అన్వేషించండి

Election Commission: ఏపీలో సంక్షేమ పథకాల డబ్బులు జమ - ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Ap Elections 2024: ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు పోలింగ్ తర్వాతే లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం గురువారం కీలక ప్రకటన చేసింది.

Election Commission Key Decision On Schemes Money Transfer: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బుల జమపై ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తైన తర్వాతే డబ్బులను లబ్ధిదారులకు జమ చేయాలని స్పష్టం చేసింది. మే 13న పోలింగ్ తర్వాత డబ్బులు జమ చేసేలా మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. ఎన్నికల కోడ్ కంటే ముందుగానే పలు పథకాలకు సీఎం జగన్ (CM Jagan) బటన్ నొక్కారని ఈసీ పేర్కొంది. దీనిపై ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా.. ఆ వినతిని తిరస్కరించింది.

ఈసీ ఏం చెప్పిందంటే.?

'సంక్షేమ పథకాల నగదు డీబీటీతో వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నా నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రచారం ముగిశాక జమ చేసే యత్నం జరుగుతోంది. పోలింగ్ కు 2 రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తే అది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది. ఎన్నికలు పూర్తయ్యాకే ఆ నిధులు జమ చేయాలి.' అని ఈసీ తెలిపింది. డబ్బులకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈసీ లేఖ రాసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బటన్ నొక్కి వివిధ పథకాలకు నిధులు విడుదల చేశారన్న ఈసీ.. 2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన నిధులు ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో చేరలేదని పేర్కొంది. ఈ జాప్యంపై వివరణతో కూడిన నివేదికను ఈ నెల 10లోపు ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించింది. ఈ క్రమంలో మొత్తం 6 పథకాలకు సంబంధించి సీఎం జగన్ ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే విషయంపై లేఖలో ప్రస్తావించిన ఈసీ.. మొత్తంగా రూ.14,165 కోట్లకు సంబంధించి నిధులు విడుదలకు బటన్ నొక్కారని తెలిపింది. అయితే, ప్రచారం పూర్తైన తర్వాత పోలింగ్ కు ముందు 11, 12 తేదీల్లో నిధుల విడుదలయ్యేలా చూశారన్న సమాచారం తమకు ఉందని లేఖలో వెల్లడించింది. ఈసీ తాజా ఆదేశాలతో పోలింగ్ తర్వాతే లబ్ధిదారుల ఖాతాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

మరోవైపు, నగదు జమ చేయకుండా.. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ సాగింది. వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేయకుండా ఈసీ ఆదేశాలు ఇచ్చినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై స్పందించిన ఈసీ పోలింగ్ తేదీ తర్వాతే నగదు లబ్ధిదారుల ఖాతాకు జమ చేయాలని కోర్టుకు తెలిపింది.

Aslo Read: CM Jagan: లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP DesamHema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP DesamSIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP DesamTeam Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Vivo X Fold 3 Pro: ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Embed widget