ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని అందుకోవడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కి బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ జూన్ 7వ తేదీన ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లీవ్ లో 2018 మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీలో జూన్ 7 నుంచి సోనీ లీవ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అప్సెట్ అయిన థియేటర్ ఓనర్స్ ఇప్పుడు ఆందోళనకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం థియేటర్స్ లో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కలెక్షన్స్ ని సంపాదిస్తున్న 2018 సినిమాను ఓటీటీ లో అప్పుడే ప్రసారం చేయకూడదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.

అలా చేస్తే తాము నష్టపోతామని జూన్ 7వ తేదీన నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాజాగా ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(FEUOK) జూన్ 7, 8 తేదీల్లో థియేటర్స్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. 2018 సినిమాని ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్న సందర్భంగా ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (FEUOK) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సినిమా విడుదలైన 42 రోజుల తర్వాతే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని కేరళ అసోసియేషన్ థియేటర్ ఓనర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూన్ 7, 8 బుధ, గురు వారాల్లో తమ నిరసనను తెలియజేస్తూ థియేటర్స్ ని మూసేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు మూవీ టీం స్పందించలేదు. మరి దీనిపై మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Also Read: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లైవ్ - బోరున వర్షం, అయినా వెనక్కి తగ్గని అభిమానులు

Published at : 06 Jun 2023 08:41 PM (IST) Tags: 2018 Movie Tovino Thomas 2018 Movie 2018 Movie OTT Release 2018 Movie On Soni Liv OTT

ఇవి కూడా చూడండి

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

Vishal: సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్

Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

Nayanthara: వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !