అన్వేషించండి

JEE Advanced 2025 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్ మీకోసం

JEE Advanced Result | ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 రిజల్ట్స్ విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ https://results25.jeeadv.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

JEE Advanced Result 2025 Direct Link Here | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి. లక్షలాది ఇంజినీరింగ్ ఆశావహులకు అప్‌డేట్ వచ్చింది. JEE అడ్వాన్స్డ్ 2025 ఫలితాలను అధికారులు విడుదల చేశాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డును jeeadv.ac.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. అదే విధంగా ఫైనల్ ఆన్సర్ కీ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్

ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను IIT కాన్పూర్ నిర్వహించింది. ఈ ఏడాది JEE అడ్వాన్స్డ్ పరీక్షకు 1,90,000 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. రెండు పేపర్లలో అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ జరిగింది. పేపర్-1, పేపర్-2, రెండూ 180 మార్కుల చొప్పున మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు.

మే 18న పరీక్ష

JEE అడ్వాన్స్డ్ 2025 పరీక్ష మే 18న దేశవ్యాప్తంగా 224 పరీక్ష కేంద్రాలలో రెండు షిఫ్ట్లలో నిర్వహించారు. ప్రత్యేకత ఏమిటంటే, భారతదేశంతో పాటు ఖాఠ్మాండు, దుబాయ్ వంటి విదేశీ పరీక్షా కేంద్రాలలో ఎగ్జామ్ నిర్వహించారు.  IIT కాన్పూర్ ఈ ఏడాది ఈ పరీక్షను నిర్వహించింది. IIT కాన్పూర్ ఫలితాలతో పాటు టాపర్ల ర్యాంక్ జాబితాను విడుదల చేసింది. ఈసారి రజిత్ గుప్తా దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ విద్యార్థులు టాప్ 10లో 

ఈ సంవత్సరం JEE అడ్వాన్స్‌డ్‌లో టాప్ 10లో చోటు దక్కించుకున్న విద్యార్థులలో రజిత్ గుప్తా మొదటి స్థానంలో నిలిచాడు. సాక్షం జిందాల్ రెండో ర్యాంక్,  మాజిద్ ముజాహిద్ హుస్సేన్ 3వ ర్యాంక్, పార్థ్ మందర్ వర్తక్ 4వ, ఉజ్వల్ కేసరి ఐదవ ర్యాంకు సాధించారు. అక్షత్ కుమార్ చౌరాసియా, సాహిల్ ముఖేష్ దేవ్, దేవేష్ పంకజ్ భయ్యా, అర్నాబ్ సింగ్, వడ్లమూడి లోకేష్ టాప్ 10 లో ఉన్నారు.

ర్యాంక్ నిర్ణయించే పద్ధతి

JEE అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థులు పొందిన మొత్తం మార్కుల ఆధారంగా ర్యాంక్ జాబితా రూపొందిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఒకే మార్కులు కలిగి ఉంటే, వారి మధ్య టై-బ్రేక్ విధానం వర్తిస్తుంది. ఇందులో, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో మెరుగైన స్కోరు సాధించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.

కేటగిరీల వారీగా టాపర్ల జాబితా

ఓపెన్ కేటగిరీలో వేద్ లహోటి 355 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. అతను IIT ఢిల్లీ జోన్. GEN-EWSలో రాఘవ్ శర్మ, OBC-NCLలో మచ్చా బాలాదిత్య, SCలో బిబాస్వాన్ విశ్వాస్, STలో సుముఖ్ MG టాపర్లుగా నిలిచారు. దివ్యాంగ్ విభాగంలో, చుంచికళ శ్రీచరణ్ CRL-PwD కింద, GEN-EWS-PwDలో గుండా జోష్మిత, OBC-NCL-PwDలో పార్థ్ బవాంకులే, SC-PwDలో హేమంత్ గాడ్వే, ST-PwDలో సంగ్యే నార్ఫెల్ షెర్పా నెంబర్ వన్‌గా నిలిచారు.

పురుషుల విభాగంలో వేద్ లహోటి (355 మార్కులు, IIT ఢిల్లీ) AIR-1 సాధించగా, మహిళా విభాగంలో ద్విజా ధర్మేష్‌కుమార్ పటేల్ (360 మార్కులు, IIT బాంబే) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఆమె దేశవ్యాప్తంగా అమ్మాయిలలో టాపర్‌గా నిలవగా.. ఆల్ ఇండియా ర్యాంక్-7ను సాధించింది.

జోన్ వారీగా ప్రదర్శన

IIT బాంబే జోన్ నుండి ద్విజా పటేల్, IIT కాన్పూర్ నుండి శ్రేష్ఠా గుప్తా, IIT ఢిల్లీ నుండి అరిత్రా మల్హోత్రా, IIT గువహతి నుండి అర్చిత బంకా, IIT మద్రాస్ నుండి శ్రీనిత్య దేవరాజ్,  IIT భువనేశ్వర్ నుండి తమన్నా కుమారి మంచి ప్రతిభ కనబరిచారు.

JoSAA కౌన్సెలింగ్ జూన్ 3 న ప్రారంభం

ఫలితాల తర్వాత, JoSAA కౌన్సెలింగ్ 2025 ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, 32 NITలు, 26 IIITలు, 47 GFTI సంస్థలలో విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. జూన్ 3 నుంచి జూలై 28 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

కౌన్సెలింగ్‌లో విద్యార్థులు జూన్ 3 నుంచి జూన్ 12 సాయంత్రం 5 గంటల వరకు JoSAA వెబ్‌సైట్‌ను సందర్శించి నమోదు చేసుకోవాలి. వారికి నచ్చిన కళాశాలలు,  బ్రాంచ్‌లను ఎంచుకోవాలి. అనంతరం మొదటి రౌండ్ సీటు కేటాయింపు జాబితా జూన్ 14న విడుదల చేస్తారు. సీట్లు లభించిన విద్యార్థులు జూన్ 19 లోపు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేసి సీటుకు సంబంధించి ఫీజు చెల్లించాలి.

ప్రతి వారం కొత్త రౌండ్

2వ రౌండ్: జూన్ 21

3వ రౌండ్: జూన్ 28

4వ రౌండ్: జూలై 4

5వ రౌండ్: జూలై 10

6వ మరియు చివరి రౌండ్: జూలై 16

బాలికలకు 20% రిజర్వేషన్

ఈ ఏడాది ఒక ప్రత్యేక చర్య తీసుకున్నారు. IITలతో పాటు NITలలో బాలికలకు 20% అదనపు సీట్లు కేటాయించారు. దాంతో బాలికలకు టాప్ ఇంజినీరింగ్ సంస్థలలో ఎక్కువ అవకాశాలు లభించనున్నాయి. ఈ సీట్ల వల్ల సాధారణ లేదా రిజర్వ్డ్ సీట్లలో ఎలాంటి తగ్గింపు ఉండదు.

ఫలితాలను ఎలా చెక్ చేయాలి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in సందర్శించండి.
  • ‘JEE అడ్వాన్స్డ్ ఫలితాలు 2025’ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ రోల్ నంబర్, పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ నమోదు చేయండి.
  • సబ్మిట్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసి భవిష్యత్తు కోసం సేవ్ చేసుకోండి.

Direct Link

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget