![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss 7 Telugu Grand Finale Live Updates: ‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ - రూ.35 లక్షలు పేద రైతులకు ఇస్తానన్న రైతు బిడ్డ
Bigg Boss Season 7 Telugu Grand Finale Live : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఈ పేజ్ను చూస్తుండండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం.. టీవీలో లైవ్ కంటే ముందే అందిస్తాం.
LIVE
![Bigg Boss 7 Telugu Grand Finale Live Updates: ‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ - రూ.35 లక్షలు పేద రైతులకు ఇస్తానన్న రైతు బిడ్డ Bigg Boss 7 Telugu Grand Finale Live Updates: ‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ - రూ.35 లక్షలు పేద రైతులకు ఇస్తానన్న రైతు బిడ్డ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/17/5f1ed35d9d8b19801f1108c19cd31a751702793300694239_original.jpg)
Background
Bigg Boss Season 7 Telugu Grand Finale Live Updates : ‘బిగ్ బాస్’ సీజన్ 7 ఉల్టాపుల్టా.. ఆదివారం రాత్రితో ముగియనుంది. డిసెంబరు 17, రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ఎవరో తేలిపోనుంది. హౌస్లో ఉన్న టాప్-6 కంటెస్టెంట్లలో ఇప్పటికే నలుగురు బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. యావర్, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని సమాచారం. అయితే, యావర్ రూ.15 లక్షల సూట్కేస్తో హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. చివరిగా శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఉన్నట్లు సమాచారం.
అయితే, శివాజీ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తాజా సమాచారం. అంటే.. తుదిపోరు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్యే ఉందన్నమాట. అయితే, ఇప్పటికే విన్నర్ ఎవరు అనేది సోషల్ మీడియా తేల్చేసింది. పల్లవి ప్రశాంత్ తప్పకుండా ట్రోపీ గెలుచుకుంటాడని, అతడి మాత్రమే దానికి అర్హుడనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి, అధికారిక ఓటింగ్ ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే.. శివాజీ తన ప్రవర్తన వల్ల అభిమానులను కోల్పోవడంతో అంతా అమర్, పల్లవి ప్రశాంత్కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అమర్కు సీరియల్ ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫాలోయింగ్ లభిస్తోంది. దీంతో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ‘బిగ్ బాస్’ నిర్వాహకులకే తెలుస్తుంది.
ఆదివారం ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో హౌస్ నుంచి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ అంతా పాల్గొన్నారు. అయితే, షకీలా, కిరణ్ రాథోడ్ మాత్రం హాజరు కానట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో వారిద్దరు కనిపించలేదు.
ఎప్పుడు మొదలైంది? ఎంతమంది కంటెస్టెంట్స్?
ఉల్టాపుల్టా కాన్సెప్ట్తో సెప్టెంబరు 3న ‘బిగ్ బాస్’ సీజన్ 7 మొదలైంది. మొదట్లో 14 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ 2.0 పేరుతో మరో నలుగురికి హౌస్లోకి పంపారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ వీళ్లే.
ఏయే కంటెస్టెంట్ ఎప్పుడు ఎలిమినేట్ అయ్యారంటే..
1. కిరణ్ రాథోడ్ (నటి) - మొదటి వారం ఎలిమినేటెడ్
2. షకీలా (నటి) - 2వ వారం ఎలిమినేటెడ్
3. దామిని (సింగర్) - 3వ వారం ఎలిమినేటెడ్
4. రతిక (నటి, ఇన్ఫ్లూయెన్సెర్) - 4వ వారం, రీ ఎంట్రీ తర్వాత 11వ వారం
5. శుభశ్రీ (లాయర్, నటి) - 5వ వారం ఎలిమినేటెడ్
6. నయని పావని (నటి) - 6వ వారం ఎలిమినేటెడ్
7. పూజ (సీరియల్ నటి) - 7వ వారం ఎలిమినేటెడ్
8. ఆట సందీప్ (కొరియోగ్రాఫర్) - 8వ వారం ఎలిమినేటెడ్
9. టేస్టీ తేజ (జబర్దస్త్ కమెడియన్) - 9వ వారం ఎలిమినేటెడ్
10. భోలే షావలి - 10వ వారం ఎలిమినేటెడ్
11. అశ్వినీ శ్రీ - 11వ వారం
12. డాక్టర్ గౌతం (నటుడు) - 12వ వారం ఎలిమినేటెడ్
13. శోభా శెట్టి (‘కార్తీక దీపం’ నటి) - 13వ వారం ఎలిమినేటెడ్
టాప్-6 ఫైనలిస్టులు వీరే
1. పల్లవి ప్రశాంత్ (రైతు) - ఫైనలిస్ట్
2. అమర్ దీప్ (‘జానకి కలగనలేదు’ నటుడు) - ఫైనలిస్ట్
3. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు) - ఫైనలిస్ట్
4. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి) - ఫైనలిస్ట్
5. శివాజీ (హీరో) - ఫైనలిస్ట్
6. అర్జున్ అంబాటీ (సీరియల్ నటుడు) - ఫైనలిస్ట్
‘బిగ్ బాస్’ సీజన్ 7కు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్, స్పెషల్ స్టోరీస్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
గెలుచుకున్న రూ.35 లక్షలు రైతులకే ఇస్తా: పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ రూ.35 లక్షలు.. కష్టాల్లో ఉన్న రైతులకే ఇస్తానని పల్లవి ప్రశాంత్ తెలిపాడు. బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘రూ.35 లక్షలను రైతుల కోసం ఇస్తాను. కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్క రైతుకు ఇస్తా. పొట్ట మీద చేయి వేసుకొని చెప్తున్నా. మాట తప్పేదే లేదు. మళ్లీ వచ్చా అంటే తగ్గేదే లే. రైతుల కోసం ఆడినా, కారు నాన్నకు ఇస్తా, నక్లెస్ అమ్మకు ఇస్తా. డబ్బు జనాలకు ఇస్తా’’ అని తెలిపాడు. ‘‘ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఒక విషయం చెబుతా. ప్రతి రోజు ఇక్కడనే తిరిగినా. తినని రోజులు కూడా ఉన్నాయి. ఇంట్లో చెప్పలేదు. వాళ్లకు తిన్నానని అబద్ధం చెప్పేవాడిని. ముందుకు నడువు, నేను వెనక ఉంటా అని బాపు మాట ఇచ్చాడు. సార్తో పరిచయమైంది. నాగార్జునను చూడగానే మాట రాలేదు’’ అంటూ నాగార్జునపై ఎమోషనల్గా కవిత చెప్పాడు ప్రశాంత్.
‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ - రన్నరప్ అమర్ దీప్
‘బిగ్ బాస్’ సీజన్ 7లో టాప్ 2 కంటెస్టెంట్స్గా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ నిలిచారు. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి వారిని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్గా పల్లవి ప్రశాంత్ పేరును ప్రకటించారు. అమర్ దీప్ రన్నరప్గా నిలిచాడు.
బిగ్ బాస్ స్టేజ్పై కళ్యాణ్ రామ్ సందడి
‘డెవిల్’ మూవీ ప్రమోషన్లో భాగంగా నందమూరి కళ్యాణ్ రామ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. ఆయనతోపాటు సంయుక్త కూడా వచ్చింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
రూ.15 లక్షలతో బయటకు వచ్చేసిన యావర్ - నరేష్, రాజ్ తరుణ్ సక్సెస్
బిగ్ బాస్ హౌస్లోకి రూ.15 లక్షల క్యాష్ బాక్సుతో వెళ్లారు అల్లరి నరేష్, రాజ్ తరుణ్. యావర్ కుటుంబ సభ్యులు సూట్ కేసు తీసుకోవాలని చెప్పడంతో తాను అదే చేశాడు. డబ్బుతో బయటకు వచ్చేశాడు. ‘‘ఇలా రావడం నాకు నచ్చలేదు. కానీ, నా ఫ్యామిలీ నిర్ణయమే నా నిర్ణయం’’ అని తెలిపాడు యావర్. ఆ తర్వాత మిమ్మల్ని ఇక మిస్ అవుతాననే బాధ ఎక్కువగా ఉంది. ప్రతి శనివారం మిమ్మల్ని చూడాలనిపించేది. ఇక చూడలేనని బాధపడుతున్నా అన్నాడు యావర్.
‘బిగ్ బాస్’ హౌస్లోకి రవితేజా ఎంట్రీ - అమర్కు బంపర్ ఆఫర్
బిగ్ బాస్ హౌస్లోకి రవితేజా వచ్చాడు. ఈ సందర్భంగా అమర్కు మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన తర్వాతి సినిమాలో అమర్కు ఛాన్స్ ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఇందుకు హౌస్ నుంచి బయటకు వచ్చేయాలని నాగార్జున చెప్పడంతో అందుకు సిద్ధమైపోయాడు అమర్. అయితే, హౌస్లోకి వెళ్లాలని నాగార్జున చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)