By: ABP Desam | Updated at : 26 Feb 2023 12:39 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Naseeruddin Shah/Instagram
ఒకప్పుడు హిందీ సినీ పరిశ్రమ చిన్ని చూపు చూసిన సౌత్ సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వసూళ్ల పరంగానే కాకుండా, ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొడుతున్నాయి. ‘RRR’, ‘KGF’, ‘పుష్ప’ లాంటి సినిమాలు సౌత్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజికి తీసుకెళ్లాయి. చిన్న సినిమాలుగా విడుదలైన పలు సౌత్ సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్నాయి. ‘కాంతార’, ‘కార్తికేయ-2’, ‘సీతారామం’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ 2022 ఒకటి రెండు మినహా పెద్దగా హిట్ అయిన సినిమా లేవీ లేవు. ఈ నేపథ్యంలో సౌత్ సినిమాలపై దేశ, విదేశాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా సైతం సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి వచ్చిన కమర్షియల్ సినిమాలు తిరుగులేని విజయాలను అందుకుంటున్నాయని నసీరుద్దీన్ వెల్లడించారు. ఈ చిత్ర పరిశ్రమలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కణల ప్రదర్శనే లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలు సినిమాలు నిలకడగా విజయాలను సాధిస్తున్నాయన్నారు. సౌత్ ఫిల్మ్ మేకర్స్ ఊహాజనితమైన సన్నివేశాలలను సైతం అద్భుతంగా తెరపై ప్రెజెంట్ చేయగలుగుతున్నారని షా చెప్పారు. తెరపై అనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా చూపించడంలో సక్సెస్ అవుతున్నారని వెల్లడించారు. “తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో చేసిన కమర్షియల్ సినిమాలు ఊహాజనితంగా ఉంటాయి. కానీ, వాటిని తెరకెక్కించే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రూపొందిస్తారు. ఈ విషయాన్ని నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నాను. వారి పాటల చిత్రీకరణ కూడా, జితేంద్ర, శ్రీదేవి కాలంలో నుంచి సరికొత్త మార్పులతో వస్తున్నా, ఒకే లైన్ ప్ ను కలిగి ఉన్నాయి. సౌత్ సినిమాలు చాలా హిందీ సినిమాల కంటే మెరుగ్గా ఉన్నాయి” అని తెలిపారు.
ఎవరైనా ఇష్టపడినా, ఇష్టపడకపోయినా రాబోయే కాలంలో ఎంటర్ టైన్మెంట్ రంగాన్ని ఏలేది డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లేనని ఆయన వెల్లడించారు. భవిష్యత్ లో సినిమా హాళ్లు అంతరించే అవకాశం ఉందన్నారు. “ఎంటర్ టైన్మెంట్ రంగం భవిష్యత్ అంతా ఓటీటీల మీదే ఆధారపడబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా హాళ్లు అదృశ్యమవుతాయని నేను కొంతకాలంగా అంచనా వేస్తున్నాను. ఇంకో 10 ఏళ్లలో సినిమా థియేటర్ అనేదే ఉండదని అనుకుంటున్నాను” అని షా వెల్లడించారు. ప్రస్తుతం ZEE5 సిరీస్ ‘తాజ్ - డివైడెడ్ బై బ్లడ్’లో నసీరుద్దీన్ షా కింగ్ అక్బర్గా కనిపించనున్నారు. మార్చి 3న ZEE5లో ప్రసారం అవుతుంది.
Read Also: శంకర్ అదిరిపోయే ప్లాన్ - పండుగలే టార్గెట్గా చరణ్, కమల్ మూవీస్ రిలీజ్
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్కు చేరుకున్న క్యాపిటల్స్!
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !