అన్వేషించండి

TS Inter Syllabus : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్, మారిన సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్

TS Inter Syllabus : తెలంగాణ బోర్డు ఇంటర్ సిలబస్ లో మార్పు చేసింది. ఇంటర్ రెండో సంవత్సరం ఇంగ్లీష్ సిలబస్ మార్పు చేసింది. కొత్త పుస్తకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

TS Inter Syllabus : తెలంగాణలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ సిలబస్ మార్పుచేశారు. ఈ ఏడాది నుంచి కొత్త సిలబస్ తో ఇంగ్లీషు పుస్తకాలు త్వరలో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మారిన సిలబస్ ను ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపారు. మారిన సిలబస్ తో పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు మారిన సిలబస్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు పేర్కొంది.  

సప్లిమెంటరీ గడుపు పెంపు

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు సప్లిమెంటరీ ఫీజు గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల ఎనిమిదో తేదీలోపు సప్లిమెంటరీ ఫీజులు చెల్లించాలని అందులో పేర్కొంది. ఫీజులను నేరుగా గానీ లేదా వేరే ఇతర గేట్‌వేల ద్వారా కూడా ఫీజులు చెల్లించ వచ్చని తెలిపింది.  ఫలితాలు విడుదల చేసిన రోజున మంత్రి మాట్లాడుతూ... ఇంటర్‌మీడియెట్ తప్పిన వాళ్లు కానీ, అదనపు మార్కుల కోసం ప్రయత్నించే వాళ్లైనా సరే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసుకోవచ్చని చెప్పారు. దీనికి సంబంధించిన ఫీజులను జూన్ 30 లోపు చెల్లించాలని సూచించారు. అయిచే ఫలితాలు రిలీజైన తేదీకి అడ్వాన్స్‌డ్‌ ఫీజు చెల్లింపు ఆఖరి గడువుకు చాలా తక్కువ గ్యాప్ ఉందని అంతా భావించారు. ఈ గడువు పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మెయిల్స్ ద్వారా, ఫోన్‌ల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. 

అందరి అభిప్రాయాలు తీసుకున్న ప్రభుత్వం విద్యార్థులకు మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డుకు ఆదేశాలు పంపించింది. దీంతో ఇంటర్ బోర్డు ఎనిమిదో తేదీ వరకు ఫీజులు చెల్లించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇది ఆఖరి గడువని తేల్చి చెబుతున్నారు అధికారులు. ఇకపై మరోసారి పెంపు ఉండదని... ఈ లోపు ఫీజులు చెల్లించుకోవాలని తెలిపారు. జులై 8లోపు ఫీజులు చెల్లించిన వారికి ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. దీనికి సంబంధించిన టైం టేబుల్ ఇంకా విడుదల కాలేదు. ఆ పరీక్షలను ఉదయం సాయంత్ర కూడా నిర్వహిస్తారు. వాటిని వీలైన త్వరగా పూర్తి చేసి వ్యాల్యూయేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రక్రియ మొత్తం ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేసి ఫలితాలు విడుదల చేయాలని భావించింది. 

ఇంటర్ ఫలితాల్లో 

తెలంగాణలో ఇంటర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  జూన్‌ 28న విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 63.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో అమ్మాయిలు 1,68,692 మంది పాస్  72.30 శాతం, అబ్బాయిలు 1,25,686 మంది 54.20 శాతం పాస్ అయ్యారు. ఇంటర్ సెకండియర్‌లో  67.16 శాతం మంది విద్యార్థులు పాసైనట్లు మంత్రి సబిత వెల్లడించారు. ఉత్తీర్ణత కాని ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేక క్లాస్‌లు పెట్టాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.  

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs CSK Match Highlights IPL 2025 | లక్నో పై 5వికెట్ల తేడాతో చెన్నై సంచలన విజయం | ABP DesamNani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
Embed widget