అన్వేషించండి

Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ సెకండ్ ఇయర్‌లో 67.27 శాతం పాస్

Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలకు 3,80,920 మంది హాజరైతే... 2,56,241 మంది పాస్ అయ్యారు.

తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్‌ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %),  మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి .

ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగింపు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ రిజల్ట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో రెండో సంవత్సరం ఇంటర్‌ పరీక్షలకు 3,80,920 మంది హాజరైతే... 2,56,241 మంది పాస్ అయ్యారు. అంటే పాస్ పర్సంటేజ్ శాతం 67.27 శాతంగా ఉంది. మొత్తం ఇంటర్ రెండు సంవత్సరాలు కలిపి 61.68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 68.68 శాతం పాస్ అయ్యారు. బాలురు 54.66 శాతం పాస్ అయ్యారు. 

సెకండియర్‌లో బాలికలు 2,29,958 మంది రాస్తే...1,64,598 మంది పాస్ అయ్యారు. బాలికల్లో ఉత్తీర్ణత శాతం 71.57%. బాలురులో 2,35,520 మంది పరీక్షకు హాజరైతే... 1,30,952 మంది మాత్రమే పాస్ అయ్యారు. అంటే 55.60% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,91,698 మందికి A గ్రేడ్, 64,385 మందికి B గ్రేడ్, 21,166 మందికి C గ్రేడ్, 7784 మందికి D గ్రేడ్ వచ్చింది. జిల్లాల వారీగా పాస్ పర్సంటేజ్ చూస్తే... ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %), మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. చిట్టచివరి స్థానంలో నిలిచిన జిల్లాలు వరుసగా.... మెదక్‌(52%) నాగర్ కర్నూల్(54%), వరంగల్‌(58%) ఉన్నాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫ‌లితాల‌ను విడుద‌ల చేశాం. మార్చి 15 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. విద్యార్థి ద‌శ‌లో ఇంట‌ర్ అనేది కీల‌క‌మైంది. జీవితానికి ట‌ర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ 9,45,153 మంది హాజ‌ర‌య్యారు. 1473 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాం. 26 వేల మంది సేవ‌లందించారు. ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు స‌హ‌క‌రించిన అన్ని విభాగాల వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విష‌యంలో ఇంట‌ర్ వెయిటేజీని తీసేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. పిల్ల‌లు ఎవ‌రూ కూడా ఒత్తిడికి గురి కావొద్ద‌నే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు...
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. ముఖ్యంగా సెకండియర్ విద్యార్థులు టెన్షన్ పడొద్దని, తల్లిదండ్రులు కూడా వారి పరిస్థితి అర్థం చేసుకోవాలని, పిల్లలపై కోపడవద్దని కోరారు. ఫలితాలపై సందేహాలున్న విద్యార్థుల సౌలభ్యం కోసం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు సబితా వెల్లడించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఈ సారి ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తొలగించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Football:  లెజెండ్ మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడనున్న సీఎం రేవంత్ - జోరుగా ప్రాక్టీస్ కూడా !
లెజెండ్ మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడనున్న సీఎం రేవంత్ - జోరుగా ప్రాక్టీస్ కూడా !
Farmer Selfie Suicide Video: కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో.. ప్రభుత్వ హత్యేనని హరీష్ రావు మండిపాటు
కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో.. ప్రభుత్వ హత్యేనని హరీష్ రావు మండిపాటు
Vizag Sky Walk Bridge: దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
Euphoria Teaser : గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?
గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI in Ranchi | సౌతాఫ్రికా సూపర్ ఫైట్
Virat Kohli about Test Retirement | క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లి
Virat Kohli Records in Ranchi ODI | రాంచీలో కోహ్లీ రికార్డుల మోత
BCCI Summons to Gautam, Ajit Agarkar | గంభీర్‌ పై బీసీసీఐ కీలక నిర్ణయం!
ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Football:  లెజెండ్ మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడనున్న సీఎం రేవంత్ - జోరుగా ప్రాక్టీస్ కూడా !
లెజెండ్ మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడనున్న సీఎం రేవంత్ - జోరుగా ప్రాక్టీస్ కూడా !
Farmer Selfie Suicide Video: కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో.. ప్రభుత్వ హత్యేనని హరీష్ రావు మండిపాటు
కన్నీళ్లు పెట్టిస్తున్న రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో.. ప్రభుత్వ హత్యేనని హరీష్ రావు మండిపాటు
Vizag Sky Walk Bridge: దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
దేశంలోనే అతిపెద్ద విశాఖ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. ఇక పర్యాటకులకు పండుగే..
Euphoria Teaser : గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?
గుణశేఖర్ 'యుఫోరియా' టీజర్ వచ్చేసింది - డిఫరెంట్ కాన్సెప్ట్‌లో భూమిక స్పెషల్ రోల్... రిలీజ్ ఎప్పుడంటే?
Honda Activa and TVS Jupiter: హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్.. ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? ధర ఎంత
హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్.. ఏది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? ధర ఎంత
భవిష్యత్‌లో పని ఒక
భవిష్యత్‌లో పని ఒక "ఆప్షన్" అవుతుంది...! డేంజరస్ ట్రెండ్ డీ కోడ్ చేసిన ఎలన్‌మస్క్
Palash Muchhal: స్మృతి మంధానాతో పెళ్లి వాయిదా తర్వాత తొలిసారి కనిపించిన పలాష్ ముచ్చల్..
స్మృతి మంధానాతో పెళ్లి వాయిదా తర్వాత తొలిసారి కనిపించిన పలాష్ ముచ్చల్..
Kuttram Purindhavan OTT : చిన్నారి మిస్సింగ్... అసలు నిందితుడు ఎవరు? - తెలుగులోనూ క్రైమ్ థ్రిల్లర్ 'కుట్రమ్ పురింధవన్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
చిన్నారి మిస్సింగ్... అసలు నిందితుడు ఎవరు? - తెలుగులోనూ క్రైమ్ థ్రిల్లర్ 'కుట్రమ్ పురింధవన్'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget