అన్వేషించండి

AP Elections 2024: వైసీపీ ఎన్నికల శంఖారావ సభకు పేరు ఖరారు

YSRCP Election Campaign: ఈ నెల 27న భీమిలిలో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ సభకు సీఎం జగన్మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.

YSRCP Election Meeting : రానున్న సార్వత్రిక ఎన్నికలకు అధికార వైసీపీ(YCP) సన్నద్ధమవుతోంది. ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. తొలి ఎన్నికల సభను ఈ నెల 27న భీమిలి(Bheemil Or Bhimunipatnam)లో వైసీపీ నిర్వహిస్తోంది. ఈ సభకు సీఎం జగన్మోహన్‌రెడ్డి (Jagan Mohane Reddy)హాజరుకానున్నారు. ఈ ఎన్నికల శంఖారావ సభకు వైసీపీ పేరును ఖరారు చేసింది. ’సిద్ధం’(Siddam) పేరుతో ఈ సభను నిర్వహించనున్నారు.

భీమిలి ఎన్నికల శంఖారావం పేరుతో నిర్వహించే సభకు సంబంధించిన పోస్టర్లను వైసీపీ ముఖ్య నాయకులు బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) తదితరులు గురువారం విడుదల చేశారు. వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సభను నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) యువగళం ముగింపు సభను ఉత్తరాంధ్ర ప్రాంతంలో గ్రాండ్‌గా నిర్వహించింది. ఆ సభతో ఒక్కసారిగా టీడీపీకి మైలేజ్‌ పెరిగినట్టు అయింది. దాన్ని తలదన్నేలా వైసీపీ ఈ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సుమారు మూడు లక్షల మందిని వైసీపీ నాయకులు సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఎన్నికలకు ’సిద్ధం’ అంటూ సవాల్‌ విసిరేలా

వైసీపీ భీమిలిలో నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభకు సిద్ధం అన్న పేరును ఖరారు చేయడం వెనుక వైసీపీ ప్రతిపక్షాలకు సవాల్‌ విసరుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే హోరాహోరీగా అధికార, ప్రతిపక్షాలు విమర్శ, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పటకే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనేక సభలు నిర్వహిస్తూ ప్రజల్లోక జోరుగా వెళుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్వహిస్తున్న ఈ తొలి సభ ద్వారా తాము ఎన్నికల రణక్షేత్రంలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామన్న మెసేజ్‌ను ఇచ్చేందుకు ఈ పేరును ఖరారు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోరుకు తాము సిద్ధమన్న రీతిలో పోస్టర్‌ డిజైన్‌ కూడా ఉంది. సీఎం జగన్మోహన్‌రెడ్ది చిత్రంతోపాటు పిడికిలి పిగించిన చేతిని పోస్టర్‌లో డిజైన్‌ చేశారు. ఇది ఎన్నికల్లో వైసీపీ కేడర్‌ సాగించబోయే పోరాటానికి సంకేతంగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు.. 

భీమిలిలో నిర్వహించనున్న సదస్సులు మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సదస్సులు నిర్వహణకు వైసీపీ సన్నద్ధమవుతోంది. భీమిలి సదసస్సు తరువాత రాజమండ్రితోపాటు అనేక ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించనుంది. ఒక్కో సదసస్సును కనీసం లక్ష నుంచి మూడు లక్షల మందితో నిర్వహించేందుకు వైసీపీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. భీమిలి సదస్సు తరువాత రాజమండ్రిలో సదస్సును వైసీపీ నాయకులు నిర్వహించనున్నారు. ఇక్కడ సదస్సును లక్ష మందితో నిర్వహించనున్నట్టు రాజమండ్రి ఎంపీ భరత్‌ తెలిపారు. మరో వారం రోజుల్లో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. అభ్యర్థులు ఖరారు తరువాత సీఎం జగన్‌తోపాటు అభ్యర్థులంతా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రజల్లో ఉండేలా సీఎం జగన్‌ కేండిడేట్స్‌కు దిశా, నిర్ధేశం చేయనున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget