అన్వేషించండి

MBBS: ఎంబీబీఎస్‌ స్థానికేతర సీట్లు ఏపీ విద్యార్థులకే! తెలంగాణలోనూ స్థానికులకే!

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడ్ సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీచేయనున్నారు. తెలంగాణలోనూ ఇదే విధానం అమలుచేయనున్నారు.

రాష్ట్ర విభజన జరిగిన (2014 జూన్ 2) తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడ్(స్థానికేతర) సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీచేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏసీఆర్, పద్మావతి, గాయత్రీ, నిమ్రా, బాలాజీ, విశ్వభారతి, అపోలో కళాశాలల్లో, ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా వచ్చిన మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, రాజమహేంద్రవరం, ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని అన్ని సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేసేలా ఉత్తర్వులు రానున్నాయి. దీనివల్ల సుమారు 200 ఎంబీబీఎస్ సీట్లు స్థానిక కోటాలో అదనంగా వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం విభజన తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని అన్ని సీట్లను తమ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోనికి వస్తుందని కూడా వెల్లడించింది. దీంతో ఏపీ విద్యార్థులు తెలంగాణలో అన్ రిజర్వుడ్ కోటాలో సీట్లు పొందే అవకాశాన్ని కోల్పోయారు.

తెలంగాణలోనూ...
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్తగా పెట్టిన వైద్య కళాశాలల్లోని సీట్లలో అన్‌రిజర్వ్‌డ్‌ కోటాను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు ముందుకు ఉన్న కళాశాలల సీట్లకు మాత్రమే అన్‌ రిజర్వ్‌డ్‌ కోటా పరిమితం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, ఆర్టికల్‌ 371డి నిబంధనలకు లోబడి తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ నిబంధనల్లో ప్రభుత్వం సవరణ చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఇటీవల జారీ చేశారు. దీని ప్రకారం 2014 జూన్‌ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వ/ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కాంపిటేటివ్‌ అథారిటీ (కన్వీనర్‌) కోటాలోని సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే చెందుతాయి. ఇన్నాళ్లూ ఈ కాలేజీల్లోని 85శాతం సీట్లే స్థానిక విద్యార్థులకు ఉండగా మిగిలిన 15శాతం అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఉండేవి. వీటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పోటీపడేవారు. తాజా సవరణతో కన్వీనర్‌ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి.

ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జిల్లాకో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు ప్రభుత్వ, ప్రైవేటు కలిపి తెలంగాణలో 20 మెడికల్‌ కాలేజీలు ఉండేవి. ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల సంఖ్య 56కు చేరింది. రాష్ట్రం ఏర్పాటు నాటికి 2850గా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్లు సంఖ్య ప్రస్తుతం 8,340కు పెరిగింది. పాత 20 కాలేజీల్లోని 2850 సీట్లలో 1895 కన్వీనర్‌ కోటా కింద ఉండేవి. ఇందులో 15 శాతం అంటే 280 అన్‌ రిజర్వుడ్‌ సీట్ల కోసం తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీపడేవారు.

రాష్ట్ర విభజన తర్వా త కళాశాలల సంఖ్య పెరిగినా తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలో సీటు పొందడం కష్టమయ్యేది. ఆలస్యంగానైనా ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం నిబంధనల్లో సవరణ చేసింది. దీంతో కొత్తగా వచ్చిన 36 మెడికల్‌ కాలేజీల్లోని 520 సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలల్లో 85శాతం సీట్లను స్థానికులకు రిజర్వ్‌ చేయడంవల్ల రాష్ట్ర విద్యార్థులకు 1300 సీట్లు అందుబాటులో ఉండగా.. తాజా నిర్ణయంతో సీట్ల సంఖ్య 1820కి పెరిగింది. కొత్త కాలేజీలు ఏర్పాటైతే సంఖ్య మరింత పెరగుతుంది. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన మెడికల్‌ కాలేజీల్లో ఆలిండియా కోటా15శాతం సీట్లు యథాతథంగా ఉంటాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
Super IAS: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Mana Mitra WhatsApp Governance And Digi Locker: మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మరిన్ని అప్‌డేట్స్- త్వరలో ప్రతి వ్యక్తికి డిజి లాకర్‌
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మరిన్ని అప్‌డేట్స్- త్వరలో ప్రతి వ్యక్తికి డిజి లాకర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Vijaya Sai Reddy Counters YS Jagan | నేను ఎవడికీ అమ్ముడుపోలేదు | ABP DesamAmma Rajasekhar Tasting Food in Anna Canteen | ఆంధ్రా వాళ్లు అదృష్టవంతులు | ABP DesamMinister Jai Shankar on Deportation | మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయరు | ABP DesamSheikh Hasina Home Set on Fire | షేక్ హసీనా తండ్రి నివాసాన్ని తగులబెట్టిన ఆందోళనకారులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీకి షాకిచ్చిన ఈడీ - విశాఖపట్నంలో కీలక ఆస్తులన్నీజప్తు !
Super IAS: సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
సునామీ వచ్చినప్పుడు కాపాడారు - 20 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడి పెళ్లి చేశారు - మనసున్న మారాజు ఈ ఐఏఎస్ ఆఫీసర్ !
Ramgopal Varma: ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
ఏపీ పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ - చంద్రబాబు, లోకేశ్, పవన్ ఫోటోల మార్ఫింగ్ కేసులో..
Mana Mitra WhatsApp Governance And Digi Locker: మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మరిన్ని అప్‌డేట్స్- త్వరలో ప్రతి వ్యక్తికి డిజి లాకర్‌
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో మరిన్ని అప్‌డేట్స్- త్వరలో ప్రతి వ్యక్తికి డిజి లాకర్‌
Walayar Case: అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న మైనర్లు - కేసులో మిస్టరీ వీడాకా అంతా షాక్ - తల్లే ..
అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న మైనర్లు - కేసులో మిస్టరీ వీడాకా అంతా షాక్ - తల్లే ..
Skoda : బుక్ చేస్తే నేరుగా ఇంటికే స్కోడా కార్ డెలివరీ.. 10నిమిషాల్లోనే టెస్ట్ డ్రైవ్ బుకింగ్
బుక్ చేస్తే నేరుగా ఇంటికే స్కోడా కార్ డెలివరీ.. 10నిమిషాల్లోనే టెస్ట్ డ్రైవ్ బుకింగ్
Repo Rate Cut: బ్రేకింగ్‌ న్యూస్‌ - రెపో రేట్‌ కట్‌ చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ - తగ్గనున్న వడ్డీ రేట్లు, EMIలు
బ్రేకింగ్‌ న్యూస్‌ - రెపో రేట్‌ కట్‌ చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ - తగ్గనున్న వడ్డీ రేట్లు, EMIలు
Everest : ఎవరెస్ట్ శిఖర అధిరోహకులకు షాక్.. ఇకపై ఎవరు పడితే వాళ్లు వెళ్లడానికి వీల్లేదంటున్న నేపాల్
ఎవరెస్ట్ శిఖర అధిరోహకులకు షాక్.. ఇకపై ఎవరు పడితే వాళ్లు వెళ్లడానికి వీల్లేదంటున్న నేపాల్
Embed widget