అన్వేషించండి

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తా- సింగరేణి కార్మికులకు పీసీసీ చీఫ్ రేవంత్ హామీ

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.  భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో రేవంత్‌ సమావేశమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సింగరేణి(Singareni) సమస్యలన్నీ పరిష్కరిస్తామని పీసీసీ చీఫ్(Telangana PCC Chief) రేవంత్ రెడ్డి(Revanth Reddy) హామీ ఇచ్చారు.  భూపాలపల్లి(Bhupalapalli)లో సింగరేణి(Singareni) కార్మికులతో రేవంత్‌ సమావేశమయ్యారు. భూపాలపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ(Gandra Satyanarayan) ఎన్నిసార్లు ఓడిపోయినా మీతోనే ఉన్నారన్న ఆయన, సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్‌ 3(December 3)న కాంగ్రెస్‌(Congress) ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్షంగా భాగస్వాములు అయ్యారన్న రేవంత్ రెడ్డి, సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు బీఆర్ఎస్(BRS) అంగీకరించిందన్నారు. గనుల బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చిందన్న ఆయన, సింగరేణి లాభాల్లో ఉండాలంటే మంచి యాజమాన్యం ఉండాల్సిందేనన్నారు. సింగరేణికి సీఎండీగా ఒకే అధికారిని ఇంతకాలం ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల త్యాగాలను సీఎం(TElangana CM) కేసీఆర్‌(KCR) మరిచిపోయారని విమర్శించారు. 

మరోవైపు కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర(Bus Tour) దిగ్విజయంగా కొనసాగుతోంది. ములుగు(Mulugu)లో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరిసభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రియాంక (Priyanka) విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ల్యాండ్‌, శాండ్‌, వైన్స్‌, మైన్స్‌ మాఫియాలన్నీ కలిసిపోయి ప్రజాధనాన్ని లూటీచేస్తున్నాయని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అంటూనే రూ.వేల కోట్లు లూటీ చేసి భవంతులు నిర్మించుకున్నారని, 18 మంత్రిత్వశాఖలు కేసీఆర్‌ కుటుంబంలోనే ఉన్నాయన్నారు ప్రియాంక గాంధీ. తెలంగాణకు గిరిజన, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉక్కు కర్మాగారం ఇస్తామని కేంద్రం చెప్పినా ఒక్క అంగుళం ముందుకు కదల్లేదన్నారు. కాంగ్రెస్‌ తెచ్చిన బీహెచ్‌ఈఎల్‌(BHEL), హెచ్‌ఏఎల్‌(HAL), రైల్వేలను మాత్రం మోడీ తన మిత్రులకు అమ్ముతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పంటలకు కనీస మద్దతు ధర పెంచుతామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు.  ధాన్యానికి రూ.2500, సోయాకు రూ.2200, చెరకుకు రూ.4000, పత్తికి రూ.6500 ఇస్తామన్నారు. రూ.2 లక్షల మేర వ్యవసాయ రుణమాఫీ చేస్తామన్నారు. ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని, అంబేడ్కర్‌ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల చొప్పున ఇస్తామన్నారు. 

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది  ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget