అన్వేషించండి

Manchryala election: మంచిర్యాల జిల్లాలో ఎవరి మంత్రాంగం ఫలిస్తుంది-త్రిముఖ పోరు తప్పదా

మంచిర్యాల జిల్లాలో ఎన్నికలు ఏ మలుపు తిరగబోతున్నాయి. ఏ పార్టీ మంత్రాంగం ఫలించబోతోంది..? త్రిముఖ పోరులో గెలిచే నేతలు ఎవరు?

2023 ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా ముఖచిత్రం ఆసక్తి రేవుతోంది. ఈ జిల్లాలో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క చెన్నూరులో తప్పు.. మిగతా రెండు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ను అనుకూలంగా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల ఫలితాలు.. గెలిచిన నేతల వివరాలు ఒకసారి చూద్దాం.

మంచిర్యాల  నియోజ‌క‌వ‌ర్గంలో 2,27,232 మంది ఓట‌ర్లు ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి న‌డిప‌ల్లి దివాక‌ర్ రావు గెలిచారు. 2014లో టీఆర్ఎస్ టిక్కెట్టు దివాక‌ర్ రావుకు ఇవ్వడంతో.. 2009 ఎన్నికలు, 2010 ఉపఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసి గెలుపొందిన గ‌డ్డం అర‌వింద్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి గ‌డ్డం అర‌వింద్‌రెడ్డికి 35,921 ఓట్లు రాగా.. టిఆర్ఎస్ అభ్య‌ర్థి న‌డిప‌ల్లి దివాక‌ర్ రావుకు 95వేల 171 ఓట్లు వచ్చాయి. ఇక.. 2018 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొక్కొరాల ప్రేమ్ సాగ‌ర్‌రావుపై గెలిచారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి న‌డిప‌ల్లి దివాక‌ర్ రావు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కొక్కొరాల ప్రేమ్ సాగ‌ర్‌రావు 70,512 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్య‌ర్థి న‌డిప‌ల్లి దివాక‌ర్ రావుకు 75,360 ఓట్లు వచ్చాయి. 2014తో పోలిస్తే 2018లో దివాక‌ర్ రావుకు మెజారిటీ బాగా తగ్గింది. 2023 ఎన్నికల్లోనూ నడివెల్లి దివాకర్‌రావే బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్నారు. 

చెన్నూరు అసెంబ్లీ నియోజ‌వ‌ర్గం ఎస్‌సి రిజ‌ర్వ్‌డ్ స్థానం. పెద్ద‌ప‌ల్లి లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వస్తుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 1,48,412 మంది ఓట‌ర్లు ఉన్నారు. చెన్నూర్ నుంచి ప్రస్తుతం బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నుంచి బ‌రిలోకి దిగిన న‌ల్లాల ఓదేలు.. రెండు సార్లు కూడా కాంగ్రెస్ అభ్య‌ర్థి జి.వినోద్‌పై విజ‌యం సాధించారు. అయితే 2018 ఎన్నిక‌ల్లో న‌ల్లాల ఓదేలుకు కాకుండా అప్ప‌టికే ఎంపిగా ఉన్న బాల్క సుమన్‌కు టిక్కెట్ ఇచ్చింది టీఆర్ఎస్. ఆ ఎన్నిక‌ల్లో బాల్క సుమ‌న్..  కాంగ్రెస్ అభ్య‌ర్థి బోర్ల‌కుంట వెంక‌టేష్‌పై గెలిచారు. ఓట‌మి త‌రువాత వెంక‌టేష్‌ టీఆర్ఎస్‌లో చేరి పెద్ద‌ప‌ల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా మ‌రోసారి బాల్క సుమ‌న్‌కే చెన్నూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది బీఆర్ఎస్. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన 13 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదు సార్లు గెలిచాయి. టీడీపీ నేత బోడ జనార్థన్ ఇక్కడి నుండి నాలుగు సార్లు విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదాటి రాములు మూడు సార్లు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్‌, ప్రజారాజ్యం పార్టీ రంగంలో ఉండటంతో నాలుగు ప్రధాన పార్టీల మధ్య బలమైన పోటీ జరిగింది. చివ‌రికి టీఆర్ఎస్ అనుహ్యంగా గెలిచింది. అప్ప‌టి నుంచి టీఆర్ఎస్ పాతుకుపోయింది. 2009 నుంచి టీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే ప్ర‌ధాన పోటీగా నిలిచింది. 2023 ఎన్నికల్లో ఇదే కొనసాగుతుందా అనేది చూడాలి.

బెల్లంపల్లి ఎస్సీ రిజర్వడ్‌ నియోజకవర్గం. 2014, 2018లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ది దుర్గం చిన్నయ్య గెలిచారు. 2014లో సీపీఐ అభ్యర్థి జి.మల్లేష్‌ను ఓడించారు చిన్నయ్య. 2014లో దుర్గం చిన్నయకు 52వేల 528 ఓట్లు వచ్చాయి. ఇక... 2018లో బీఎస్పీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి జి.వినోద్‌ను ఓడించారు దుర్గం చిన్నయ్య. వినోద్‌ అంతకుముందు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. 2018లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో బీఎస్పీ తరపున పోటీచేశారు. కానీ ఓడిపోయారు. 2018లో చిన్నయ్యకు 11వేల 276 ఓట్ల  మెజార్టీ వచ్చింది. చిన్నయ్యకు మొత్తం 55026 ఓట్లు రాగా, వినోద్‌కు 31359 ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి కె.వేద నిలిచారు. ఆయనకు 10వేలకుపైగా ఓట్లు వచ్చాయి. సీపీఐ సీనియర్‌ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ డిపాజిట్‌ దక్కలేదు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget