అన్వేషించండి

TS SSC Exams: తెలంగాణ పదోతరగతి పరీక్షల పూర్తి షెడ్యూలు ఇదే! క్వశ్చన్ పేపర్ ఇలా!

షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి.ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 11తో ప్రధాన పరీక్షలు, 13న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, 4న సెకండ్ లాంగ్వేజ్, 6న ఇంగ్లిష్, 8న మ్యాథమెటిక్స్, 10న సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ), 11న సోషల్, 12న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు, 13 ఓరియంటెల్ పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.

ఆయాతేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్‌ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు.

పరీక్ష తేదీ పేపరు
ఏప్రిల్ 3 ఫస్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 4 సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 ఇంగ్లిష్
ఏప్రిల్ 8 మ్యాథమెటిక్స్
ఏప్రిల్ 10 సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)
ఏప్రిల్ 11 సోషల్
ఏప్రిల్ 12 ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులు
ఏప్రిల్ 13 ఓరియంటెల్ పేపర్-2

క్వశ్చన్ పేపర్ స్వరూపం ఇలా..

➥ పదోతరగతి పరీక్షల్లో ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈసారి 80 మార్కుల ప్రశ్నపత్రంలో 30 మార్కులకు వ్యాసరూప ప్రశ్నలు ఉండనున్నాయి. ఒక్కో దానికి 5 మార్కుల చొప్పున.. ఆరు ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నలో 'ఎ' లేదా 'బి' అని రెండు ప్రశ్నలుంటాయి. విద్యార్థులు ఆ రెండింటిలో ఏదో ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. గతంలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు రెండు పేపర్లకు కలిపి 10 మార్కులకే ఉండేవి. ఈసారి వాటిని 20 మార్కులకు పెంచారు. 

➥ ప్రశ్నపత్రం పార్ట్-ఎ, బిగా ఉంటుంది. మొత్తం 38 ప్రశ్నలు ఉంటాయి. 'పార్ట్-ఎ'లో మూడు సెక్షన్లు. అవి అతి లఘు సమాధాన ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు. వాటికి 60 మార్కులు. పార్ట్-బిలో మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దానికి ఒక మార్కు చొప్పున 20 ప్రశ్నలు ఇస్తారు. 

ఈ ఏడాది నుంచి మార్పులివే...

➥ ఈ విద్యా సంవత్సరం నుంచే 9, 10 తరగతుల వారికి పరీక్షల్లో పలు సంస్కరణలు తెస్తూ ప్రభుత్వం బుధవారం జీవో 33 జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే ప్రకటించినట్లు పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు మాత్రమే వార్షిక పరీక్షల్లో ఉండనున్నాయి. ఇక 9వ తరగతికి ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2 పరీక్షలకు ఈ విధానం వర్తించనుంది. ఇప్పటికే 9, 10 తరగతుల వారికి ఎస్ఏ-1 పరీక్షలు పూర్తవడంతో పదో తరగతిలో వార్షిక పరీక్షలకు 6 పేపర్ల విధానం అమలుకానుంది. 

➥ ఇప్పటివరకు నాలుగు ఫార్మాటివ్ ఎసెస్‌మెంట్(ఎఫ్‌ఏ) పరీక్షలకు 20 మార్కులు, ఒక్కో పేపర్‌కు 40 మార్కులు చొప్పున రెండు పేపర్లకు కలిపి 80 మార్కులకు పరీక్షలు ఉండేవి. గతంలో మాదిరిగానే ఎఫ్‌ఏలకు ఈసారి కూడా 20 మార్కులే ఉంటాయి. అయితే సైన్స్‌లో రెండు భాగాలు ఉన్నందున భౌతికశాస్త్రానికి 10 మార్కులు, జీవశాస్త్రానికి 10 మార్కులు కేటాయిస్తారు. ఈసారి ఆరు పేపర్లు అయినందున ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కుల పరీక్ష ఉంటుంది.

సైన్స్ ప్రశ్నపత్రం ఇలా..
సైన్స్ ప్రశ్నపత్రంలో భౌతికశాస్త్రం, రెండోది జీవశాస్త్రం రెండు భాగాలుంటాయి. ఒక్కో భాగానికి 40 మార్కులు. వేర్వేరు ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలు ఇస్తారు. భౌతికశాస్త్రాన్ని ఒక జవాబుపత్రంలో, జీవ శాస్త్రాన్ని మరో జవాబుపత్రంలో రాయాల్సి ఉంటుంది. మొదట భౌతికశాస్త్రం పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష గంటన్నరపాటు ఉంటుంది. ఇది ముగిసిన తర్వాత జీవశాస్త్రం ప్రశ్నపత్రం ఇస్తారు. మొదటి భాగం జవాబు పత్రాలను తీసుకోవడం, రెండోది ఇవ్వడం కోసం ఈ సబ్జెక్టుకు 20 నిమిషాల సమయం అదనంగా ఇచ్చారు.

మొత్తం ఎన్ని మార్కులు...
ఎప్పటిలాగే మొత్తం 600 మార్కులకే పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్ష పేపర్ల సంఖ్య మాత్రమే మారనుంది. ఒక్కో సబ్జెక్టుకు 80 మార్కుల చొప్పున మొత్తం 480 మార్కులకు ప్రధాన పరీక్ష, ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కుల చొప్పున 120 మార్కులకు ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌‌-1  ఉంటాయి. రెండు కలిపి 600 మార్కులు ఉంటాయి.  

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget