అన్వేషించండి

Jubilee Hills By-election : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కులాల లెక్కలేంటీ? బీసీ వర్సెస్ ఓసీ పోరుగా మారుతుందా!

Jubilee Hills By-election :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారబోతోంది. నోటిఫికేషన్ విడుదలకు ముందే హోరా హోరీగా ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. ఈసారి బిసి వర్సెస్ ఓసీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Jubilee Hills By-election : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సిట్టింగ్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలలో ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పీక్స్ కు చేరుకుంది. తాజాగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్దిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, దివంగత నేత మాగంటి గోపీనాథ్‌ భార్య సునీతకు టిక్కెక్ ఖారారు చేసింది బిఆర్‌ఎస్. ఇక మిగిలింది కాంగ్రెస్ , బిజెపి వంతు.

ఇప్పటికే బిసి అజెండాతో ముందుకెళ్తున్నట్లు ప్రకటించిన అధికార కాంగ్రెస్ పార్టీ, బిసి అభ్యర్దినే జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే బరిలో దింపేందుకు సిద్దమైంది. ముందస్దు వ్యూహంలో భాగంగా మైనర్టీలను బుజ్జగించే మాస్టర్ ప్లాన్‌తో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇచ్చింది. అంతకు ముందు వరకూ తనకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ అంటూ పబ్లిక్‌గా ప్రకటనలు చేసే అజారుద్దీన్‌ను అలా కట్టడి చేయగలిగింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పుడు మిగిలింది బిసి అభ్యర్దిని ప్రకటించడం మాత్రమే. అయితే ఇక్కడే కాంగ్రెస్ కు అస్సలు కష్టాలు మొదలయ్యాయి. జూబ్లీహిల్స్ సీటు కోసం కాంగ్రెస్‌లో ఇప్పటికే స్దానిక నేత నవీన్ యాదవ్ పోటీపడుతుంటే, తాజాగా తెరపైకి మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ నేను సైతం అంటూ పోటీలోకి దూసుకొచ్చారు. వీరిద్దరికీ తోడు గౌడ సామాజికవర్గం నుంచి మురళీ గౌడ్ పోటీపడుతున్నారు.

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో మొత్తం ఓటర్లు 3,92,669 మంది ఉండగా వారిలో యాదవులు, మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ ఇలా మొత్తంగా 11 బిసి ఉపకులాల ఓట్లన్నీ కలిపి 1,41,726 మంది ఓటర్లున్నారు. ఈ మొత్తం ఉపకులాల్లో అధికంగా మున్నూరు కాపుల ఓట్లు 20,803 మంది ఉండగా, ఎమ్మెల్యే సీటు కోసం ప్రధాన పోటీలో ఉన్న అభ్యర్థులు మాత్రం యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఇక్కడ ప్రధాన ట్విస్ట్ గా చెప్పవచ్చు. మున్నూరు కాపుల నుంచి దానం నాగేందర్ పేరు మొదట్లో వినిపించినప్పటికీ, పార్టీ ఫిరాయింపు చిక్కుల్లో ఉన్న దానం జూబ్లీహిల్స్ వైపు చూసే అవకాశాలు దాదాపు లేనట్టే. ఈ నియోజవర్గంలో బిసి ఓటర్లలో యాదవ సమాజిక వర్గం ఓట్లు 15వేలకుపైగా ఉంటాయి. కానీ ఇతర కులాలో జనాకార్షక నేతలు లేకపోవడంతో బిసిలో ఈసారి సీటు యాదవ సEమాజిక వర్గాన్ని వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పొలిటికల్ టాక్ నడుస్తోంది. 

కమ్మ, రెడ్డి, ఆంధ్రా కాపు, వెలమ ఇలా వివిధ ఓసీ ఉప కులాలతో కలిపి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓసీ ఓటర్లు మొత్తం 67,480 మంది ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్‌ సైతం ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఈయన మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకు ముందు ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాడే కావడంతో వరుసగా నాలుగు సార్లు ఈ నియోజవర్గం నుంచి ఓసీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీ బిసి అభ్యర్దిని పోటీలోకి దించడంతో బిసి వర్సెస్ ఓసీ కులాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

బిసిల తరువాత ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు 96,546మందితో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈసారి బరిలో ఓసీ అభ్యర్థి పేరు తెరపైకి రాకపోవడంతో మైనార్టీ ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములు డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా చెప్పవచ్చు. బిజెపి సైతం తామేం తక్కువ కాదంటూ జూబ్లీహిల్స్ సీటు సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అభ్యర్థి ఎవరు అనేది ఓ క్లారిటీ రానప్పటికీ బిజెపి మాత్రం మా లెక్కలు మాకున్నాయంటూ దూసుకుపోతోంది. ఇలా సింపథీ వర్కవుట్ అవుతుందనే ఆశతో బిఆర్‌ఎస్ ఉంటే, బిసి నినాదం గెలుపు తెచ్చిపెడుతుందనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. ఈ నేపధ్యంలో రెండు దశాబ్ధాల తరువాత జూబ్లీహిల్స్ నియోజవకర్గంలో బిసి వర్సెస్ ఓసీ కులాల మధ్య హోరాహోరీ పోరు రసవత్తరంగా మారింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget