అన్వేషించండి

Karnataka Elections : కర్ణాటకలో ఎన్నికలు - ఏపీలో చెక్ పోస్టులు ! ఎన్నికల సంఘం ప్లాన్ మామూలగా లేదు !

కర్ణాటక ఎన్నికల్లో అక్రమాలు నిరోధించడానికి ఏపీ సరిహద్దుల్లో చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు.


Karnataka Elections :   కర్ణాటక ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ పేరుతో జరిగే డబ్బు, మద్యం పంపిణీలను అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం  సరిహద్దు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.  కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల సరిహద్దు రాష్ట్రాల సీఎస్‌, డీజీపీలతో  వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల  ర పోలీసు యంత్రాంగం  సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.  డబ్బు, మద్యం అక్రమ రవాణా జగరకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.    

ఏపీ సరిహద్దు జిల్లాలలపై ఎక్కువ దృష్టి !                                

ఏపీలో  కర్నాటకకు ఆనుకుని చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల జిల్లాలు ఉన్నాయి.  రిహద్దు జిల్లాల్లో పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచీ ఎన్నికల నిబంధనలు పూర్తి స్ధాయిలో అమల్లోకి రానున్నాయి. సరిహద్దుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. ఓటర్లను ప్రలోబపరిచేందుకు మద్యం, నగదు, ఇతర బహుమతులు, సామాగ్రిని సరిహద్దు మార్గాల ద్వారా కర్నాటకకు వెళ్ళకుండా నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కర్నాటకలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి మద్యం నిషేధం ఉంటుంది. దీంతో ఏపీలోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా అధికార యంత్రాగం మద్య నిషేధం అమలు చేయనుంది. 

తెలంగాణతో సరిహద్దు తక్కువే !                                        

కర్ణాటకతో ఏపీకే ఎక్కువ సరిహద్దు ఉంది. తెలంగాణలో జహీరాబాద్ వద్ద బీదర్ వంటి కర్ణాటక నియోజకవర్గాలు ఉన్నాయి. అందుకే అటు వైపు కూడా చెక్ పోస్టులు పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50కిపైగా  చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు తనిఖీలు, చెక్‌పోస్టుల ఏర్పాటుకు ఆస్కారం లేని చోట్ల నిరంతరం పెట్రోలింగ్‌ పార్టీలు సంచరిస్తున్నాయి. కర్నాటక నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలు, రాకపోకలపై ఎస్‌ఇబి దృష్టి పెట్టింది. ఏపీ నుంచి కర్నాటకలోకి ప్రవేశించే మార్గాల్లో రాకపోకలపై పోలీసు యంత్రాంగం తనిఖీల బాధ్యతను నిర్వహిస్తోంది.

దొంగ ఓటర్ల కట్టడికి ప్రణాళికలు                

ఎన్నికలు ఎక్కడ జరిగినా బస్సుల్లో బోగస్ ఓటర్లు వెళ్లడం ప్రతీ సారి వివాదాస్పదంఅవుతోంది. ఏపీ సరిహద్దు జిల్లాల నుంచి వలస వెళ్ళిన అనేక మందికి అక్కడ, ఇక్కడ రెండు చోట్ల గుర్తింపు కార్డులు ఉన్నట్లుగా భావిస్తున్నారు.  పోలింగ్‌ రోజున అల్లర్లు సృష్టించేందుకు, దొంగ ఓట్లు షురూ చేసేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సరిహద్దులో తల దాచుకునే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. ఇలాంటి వారిని కట్టడి చేయనున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో ప్రధానంగా యంత్రాంగం సరిహద్దులో నగదు, మద్యం రవాణాపైనే దృష్టి పెట్టింది.  

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget