అన్వేషించండి

TS ECET - 2021: దరఖాస్తు గడువు పొడిగింపు.. ఆలస్య రుసుముతో 26 వరకు ఛాన్స్

TS ECET 2021: టీఎస్ ఈసెట్- 2021 దరఖాస్తు గడువును పొడిగించారు. రూ. 500 ఆలస్య రుసుముతో జూలై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ వెల్లడించారు.

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) - 2021 దరఖాస్తు గడువును పొడిగించారు. రూ.500 ఆలస్య రుసుముతో జూలై 26 వరకు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని టీఎస్‌ ఈసెట్‌ కన్వీనర్ సీహెచ్ వెంకటరమణారెడ్డి ప్రకటన విడుదల చేశారు. రూ.5,000 ఆలస్య రుసుముతో జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈసెట్ పరీక్ష ఆగస్టు 3న జరగనున్న నేపథ్యంలో మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. మరిన్ని వివరాలకు https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఆగస్టు 3న ఈ పరీక్ష రెండు సెషన్లలో జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈసీఈ, ఈఐఈ, సీఎస్‌ఈ, ఈఈఈ విభాగాలకు.. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సీఐవీ, సీహెచ్‌ఈఎం, ఎంఈసీ, ఎంఐఎన్‌, ఎంఈటీ, పీహెచ్‌ఎం, బీఎస్‌ఎం విభాగాలకు పరీక్ష జరగనుంది.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) టీఎస్ ఈసెట్-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బీటెక్‌/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీ/బీఎస్సీ (మ్యాథ్స్‌) ఉత్తీర్ణులు ఈసెట్‌ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్‌ పొందొచ్చు. డిప్లొమా ఇన్‌ ఫార్మసీ చదివిన విద్యార్థులకు బీఫార్మసీ సెకండ్ ఇయర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తోంది.


TS ECET - 2021: దరఖాస్తు గడువు పొడిగింపు.. ఆలస్య రుసుముతో 26 వరకు ఛాన్స్
ముఖ్యమైన వివరాలు:

  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
  • దరఖాస్తు ఫీజు : ఎస్సీ ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. 
  • పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • నోటిఫికేషన్ తేది : మార్చి 17, 2021
  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : మార్చి 22, 2021
  • రూ. 500 ఆలస్య రుసుముతో చివరి తేదీ : జూలై 26, 2021
  • రూ. 5000 ఆలస్య రుసుముతో చివరి తేదీ : జూలై 30, 2021 
  • పరీక్ష తేదీ : ఆగస్టు 3, 2021 ( పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగుతుంది.)
  • వెబ్‌సైట్‌ వివరాలు : https://ecet.tsche.ac.in/ 

పరీక్ష విధానం..
ఈసెట్ పరీక్ష 200 ప్రశ్నలకు (200 మార్కులు) ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష 3 గంటలపాటు ఉంటుంది. ఇంజనీరింగ్‌ డిప్లొమా చేసిన వారు ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (50 మార్కులు), ఫిజిక్స్ (25 మార్కులు), కెమిస్ట్రీ (25 మార్కులు), ఇంజనీరింగ్ పేపర్ (100 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరికీ ఒకేలా (కామన్‌గా) ఉంటాయి. ఇంజనీరింగ్ పేపర్ మాత్రం అభ్యర్థి బ్రాంచ్ మీద ఆధారపడి ఉంటుంది. 
బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులకు మ్యాథ్స్ (100 మార్కులు), అనలిటకల్ ఎబిలిటీ (50 మార్కులు), కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ (50 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి. ఇక ఫార్మసీ విభాగం వారికి ఫార్మాస్యూటిక్స్ (50 మార్కులు), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ (50 మార్కులు), ఫార్మకోగ్నసీ (50 మార్కులు), ఫార్మకాలజీ & టాక్సికాలజీ (50 మార్కులు) సబ్జెక్టులు ఉంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget