MS Raju New Movie : మిస్టిక్ థ్రిల్లర్ అగధ - జానర్ మార్చిన ఎమ్మెస్ రాజు... ఒక్క పోస్టర్తోనే...
Agadha First Look : ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు న్యూ జానర్లో మిస్టికల్ థ్రిల్లర్ 'అగధ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫస్ట్ పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

MS Raju's Mystical Thriller Agadha First Look Revealed : చీకటి గుహ... భయంకర విగ్రహం... దాని ముందు విభిన్న వేషధారణలో ఓ అమ్మాయి. కేవలం లుక్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటిది ఇక మూవీ గురించి ఆలోచిస్తే సూపర్ థ్రిల్ పంచడం ఖాయంగానే కనిపిస్తుంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు న్యూ జానర్ మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంటే ఇది.
టాలీవుడ్ ఎమ్మెస్ రాజు అంటేనే ఓ సెపరేట్ బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్పై ఆయన నిర్మించిన శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీస్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అలాగే, డర్టీ హరి, మళ్లీ పెళ్లి చిత్రాలతో దర్శకునిగానూ న్యూ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కంప్లీట్గా జానర్ మార్చి మిస్టికల్ థ్రిల్లర్గా 'అగధ'ను రూపొందిస్తున్నారు.
డివైన్ మిస్టికల్ థ్రిల్లర్ 'అగధ'
గతంలో తీసిని రొమాంటిక్ లవ్ స్టోరీస్కు భిన్నంగా ఈసారి మిస్టికల్ డివైన్ థ్రిల్లర్గా 'అగధ'ను రూపొందిస్తున్నారు ఎంఎస్ రాజు. దాదాపు ఏడాది పాటు ఈ ప్రాజెక్టుపైనే ఆయన వర్క్ చేస్తున్నారు. ప్రమోషన్స్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు. ఎమ్మెస్ రాజు ఆఫీసులో ఇద్దరు దొంగలు చోరీకి వెళ్లడం... అక్కడ ఓ పోస్టర్ చూసి భయపడడంతో వీడియో ఎండ్ అవుతుంది. చీకటి గుహలో భయంకర ఆకారం కలిగిన విగ్రహం ముందు ఓ అమ్మాయి నిలబడడం... హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ మూవీని శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో భారీ ఎత్తున రూపొందిస్తున్నారు. కాశీ విశాలాక్షి బలుసు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న 'అగధ' షూటింగ్ కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
View this post on Instagram
Also Read : చరణ్ సార్... మరో ఛాన్స్ ప్లీజ్ - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కామెంట్... 'పెద్ది' తర్వాత కన్ఫర్మేనా!
45 నిమిషాల 'VFX'
'అగధ' మూవీలో 45 నిమిషాల VFX ఉంటుందని చెప్పారు ఎమ్మెస్ రాజు. ఇదో మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ అని... ఇందులో నటీనటులు ఎవరనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. డిఫరెంట్ లొకేషన్స్లో 85 రోజులు షూట్ చేసినట్లు వెల్లడించారు. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : మిక్కిన్ అరుల్ దేవ్, DOP : నాని చమిడిశెట్టి, ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్, అడిషనల్ స్క్రీన్ ప్లే : చైతన్య వేగి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : ఎన్. వి. ఎన్. సుబ్బరాజ్, నిర్మాత : కాశీ విశాలాక్షి బలుసు, రచన - దర్శకత్వం : ఎమ్మెస్ రాజు.
ట్రెండింగ్ వార్తలు


















