అన్వేషించండి

పారామెడికల్‌, ఎఫ్ఎంజీ ఇంటర్న్‌షిప్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విదేశీ వైద్య విద్యార్థుల (ఎఫ్ఎంజీ) మెడికల్ ఇంటర్న్‌షిప్ కౌన్సెలింగ్‌ను ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విదేశీ వైద్య విద్యార్థుల (ఎఫ్ఎంజీ) మెడికల్ ఇంటర్న్‌షిప్ కౌన్సెలింగ్‌ను ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఎఫ్‌ఎంజీలు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 18 వరకు అవకాశం కల్పించారు. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) సూచనల మేరకు ఏప్రిల్ 15 వరకు మార్కుల జాబితాలు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు చేశారు.

విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులు దేశంలో ఏడాదిపాటు విధిగా చేయాల్సిన మెడికల్ ఇంటర్న్‌షిప్ కోసం కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లను కేటాయించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు జాతీయ వైద్య మండలి(ఎంసీఐ) అప్పగించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ అక్కడి వైద్య మండళ్లే ఈ బాధ్యత నిర్వహించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ త్వరలో ఇంటర్న్‌షిప్ అడ్మిషన్లకు ఉత్తర్వులు తాజాగా జారీచేసింది.

విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారి ప్రాధాన్యాల మేరకు వైద్య కశాశాలల్లో సీట్లను కేటాయించనున్నారు. గతంలో ఇలాంటి వైద్య విద్యార్థులు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా వంటి వైద్యకళాశాలల్లోనే అత్యధికంగా చేరేవారు. ఇతర ప్రాంతాలు లేదా జిల్లాల్లోని వైద్య కళాశాలల పట్ల ఒకరిద్దరు కూడా ఆసక్తి చూపేవారు కారు. ఈ నేపథ్యంలో జాతీయ వైద్య మండలి(ఎంసీఐ) రాష్ట్రంలోని వైద్య కళాశాలల వారీగా సీట్లను కేటాయించింది. ప్రధానంగా కొత్త వైద్య కళాశాలలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. వాటిలోనే సీట్లను ముందుగా భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ, 25 ప్రైవేటు కళాశాలలకు 1,884 ఇంటర్న్‌షిప్ సీట్లను కేటాయించారు.

పారామెడికల్‌ సీట్ల భర్తీకి మార్చి 21న కౌన్సెలింగ్‌
కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో 2022-23 విద్యాసంవత్సరానికి వివిధ పారామెడికల్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న 114 సీట్ల భర్తీకి మార్చి 21న ఉదయం 9 గంటలకు కేఎంసీ ఆడిటోరియంలో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాసు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ తెలిపారు.

Also Read:

పాలిటెక్నిక్ ఫెయిలైన వాళ్లకు గుడ్ న్యూస్, ఇప్పుడు పరీక్ష రాసి పాస్‌ కావొచ్చు - 1990 నుంచి ఇప్పటిదాకా!
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ఇంత వరకు పాస్‌ కాలేకపోయిన వారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్‌ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి వారికి ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ సీ శ్రీనాథ్‌ మార్చి 8న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించడానికి ఏప్రిల్‌ 10 చివరితేదీగా నిర్ణయించారు. ఇక రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 14 వరకు, తత్కాల్‌ స్కీం కింద ఎగ్జామ్‌ ఫీజుతో పాటు మరో రూ.6,000 అదనంగా కలిపి ఏప్రిల్‌ 15 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

'నిట్‌'లో ఎంసీఏ ప్రవేశానికి 'నిమ్‌సెట్', నోటిఫికేషన్ వెల్లడి!
దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్‌)లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) -2023' నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా... వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి నిట్-జంషెడ్‌పూర్ పరీక్ష బాధ్యతలు చేపట్టింది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget