అన్వేషించండి

TG EAPCET Counselling: తెలంగాణ ఎప్‌సెట్-2024 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యేది ఎప్పడంటే?

EAPCET 2024 Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ మే 29 వెలువడింది. మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 27 నుంచి రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి.

TG EAPCET 2024 Counselling Notification: తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన 'టీజీ ఎప్‌సెట్ -2024' కౌన్సెలింగ్ నోటిఫికేషన్ (పేపర్ ప్రకటన)ను ఉన్నత విద్యామండలి మే 29న విడుదల చేసింది. మే 24న సమావేశమైన ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారుచేసిన సంగతి తెలిసిందే. తాజాగా కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్ వెలువడింది. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే విద్యార్థులు తమ పదోతరగతి, ఇంటర్ మార్కుల మెమోలు, టీసీ, ఇన్‌కం, క్యాస్ట్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. 

➥ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

➥ మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 27 నుంచి జులై 12 వరకు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు జూన్ 30 నుంచి వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్లను నమోదుచేసుకున్నవారికి జులై 12న మొదటి విడత సీట్లను చేటాయిస్తారు.

➥ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను జులై 19 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. ఈ దశలో జులై 19 నుంచి వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. అనంతరం జులై 24న రెండో విడత సీట్లను కేటాయిస్తారు.

➥ ఇక చివరగా మిగిలిన సీట్ల భర్తీకి జులై 30 నుంచి ఆగస్టు 5 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అయితే ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్‌లైన్‌లో కన్వీనర్ ద్వారా చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందుకుగాను ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయించనున్నారు. అదేవిధంగా స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆగస్టు 17న విడుదల చేయనున్నారు. 

టీఎస్ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు..

ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం 27.06.2024
మొదటి విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం 30.06.2024
మొదటి విడత సీట్ల కేటాయింపు 12.07.2024
రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం 19.07.2024
రెండో విడత సీట్ల కేటాయింపు 24.07.2024
తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం 30.07.2024
తుది విడత సీట్ల కేటాయింపు 05.08.2024
ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం 12.08.2024
ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు 16.08.2024
స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల 17.08.2024

తెలంగాణలో టీఎస్‌ఈఏపీసెట్‌-2024 ప్రవేశ పరీక్షకు సంబంధించి మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 7న పరీక్షకు మొత్తంగా, 33,500 మందికి గాను 30,288 మంది మొదటి సెషన్‌లో, 33,505 మందికి గాను 30,571 మంది రెండో సెషన్‌లో పరీక్ష రాశారు. ఇక మే 8న నిర్వహించిన పరీక్షకు మొత్తం 33,427 మందికిగాను 30,641 మంది హాజరయ్యారు.

ఇక రాష్ట్రంలో ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ పరీక్షలు మే 9న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మే 11తో పరీక్షలు ముగిశాయి. పరీక్షల మొదటిరోజు ఉదయం విడతకు 50,978 మందికిగాను.. 48,076 (94.3 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక 2,902 (5.7 శాతం) మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం విడతకు 50,983 మందికిగాను.. 48,152 (94.4 శాతం) మంది అభ్యర్థులు పరీక్ష రాశారని పేర్కొన్నారు. 2,831 (5.6 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఇక పరీక్షల రెండో రోజు 50,990 మందికిగాను.. 48,097 (94.3 శాతం) మంది  మధ్యాహ్నం విడతలో 50,987 మందికిగాను.. 48,318 (94.8 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. 

TG EAPCET Counselling: తెలంగాణ ఎప్‌సెట్-2024 కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యేది ఎప్పడంటే?

ALSO READ:

ఏపీ ఎప్‌సెట్-2024 ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్షలు నిర్వహించారు. మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరగడం తెలిసిందే. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో, ఇంజినీరింగ్‌ విభాగానికి మే 18 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ 2024 పరీక్షలు నిర్వహించారు. ఎప్‌సెట్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో 93.47 శాతం విద్యార్థులు హాజరయ్యారు.జూన్ మొదటివారంలో ఎప్‌సెట్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

World Head Injury Awareness Day: బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా? 
బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హాఫ్‌ హెల్మెట్‌ మంచిదా? ఫుల్ హెల్మెట్‌ పెట్టుకుంటే బెటరా? 
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
KV Admission 2026: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు షురూ! ఎగ్జామ్‌ లేదు, ఇంటర్వ్యూ లేదు! లాటరీ ద్వారానే ఎంపిక!
AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Embed widget