అన్వేషించండి

TDP News: వైసీపీ కీలక నేతల ఓటమే లక్ష్యంగా టీడీపీ యాక్షన్ ప్లాన్, ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు

Andhra Pradesh News: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీని మట్టి కరిపించడంతో కాదు...ఆ పార్టీలోని కీలక నేతల ఓటమికి ప్రత్యేక కసరత్తు చేస్తోంది. 

Andhra Pradesh Politics : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections )గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ (TDP)వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ (YSRCP)ని మట్టి కరిపించడంతో కాదు...ఆ పార్టీలో కీలక నేతల ఓటమికి ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీని అనేక ఇబ్బందులకు గురి చేసిన వారు... మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న ధ్యేయంతో పని చేస్తోంది. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు...ప్రత్యేక టీంలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొంత మందిని టార్గెట్‌ చేసుకుని మరీ ఎన్నికలకు సిద్దమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఇబ్బందుల్లోకి నెట్టిన వైసీపీ బిగ్‌ షాట్స్‌ను టార్గెట్‌ చేసుకున్నట్లు సమాచారం. వైసీపీలో కొందరు నేతలు అదే పనిగా టీడీపీని విమర్శించారు. మాటలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటమే కాదు... విపరీతమైన డామేజ్‌ చేశారు. అందుకే అధికార పార్టీలోని కొందరి బిగ్‌ షాట్స్‌ను టార్గెట్‌ చేసుకుని ఎన్నికలకు వెళ్లేలా టీడీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 

ముఖ్యంగా టీడీపీ టార్గెట్‌లో ఉన్న వారి జాబితాలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్‌, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, వల్లభనేని వంశీ,  దేవినేని అవినాష్‌  వంటి వారి విషయంలో టీడీపీ సీరియస్‌గా ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. వీరంతా టీడీపీ, చంద్రబాబును విపరీతంగా డామేజ్‌ చేసేందుకు ప్రయత్నించారని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. టీడీపీని, చంద్రబాబును నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... కుప్పంలో టీడీపీని టార్గెట్‌ చేసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటమే కాకుండా టీడీపీ కేడర్ ను అనేక ఇబ్బందులకు గురి చేశారనే విమర్శ ఉంది. పైగా కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని పదే పదే కామెంట్లు చేస్తూ...టీడీపీ కేడర్‌ను ఇరిటేట్‌ చేస్తున్నారు పెద్దిరెడ్డి. దీంతో పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు సెగ్మెంటుపై టీడీపీ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. పెద్దిరెడ్డి ఎన్నికల సమయంలో పుంగనూరు దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించాలని టీడీపీ నిర్ణయించిందట. దీంతో పుంగనూరులో ప్రత్యేక టీంలను రంగంలోకి దించాలని భావిస్తోంది. 

మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్...టీడీపీ, చంద్రబాబును టార్గెట్‌ చేసుకున్న వారే. చంద్రబాబు, టీడీపీపైన వీరంతా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజకీయంగా చేసే విమర్శలు స్థాయి దాటి...మాట్లాడారని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. దీంతో వీరి టార్గెట్‌గా కూడా పార్టీ శ్రేణులు పని చేయాల్సిన అవసరం ఉందనే ఆలోచన చేస్తోంది. వీరి కోసం క్షేత్ర స్థాయిలో నెట్‌ వర్కింగ్‌ చేసుకుని టార్గెట్‌ రీచ్‌ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. సోషల్‌ మీడియా విభాగాల ద్వారా.. ఇతరత్ర మార్గాల ద్వారా సదురు బిగ్‌ షాట్స్‌ను టార్గెట్‌ చేసుకునే ప్రక్రియకు టీడీపీ శ్రీకారం చుట్టినట్టు సమాచారం. మిగిలిన నియోజకవర్గాలంతా ఓ ఎత్తు...తమ హిట్‌ లిస్టులో ఉన్న వీళ్ల సెగ్మెంట్లల్లో ఎన్నిక మరో ఎత్తు అనే రేంజ్‌లో టీడీపీలో చర్చ జరుగుతోంది.

కృష్ణా జిల్లాకు మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్‌ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వీరిని జిల్లాకు చెందిన టీడీపీ నేతలే కాకుండా.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు కూడా టార్గెట్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని, వంశీ ఇద్దరూ చంద్రబాబును.. భువనేశ్వరిని విమర్శించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  గుడివాడలో పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము,  గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావుకు వీలైనంత వరకు అన్ని రకాల సాయం అందించేందుకు ఇప్పటికే ప్లాన్‌ సిద్దం చేసినట్టు తెలుస్తోంది. దేవినేని అవినాష్‌ టీడీపీ కార్యాలయం ధ్వంసానికి పాల్పడ్డారు. జోగి రమేష్‌ చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు. ఈ క్రమంలో వీళ్లందర్ని వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చూడాలని...వ్యూహాలకు పదును పెడుతోంది. వీరిని ఓడించే బాధ్యతను సీనియర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget