అన్వేషించండి

Tdp Bjp Alliance : బీజేపీ, జనసేనలతో పొత్తుపై టీడీపీలో వ్యతిరేకత - క్యాడర్ ఏమంటోంది ? లీడర్స్ ఏమనుకుంటున్నారు ?

పొత్తులు పెట్టుకోవాలా వద్దా అన్న అంశంపై టీడీపీ లీడర్స్, క్యాడర్ మధ్య భిన్నమైన చర్చలు సాగుతున్నాయి. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే ?

Tdp Bjp Alliance :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్న చర్చ పొత్తులు. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరుతుందంటూ ఢిల్లీ స్థాయి నుంచి ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబునాయుడు మోదీని కలిశారని.. లోకేష్ అమిత్ షాను కలిశారని చెబుతున్నారు. ప్రధాని మోదీని ఓ సమావేశంలో చంద్రబాబు కలిసింది నిజమే కానీ రాజకీయాలు మాట్లాడారో లేదో స్పష్టత లేదు. అలాగే హోంమంత్రి అమిత్ షాను లోకేష్ కలిశారన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఈ విషయాన్ని టీడీపీ ఖండించలేదు. బీజేపీ కూడా పట్టించుకోలేదు. అయితే ఈ అంశంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. పొత్తులపై రెండు పార్టీల అగ్రనేతల మధ్య మాటలు జరుగుతున్నాయో లేదో కానీ టీడీపీ లీడర్స్, క్యాడర్స్‌లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. ఎక్కువ మంది పొత్తులెందుకన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

పొత్తులపై సానుకూలంగా టీడీపీ నేతలు !

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్లి పరాజయం చవిచూసింది. టీడీపీ ఒంటరిగా గెలవలేదని  ఇతర పార్టీలు చేసిన విమర్శలు ఆ ఎన్నికలతో నిజం అయ్యాయి. అయితే తాము ఎంతో జన రంజక పాలన అందించామని భావించిన టీడీపీ నేతలు ఇంత దారుణమైన ఓటమి ఎదురవుతుందని ఊహించలేదు. పూర్తిగా కుల సమీకరణాలతోనే తాము ఓడిపోయామని నమ్ముతున్నారు. అందుకే ఈ సారి పొత్తుల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. జనసేనతో పొత్తు వల్ల చాలా నియోజకవర్గాల్లో ఏకపక్ష ఫలితం వస్తుందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు వల్ల ఓటింగ్ పరంగా లాభం ఉండదు కానీ కేంద్రంలో ఉన్న  అధికార పార్టీ కావడంతో..  ఏపీ అధికార పార్టీ ఎన్నికల్లో అక్రమాలు చేయకుండా అడ్డుకోవచ్చని ఈ కారణంగా బీజేపీతో పొత్తు అవసరమని వారు వాదిస్తున్నారు. తమ అభిప్రాయాలను హైకమాండ్‌కు చెబుతున్నారు.  

పొత్తులు వద్దేవద్దంటున్న క్యాడర్ !

అయితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పొత్తులు వద్దే వద్దని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కానీ ఇటు బహిరంగంగా కానీ ఇతర పార్టీలతో పొత్తులు అనే మాటను అంగీకరించడం లేదు. దానికి వారు చెప్పే కారణాలు వారు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే జరుగుతుందని విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేదని గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో తేలిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీలు, ఇతరులు దూరమవుతారని..దాని వల్ల నష్టమే జరుగుతుంది కానీ ప్రయోజనం ఉండదంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో కలసి వచ్చే అవకాశం ఉన్నా... ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలనుకుని... టీడీపీ ప్రభుత్వమే రావాలనుకుంటే ఏకపక్షంగా మద్దతిస్తారని ఓట్ల చీలిక అనే సమస్య రాదని గుర్తు చేస్తున్నారు. 

పొత్తులు పెట్టుకుంటే టీడీపీపై సవారీ చేస్తారని క్యాడర్ భయం !

తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేతలు చేసే విమర్శలు చాలా దూకుడుగా ఉంటాయి.  తామే కొన్ని సీట్లు ఇస్తామని బీజేపీ నేతలు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రభావం చూపని పార్టీతో పొత్తులు పెట్టుకుని ఎందుకు ఇన్ని మాటలు పడాలనేది వారి అభిప్రాయం. ఇక జనసేన పార్టీ వైపు నుంచి కూడా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయంటున్నారు. గతంలో చంద్రబాబు కలసి పోరాటం చేయాలని పిలుపునిచ్చినప్పుడు జనసేన నేతలు సోషల్ మీడియాలో సీఎం పీఠం పవన్ కల్యాణ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా టీడీపీ మీద ఇతర పార్టీలు సవారీ చేస్తాయని.. అందుకే పొత్తులు వద్దని అంటున్నారు. 

ప్రజలు గెలిపిస్తే సరే లేదంటే లేదంటున్న క్యాడర్ !

ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా టీడీపీ కావాలనుకుంటే మద్దతిస్తారని.. పొత్తులు పెట్టుకున్నారా లేదా అనేది చూడరని టీడీపీ వర్గాలంటున్నాయి. ఇటీవలి పంజాబ్ ఎన్నికల్లో భారీగా ఓట్లు చీలిపోతాయని అనుకున్నా  ప్రజలు ఏకపక్షంగా ఆమ్ ఆద్మీకి మద్దతు తెలిపారని గుర్తు చేస్తున్నారు. టీడీపీ గెలవకపోతే టీడీపీకి మాత్రమే నష్టం కాదని.. ఏపీకే నష్టమని ప్రజలు గుర్తిస్తే తప్పకుండా గెలిపిస్తారని అంటున్నారు. ప్రస్తుతం పొత్తులపై టీడీపీ లీడర్స్, క్యాడర్స్ మధ్య ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
Lenin Collection Day 1: లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
లెనిన్ కలెక్షన్లు... ఫస్ట్ డే అదరగొట్టిన అయ్యగారు - ఎన్ని కోట్లు వచ్చాయంటే?
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
విష్ణు సహస్రనామ పఠనం: అద్భుత ప్రయోజనాలు, శక్తి రహస్యాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Embed widget