అన్వేషించండి

Vijayawada News: ఓటు వేసేందుకు ఊరెళ్తున్నాం - బస్సులు లేక అవస్థల ప్రయాణం, ప్రత్యేక సర్వీసుల కోసం వినతి

Andhrapradesh News: ఎన్నికల వేళ విజయవాడ నుంచి బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Rush In Vijayawada Bus Stand: ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు స్వగ్రామాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ (Vijayawada) బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఇక్కడి నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇప్పటికే రిజర్వేషన్లన్నీ ఫుల్ కాగా.. ప్రత్యేక బస్సులు కూడా నిండిపోతున్నాయి. అయితే, ఉదయం 5 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్సూ రావడం లేదని.. ప్రత్యేక బస్సులు అందుబాటులో లేవని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు, రిజర్వేషన్ కేంద్రాల వద్ద కూడా జనం భారీ క్యూ కట్టారు. రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

హైవేపై భారీగా రద్దీ

అటు, ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద భారీగా రద్దీ నెలకొనగా.. ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ లో స్ధిరపడ్డ వారు తమ సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రావడంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం నెలకొంది. హైదరాబాద్ శివారు హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకూ ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

విజయవాడకు ప్రత్యేక బస్సులు

కాగా, టీఎస్ఆర్టీసీ ఇప్పటికే ఏపీకి ఓటు వేసేందుకు వెళ్లే వారి కోసం 2 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయితే, అవి ముందుగానే రిజర్వేషన్లు పూర్తి కాగా అన్ని స్టేషన్లలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో హైదరాబాద్ టూ విజయవాడ రూట్ లో మరో 140 బస్సులను నడుపుతున్నట్లుగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ బస్సుల్లో మొత్తం 3 వేల దాకా సీట్లు ఉన్నాయని.. ప్రయాణీకులు https://tsrtconline.in నుంచి టికెట్లు బుక్ చేసుకోవాలని తెలిపారు. అలాగే, హైదరాబాద్‌ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. 'జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను తిప్పుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్రస్థాయి అధికారులను యాజమాన్యం ఆదేశించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం కోరుతోంది' అని సజ్జనార్ పోస్ట్ చేశారు.

విశాఖకు ప్రత్యేక రైళ్లు

అటు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ (రైలు నెం. 07097) నుంచి రాత్రి 7:45 గంటలకు బయల్దేరి సోమవారం ఉదయం 6:30 గంటలకు విశాఖ చేరకుంటుంది. అలాగే, సోమవారం రాత్రి 7:50 గంటలకు విశాఖ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు (రైలు నెం. 07098) మంగళవారం ఉదయం 8:15 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. మరోవైపు, రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనంగా ఒక్కో బోగీని జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: AP News: ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సీఈఓ గుడ్‌న్యూస్ - 14న స్పెషల్ క్యాజువల్ లీవ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget