అన్వేషించండి

Telangana Assembly Elections 2023: బండిని తప్పించాక బీజేపీలో దూకుడు తగ్గిందా ? కీలక నేతల మధ్య డిష్యూం డిష్యూం నడుస్తోందా?

బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడు మీదుంటే...బీజేపీ మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత..మునుపటి దూకుడు లేదని సొంత పార్టీ చెబుతున్నారు.

Telangana Assembly Elections 2023: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత...తెలంగాణలో బీజేపీ శ్రేణులు వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మాత్రం...సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేకపోతోంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడు మీదుంటే... బీజేపీ మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకత్వం చేరికల కోసం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాయకత్వంలో ప్రత్యేకంగా కమిటీ వేసినా...ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. మొదట్లో రెండు సమావేశాలు నిర్వహించిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ...ఆ తర్వాత అతిగతీ లేకుండా పోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఈటల రాజేందర్...అది దక్కకపోవడంతో నిరాశలో మునిగిపోయారని టాక్ బలంగా వినిపిస్తోంది. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వాళ్లంతా పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలే చెవుళ్లు కొరుకుంటున్నారు.  

బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత...బీజేపీలో మునుపటి దూకుడు లేదని సొంత పార్టీ చెబుతున్నారు. కొందరు బండిని తప్పించడాన్ని నిరసిస్తూ పార్టీకి రాంరాం చెప్పేశారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత...బీజేపీ వెనుకబడిపోయిందని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీని ఆడుకోవాల్సిన నేతలే...సైలెంట్ అయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయ్. వీలయినంత తర్వాత అభ్యర్థులను ప్రకటించాల్సిన కాషాయ పార్టీ నేతలు...సభలు, సమావేశాలతోనే పబ్బం గడుపుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో కూడా సీట్లు రావని కింది స్థాయి కేడర్ మండిపడుతోంది. అధికారంలోకి వస్తామని చెప్పిన నేతలే...ఇపుడు సైలెంట్ అవడంతో కేడర్ లోలోపల రగిలిపోతోంది. ఏం చేస్తారని భావిస్తే...ఇంకేదే జరుగుతోందని పళ్లు కొరుకుతున్నారట. 

మాజీ మంత్రి కృష్ణయాదవ్‌...కాషాయ జెండా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారు. అనుచరులతో సమావేశం నిర్వహించిన తర్వాత...బీజేపీలో చేరాలన్ననిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. గతంలో ప్రజల మధ్య ఉన్నానని... రాబోయే రోజుల్లోనూ ప్రజల మధ్యే ఉంటానన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మచ్చ లేకుండా పరిపాలిస్తుందన్న క్రిష్ణయాదవ్... రాబోయే ఎన్నికల్లో అధిష్ఠానం నిర్ణయమే శిరసా వహిస్తానని వెల్లడించారు. బుధవారమే బీజేపీలో చేరేందుకు సిద్ధమైనా...పార్టీకి చెందిన అగ్రనేతలు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో చేరిక తాత్కాలికంగా వాయిదా పడింది. అంబర్ పేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని క్రిష్ణ యాదవ్ భావిస్తున్నారు. అదే స్థానం నుంచి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భార్య కావ్యను బరిలోకి దించాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారట. 

వేములవాడ అసెంబ్లీ టికెట్​కు తీవ్ర పోటీ నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు బీజేపీలో చేరారు. మొన్నటి వరకు  ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ వ్యవహారాలు చూసుకున్న ఆయన...ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వికాస్ రావు వేములవాడ టికెట్ కోరుతున్నారు. ఇదే నియోజకవర్గంపై మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరితోపాటు బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు మరికొందరు నేతలు...టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టికెట్ విషయంలో  ప్రస్తుతం తుల ఉమ, వికాస్ రావు మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరివైపు హైకమాండ్ మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా మంది ఆశిస్తున్న అయితే ఇలాా నియోజకవర్గాల్లో పోటీ అయితే ఉంది కానీ గెలిచే సత్తా ఉన్న నాయకుల కోసం బీజేపీ వేచి చూస్తోంది. అదే మిగతవారిని సందిగ్దంలో పడేస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy on Potti Sriramulu: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Vijayashanti: ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Potti Sriramulu: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు, చర్లపల్లి టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు: రేవంత్ రెడ్డి
AP Volunteer System: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
Vijayashanti: ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
ఇద్దరూ మంచి బాలురు, మనసున్న వాళ్లు - మహేష్, కల్యాణ్‌రామ్‌పై విజయశాంతి ప్రశంసలు, అప్పుడు.. ఇప్పుడూ.. తగ్గేదేలే...
Telangana Jobs: కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
కారుణ్య నియామకాలను ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం- ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్
War 2 Movie Release Date: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు
KTR News: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
Samantha : నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
నాగ చైతన్య చివరి గుర్తును చెరిపేస్తున్న సమంత - ప్లీజ్... అలా చేయొద్దంటూ అభిమానుల రిక్వెస్ట్
Return On Gold: రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం
రూ.2943కు కొన్నారు, రూ.8624కు అమ్ముతున్నారు - గోల్డ్‌ మీద మూడు రెట్ల లాభం
Embed widget