అన్వేషించండి

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తు ప్రకియ గురువారం (జులై 27) సాయంత్రంతో ముగియనుంది.

ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్/బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించారు. వాస్తవానికి బుధవారం(జులై 26) సాయంత్రంతో ముగియాల్సి గడువును గురువారం (జులై 27) సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,872 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, వారిలో 12,432 మంది ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత సీట్లు పొందిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటించనుంది. తదనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి 3856 ఎంబీబీఎస్ సీట్లను, 819 బీడీఎస్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 12,872 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా, వారిలో 12,432 మంది ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత సీట్లు పొందిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటించనుంది. తదనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి 3856 ఎంబీబీఎస్ సీట్లను, 819 బీడీఎస్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ జులై 21న ప్రవేశ ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో అర్హత సాధించిన అభ్యర్థుల తాత్కాలిక ప్రాధాన్య క్రమాన్ని విజయవాడలోని వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏపీ నుంచి 68,578 మంది విద్యార్థులు నీట్ యూజీ పరీక్ష రాయగా 42,836 మంది అర్హత సాధించారు. వీరంతా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

వివరాలు..

* ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలు - కాంపిటెంట్ అథారిటీ కోటా

అర్హత: ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నీట్‌ యూజీ-2023 ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 

నీట్‌ కటాఫ్ మార్కులు కేటగిరీలవారీగా ఇలా..

➥ జనరల్‌ (ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌) - 137 మార్కులు (50 పర్సంటైల్).

➥ ఎస్సీ/ఎస్టీ/బీసీ, ఎస్సీ/బీసీ (దివ్యాంగులు) - 107 మార్కులు (40 పర్సంటైల్).

➥  ఎస్టీ(దివ్యాంగులు)- 108 మార్కులు (40 పర్సంటైల్).

➥ ఓసీ/ ఈడబ్ల్యూఎస్‌(దివ్యాంగులు): 121 మార్కులు (45 పర్సంటైల్).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.2950; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2360 చెల్లించాలి. దీనికి బ్యాంకు ఛార్జీలు అదనం. డెబిట్‌ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్‌బ్యాంకింగ్/యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 

ఎంపిక విధానం: నీట్ యూజీ ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా.

అవసరమయ్యే డాక్యుమెంట్లు..

  • ఆధార్ కార్డు
  • నీట్ యూజీ 2023 ర్యాంకు కార్డు
  • పదోతరగతి మార్కుల మెమో (పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం)
  • ఇంటర్ లేదా తత్సమాన అర్హత మార్కుల మెమో (క్వాలిఫైయింగ్ ఎగ్జామ్)
  • 6 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్లు
  • ఇంటర్ లేదా తత్సమాన స్టడీ సర్టిఫికేట్
  • ఇంటర్ లేదా తత్సమాన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (ఇంటర్ టీసీ)
  • క్యాస్ట్ సర్టిఫికేట్
  • మైనార్టీ సర్టిఫికేట్ (ముస్లిమ్స్ మాత్రమే)
  • ఇన్‌కమ్ సర్టిఫికేట్-ఈడబ్ల్యూఎస్ (01.04.2023) తర్వాత జారీచేసినదై ఉండాలి.
  • తల్లిదండ్రుల ఇన్‌కమ్ సర్టిఫికేట్/ తెల్లరేషన్ కార్డు
  • దివ్యాంగులైతే PwBD సర్టిఫికేట్
  • NCC సర్టిఫికేట్
  • క్యాప్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • స్పోర్ట్స్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • పోలీస్ మార్టైర్ చిల్డ్రన్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ (అవసరమైనవాళ్లకు)
  • రెసిడెన్స్ సర్టిఫికేట్(నాన్‌లోకల్ అభ్యర్థులకు)
  • లోకల్ స్టేటస్ సర్టిఫికేట్
  • అభ్యర్థుల పాస్‌పోర్ట్ సైజు ఫొటో, సంతకం ఫొటో

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 20.07.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 27.07.2023.

Notification

Prospectus

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World Head Injury Awareness Day: బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా? 
బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా? 
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
KV Admission 2026: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget