అన్వేషించండి

Chandrababu: 'మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే ఫస్ట్ సంతకాలు' - ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలన్న చంద్రబాబు

Andhra Pradesh News: ఐదేళ్ల సైకో పాలనకు అంతం పలకాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు నంద్యాల, తిరుపతి ప్రజాగళం సభల్లో ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.

Chandrababu Slams Cm Jagan In Nandyal Prajagalam Meeting: కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైనే అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన శనివారం నంద్యాల (Nandyal), తిరుపతిలో (Tirupati) నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రసంగించారు. ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని.. సైకో పాలనకు అంతం పలకాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 'రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టబడులు తీసుకొస్తాం. ఏడాదికి 5 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రూ.200 పింఛన్ ను రూ.2 వేలు చేశాం. ఈ పింఛన్ ను రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ నుంచే అందిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూములు కాజేయాలని చూస్తున్నారు. మన భూమి పాస్ బుక్ పై జగన్ ఫోటో ఎందుకు.?. దానిపై రాజముద్ర ఉండాలి. సైకో ఫోటో కాదు. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే వ్యక్తిని జగన్ పెడుతున్నారు. మనకు ఏ సమస్య ఉన్నా ఆ అధికారి వద్దకే వెళ్లాలి. ఈ యాక్ట్ ద్వారా మీ భూమి మీరు అమ్ముకునేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకు వెళ్లాలి. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఏ పాలన కావాలి.?

'మీకు విధ్వంస పాలన కావాలా.? అభివృద్ధి పాలన కావాలా.? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా.? లేదా గంజాయి, డ్రగ్స్ కావాలా.?. నడిపించే నాయకుడు కావాలా.? నరరూప రాక్షసుడు కావాలా.?. విలువ ఇచ్చే సీఎం కావాలా.? నియంత కావాలా.?' అనేది ప్రజలు ఆలోచించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సైకో జగన్ ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. విధ్వంస పాలనకు ఓటుతో చరమగీతం పాడాలని అన్నారు. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

'సీమ ప్రజలను మోసం చేశారు'

సీఎం జగన్ రాయలసీమ ప్రజలను మోసం చేశారని.. రాష్ట్రంలో నిత్యావసరాలు ధరలు పెరిగి ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని మండిపడ్డారు. నంద్యాల సభ అనంతరం తిరుపతిలోని ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. 'వైసీపీకి 49 సీట్లు ఇచ్చిన రాయలసీమకు జగన్ ఏం చేశారు.?. జిల్లాలోని పదవులన్నీ పెద్దిరెడ్డికే కావాలి. కూటమి అధికారంలోకి రాగానే వారు దోచుకున్నదంతా వసూలు చేస్తాం. ఈ ఎన్నికల్లో స్మగ్లర్లకు జగన్ సీట్లు ఇచ్చారు. జగన్ పాలనలో కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు.?. మద్య నిషేధం పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇక్కడ మద్యం కొనలేక పక్క రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. ఇసుక, మట్టి ఖనిజ సంపద దోచుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసిన వారిని వదిలిపెట్టను.' అని చంద్రబాబు వెల్లడించారు.

Also Read: Vijayamma Supports YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం- షర్మిలకు మద్దతు ప్రకటించిన విజయమ్మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget