అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీలో హింసాత్మక ఘటనలు - కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట సీఎస్, డీజీపీ హాజరు

Election Commission of India: ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి.. సీఎస్, డీజీపీ గురువారం వివరణ ఇచ్చారు.

AP CS And Dgp Attended Before Election Commission Of India: ఏపీలో ఈ నెల 13న (సోమవారం) పోలింగ్, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సీఎస్, డీజీపీలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్ జవహర్ రెడ్డి (Jawahar Redddy), డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) సీఈసీ ఎదుట గురువారం హాజరయ్యారు. రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై వారు వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిల్లో పోలింగ్ రోజు, అనంతరం హింస చెలరేగడంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితిని ఎందుకు అదుపు చేయలేకపోయారని నిలదీసిన ఈసీ.. దీనికి బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించింది. హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరణ ఇవ్వాలని ఇరువురి ఉన్నతాధికారులను బుధవారం ఆదేశించిన నేపథ్యంలో గురువారం వీరు ఎన్నికల సంఘం ఎదుట హాజరయ్యారు.

ఈసీ తీవ్ర ఆగ్రహం..

దాదాపు 25 నిమిషాల పాటు వీరు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ఎదుట వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రి దాడులు, చంద్రగిరిలో ఏకంగా ఓ పార్టీ అభ్యర్థిపైనే దాడి చేయడం.. అటు, శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు వరకూ జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని మండిపడినట్లు సమాచారం. ముందస్తుగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారో.? దానికి తగిన ఏర్పాట్లు కూడా తమ దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనంతరం కూడా పల్నాడు, తాడిపత్రి, తిరుపతి, మాచర్ల ప్రాంతాల్లో భారీగా హింస చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరికొకరిపై రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులు, బాణాసంచాతోనూ దాడులు జరిగాయి. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతిలో చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న పులివర్తి నానిపై వైసీపీ కార్యకర్తలు మంగళవారం దాడికి పాల్పడ్డారు. అక్కడ స్ట్రాంగ్ రూంల పరిశీలనకు వెళ్లిన ఆయన తిరిగి వస్తున్న సమయంలో దాడి చేశారు. రాళ్లు, ఆయుధాలతో దాడి చేయగా.. నాని, ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు నాని భద్రతా సిబ్బంది రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ప్రతి దాడికి దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అటు, పల్నాడు జిల్లాలోని మాచర్ల, కారంపూడిలోనూ ఉద్రిక్తతలు చెలరేగాయి. అలాగే, అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలతో హింస చెలరేగింది. ఓ సీఐకు సైతం గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఈ ఘటనలన్నింటిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇద్దరూ వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో గురువారం వారు ఎన్నికల సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget