అన్వేషించండి

Mylavaram Assembly Constituency: వామపక్షాల కంచుకోటపై కాంగ్రెస్ పాగా వేయగా....వారి ఆశలకు టీడీపీ గండికొట్టింది

Andhra Pradesh News: కాంగ్రెస్ కంచుకోట మైలవరానికి తెలుగుదేశం చెక్‌పెట్టగా...గత ఎన్నికల్లో పచ్చజెండాకు వైసీపీ గండికొట్టింది. ఇప్పుడు మైలవరం ప్రజలు ఎవరి పక్షమో..?

NTR District News: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం (Mylavaram Assembly Constituency) 1955లో ఏర్పాటు చేయగా.. తొలుత కమ్యూనిస్టులు ప్రభావం చూపారు. ఆ తర్వాత కాంగ్రెస్(Congress) కంచుకోటగా మారింది. తెలుగుదేశం(Telugu Desam) ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థులు పాగా వేయగా....ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో దిగారు.

కమ్యూనిస్టుల కోట
ఆంధ్రరాష్ట్ర ఆవిర్భావం అనంతరం 1955లో మైలవరం కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ రోజుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా(Krishna District) వ్యాప్తంగా వామపక్షాల ప్రభావం అధికంగా ఉండటంతో...ఇక్కడ సైతం సీపీఐ(CPI) పార్టీ అభ్యర్థి వెల్లంకి విశ్వేశ్వరరావు కేవలం 84 ఓట్ల తేడాతో కాంగ్రెస్(Congress) అభ్యర్థి పెడర్ల వెంకటసుబ్బయ్యపై విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1962 ఎన్నికల్లోనూ అదే అభ్యర్థులు పోటీపడగా..సీపీఐ ఈ సీటు నిలబెట్టుకుంది. అప్పుడు విశ్వేశ్వరరావు 514 ఓట్లతో  విజయం సాధించారు. 1967లో తొలిసారి కాంగ్రెస్ తరపున చనుమోలు వెంకట్రావు(Chanumolu Venkatarao) జయకేతనం ఎగురవేశారు. దాదాపు 20వేల ఓట్ల మెజార్టీ సాధించారు....1972, 78లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.

తెలుగుదేశం(Telugu Desam) ఆవిర్భావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్(NTR) ప్రభావం చూపగా....ఆ పార్టీ తరఫున నిమ్మగడ్డ సత్యనారాయణ విజయం సాధించారు. 4వేల 200 ఓట్ల మెజార్టీతో చనుమోలు వెంకట్రావుపై గెలుపొందారు.  ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ చనుమోలు వెంకట్రావు  నిమ్మగడ్డ సత్యనారాయణను ఓడించారు.. 1989లో కోమటి భాస్కర్‌రావు కాంగ్రెస్‌ తరఫున....తెలుగుదేశం నుంచి జేష్ఠ రమేశ్‌బాబు పోటీపడగా...కాంగ్రెస్‌ను విజయం వరించింది. 1994 లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీయడంతో మైలవరంలోనూ  ఆ పార్టీ అభ్యర్థి జేష్ఠ రమేష్‌ 7వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు.

1999లో విజయవాడ సిట్టింగ్ ఎంపీ వడ్డే శోభనాధ్రీశ్వరరావుకు తెలుగుదేశం టిక్కెట్ కేటాయించగా...కాంగ్రెస్‌ నుంచి కోమటి సుబ్బారావుపై విజయం సాధించారు. 2004లో రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేయగా...ఆ పార్టీ సీనియర్  కాంగ్రెస్‌ నుంచి చనుమోలు వెంకట్రావు ఐదోసారి గెలుపొందారు. 2009లో తెలుుదేశం నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు పోటీపడగా... కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌పై విజయం సాధించారు. నందిగామ ఎస్సీ రిజర్వ్‌డు కావడంతో దేవినేని ఉమ (Devineni Uma) మైలవరం నుంచి బరిలో దిగాల్సి వచ్చింది.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో వరుసగా రెండోసారి గెలిచిన దేవినేని ఉమ...చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మూడోసారి మైలవరం నుంచి దేవినేని ఉమ పోటీపడగా...గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) రంగంలోకి దిగి విజయం సాధించారు. తదనంతర పరిణామాల్లో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ(YCP) వీడి తెలుగుదేశం పార్టీలో చేరగా...ప్రస్తుతం మైలవరం టిక్కెట్‌ ఆయకే కేటాయించారు. వైసీపీ తరపున సరనాల తిరుపతిరావు యాదవ్‌((Tirupati Yadav) బరిలో దిగారు. ఆర్థికంగా బలమైన అభ్యర్థి వసంతపై తిరుపతిరావు యాదవ్‌ ఏ మేరకు నెట్టుకురాగలరో చూడాలి.

నియోజకవర్గ స్వరూపం
మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, రెడ్డిగూడెం మండలాలతోపాటు విజయవాడ రూరల్ మండలంలో కొంత భాగం మైలవరం నియోజకవర్గం కిందకు వస్తుంది. జనరల్ కేటగిరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు  2,80,000  మంది ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget