అన్వేషించండి

Narsipatnam News: నర్సీపట్నంలో గెలుపు ఎవరిని వరించేనో, ఇక్కడ పోటీ చాలా ఆసక్తికరం!

Narsipatnam constituency : ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం నర్సీపట్నం. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ద్విసభకు ఎన్నిక జరిగింది.

Who Will Win In Narsipatnam Constituency : ఉమ్మడి విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం నర్సీపట్నం. ప్రస్తుతం ఈ నియోజకవర్గం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. ఒకసారి ద్విసభకు ఎన్నిక జరిగింది. మొత్తంగా 16 సార్లు ఎన్నికలు జరగ్గా, రానున్న సార్వత్రిక ఎన్నికలతో 17వ ఎన్నిక ఇక్కడ జరగనుంది. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,47,816 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,22,208 మంది కాగా, మహిళా ఓటర్లు 1,25,606 మంది ఉన్నారు. 

16 ఎన్నికలు.. ఫలితాలు ఇవే

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలను తీరును పరిశీలిస్తే.. సమాన స్థాయిలో విజయాలతో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ సమానంగా నిలిచాయి. ఇరు పార్టీలు ఏడుసార్లు చొప్పున ఇక్కడ విజయం సాధించాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భాం తరువాత జరిగిన పది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఆరుసార్లు విజయం సాధించగా, నాలుగుసార్లు కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 

1955లో తొలిసారి ఇక్కడ ద్విసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎం పోతురాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన ఎం పిచ్చయ్యపై 347 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన వీర్రాజుపై 7030 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ నుంచి పోటీ చేసిన ఆర్‌ లచ్ఛాపాత్రుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజుపై 4893 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 

1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు మరోసారి వవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్‌ఎల్‌ పాత్రుడిపై 14,848 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసి బి గోపాత్రుడిపై 11,042 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన గోపాత్రుడు బోలెం విజయం సాధిచంఆరు. తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి ఆర్‌ఎస్‌ఎన్‌ రాజుపై 8560 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్‌ఎన్‌ రాజుపై 21,179 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన వి శ్రీరామ్మూర్తిపై 811 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 10,955 ఓట్ల తేడాతో గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజుపై 21,179 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 

1996లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వి శ్రీరామ్మూర్తి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సాగి కృష్ణమూర్తిరాజుపై 12,327 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ రామచంద్రరాజుపై 8559 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన డీవీఎస్‌ నారాయణరాజుపై 23,930 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బి ముత్యాలపాప తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 8287 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడు మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి బరిలోకి దిగిన పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌పై 2338 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెట్ల ఉమా శంకర్‌ గణేస్‌ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన అయ్యన్నపాత్రుడిపై 22,839 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

ఇక్కడ గడిచిన పది ఎన్నికలను పరిశీలిస్తే.. ఆరుసార్లు అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయ్యన్నపాత్రుడు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ బరిలో ఉన్నారు. వీరి పోటీ వచ్చే ఎన్నికల్లో ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Regional sentiment gimmicks ahead of GHMC Elections | GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
GHMC ఎన్నికలే టార్గెట్టా? తెలంగాణ సెంటిమెంటు, సెట్లర్ ఓటు, కొత్త రాజకీయ సమీకరణాలు
Keralam CM VD Satheesan: కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
కేరళం ముఖ్యమంత్రిగా VD సతీశన్! 10 రోజుల సస్పెన్స్‌కు తెర!
Tamil Nadu CM Vijay: ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
ఒకప్పుడు అవమానం... నేడు తమిళనాడు సీఎంగా విజయ్ - నెహ్రూ స్టేడియంలో దళపతికి చేదు అనుభవం!
  VIjay Silence:మూడు రోజులుగా విజయ్ మౌనం.. ముఖ్యమంత్రిగానే మాట్లాడతాడా..?  ఈ సైలెన్స్‌కు అర్థమేంటి..?
మూడు రోజులుగా విజయ్ మౌనం.. ముఖ్యమంత్రిగానే మాట్లాడతాడా..?  ఈ సైలెన్స్‌కు అర్థమేంటి..?

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget