అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీలో హింసాత్మక ఘటనలు - కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట సీఎస్, డీజీపీ హాజరు

Election Commission of India: ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి.. సీఎస్, డీజీపీ గురువారం వివరణ ఇచ్చారు.

AP CS And Dgp Attended Before Election Commission Of India: ఏపీలో ఈ నెల 13న (సోమవారం) పోలింగ్, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సీఎస్, డీజీపీలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎస్ జవహర్ రెడ్డి (Jawahar Redddy), డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta) సీఈసీ ఎదుట గురువారం హాజరయ్యారు. రాష్ట్రంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై వారు వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమార్ విశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిల్లో పోలింగ్ రోజు, అనంతరం హింస చెలరేగడంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితిని ఎందుకు అదుపు చేయలేకపోయారని నిలదీసిన ఈసీ.. దీనికి బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించింది. హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరణ ఇవ్వాలని ఇరువురి ఉన్నతాధికారులను బుధవారం ఆదేశించిన నేపథ్యంలో గురువారం వీరు ఎన్నికల సంఘం ఎదుట హాజరయ్యారు.

ఈసీ తీవ్ర ఆగ్రహం..

దాదాపు 25 నిమిషాల పాటు వీరు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ఎదుట వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రి దాడులు, చంద్రగిరిలో ఏకంగా ఓ పార్టీ అభ్యర్థిపైనే దాడి చేయడం.. అటు, శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు వరకూ జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారని మండిపడినట్లు సమాచారం. ముందస్తుగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారో.? దానికి తగిన ఏర్పాట్లు కూడా తమ దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ జరిగింది

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనంతరం కూడా పల్నాడు, తాడిపత్రి, తిరుపతి, మాచర్ల ప్రాంతాల్లో భారీగా హింస చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గాలు ఒకరికొకరిపై రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులు, బాణాసంచాతోనూ దాడులు జరిగాయి. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతిలో చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉన్న పులివర్తి నానిపై వైసీపీ కార్యకర్తలు మంగళవారం దాడికి పాల్పడ్డారు. అక్కడ స్ట్రాంగ్ రూంల పరిశీలనకు వెళ్లిన ఆయన తిరిగి వస్తున్న సమయంలో దాడి చేశారు. రాళ్లు, ఆయుధాలతో దాడి చేయగా.. నాని, ఆయన భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు నాని భద్రతా సిబ్బంది రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ప్రతి దాడికి దిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అటు, పల్నాడు జిల్లాలోని మాచర్ల, కారంపూడిలోనూ ఉద్రిక్తతలు చెలరేగాయి. అలాగే, అనంతపురం జిల్లా తాడిపత్రిలోనూ టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలతో హింస చెలరేగింది. ఓ సీఐకు సైతం గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఈ ఘటనలన్నింటిపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం సీఎస్, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇద్దరూ వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో గురువారం వారు ఎన్నికల సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delimitation 2026 : నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
నియోజకవర్గాల పునర్విభజనతో 10 సవాళ్లు ! పరిష్కార మార్గాలపై ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Embed widget