అన్వేషించండి

Education in Mother Tongue: ఇక చదువులన్నీ మాతృభాషలోనే, స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ

దేశంలోని చదువులన్నీ ఇక మాతృభాషలోనే సాగనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన విద్యావిధానంతో భారత్‌లోని భాషలన్నింటికి గౌరవం తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

దేశంలోని చదువులన్నీ ఇక మాతృభాషలోనే సాగనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన విద్యావిధానంతో భారత్‌లోని భాషలన్నింటికి గౌరవం తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానమంత్రి శనివారం(జులై 29) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ‘అఖిల భారత శిక్షా సమాగం’ మూడో వార్షికోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్‌ వరకు బోధన ఇక మాతృభాషలోనే జరగనుందని చెప్పారు.  

సామర్థ్యం ఆధారంగా కాకుండా భాషను బట్టి విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తున్నామని.. ఇది యువ ప్రతిభకు మనం చేస్తున్న అతి పెద్ద అన్యాయమని, అందుకే నూతన విద్యా విధానం తీసుకొచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక మాతృభాషలో బోధన ద్వారా భారత్‌లో యువ ప్రతిభకు అసలైన న్యాయం జరగనుందని మోదీ అన్నారు. సామాజిక న్యాయపరంగానూ ఇది కీలక అడుగుగా ప్రధాని అభివర్ణించారు. 

అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ భాష ద్వారే ప్రగతి సాధించాయని, ఐరోపానే తీసుకుంటే అక్కడ చాలా దేశాలు.. తమ స్థానిక భాషలనే వినియోగిస్తాయి. మనం మాత్రం ఎన్నో భాషలు అందుబాటులో ఉన్నా.. వాటిని వెనకబాటుతనానికి సంకేతంగానే చూపించామని, ఇంత కన్నా దౌర్భాగ్యం ఏముంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. 

ఎంత తెలివైన వ్యక్తి అయినా.. అతనికి ఇంగ్లిషు రాకపోతే ఆ ప్రతిభను తొందరగా స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నామని, దీనివల్ల గ్రామీణ భారతంలోని తెలివైన విద్యార్థులకు అతి పెద్ద నష్టం వాటిల్లుతుందని.. నూతన విద్యావిధానంతో ఈ హీన భావనను తొలగించడానికి ప్రయత్నం ప్రారంభించినట్లు మోదీ అభిప్రాయపడ్డారు. 

ఐక్యరాజ్యసమితిలోనూ నేను భారత భాషలోనే మాట్లాడతానని.. దీనివల్ల వినేవాళ్లకు చప్పట్లు కొట్టడానికి సమయం పడుతుందేమో.. పట్టనీయండి. సాంఘిక శాస్త్రాల నుంచి ఇంజినీరింగ్‌ వరకు బోధన ఇక భారతీయ భాషల్లోనే జరగనుంది. మాతృభాషతో ఇంకో పెద్ద లాభం కూడా ఉంది. అదేంటంటే ఇప్పటివరకు భాషా రాజకీయాలతో విద్వేషాలకు తెరలేపిన వారు తమ దుకాణాలను మూసుకోవాల్సి ఉంటుంది. నూతన విద్యా విధానంతో దేశంలో ప్రతి భాషకూ గౌరవం లభించనుంది మోదీ పేర్కొన్నారు.

ALSO READ:

నల్సార్‌ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ఓయూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ప్రకటన విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ రామిరెడ్డి దూరవిద్య కేంద్రం (ఓయూసీడీఈ) ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించి జులై 28 నుంచి ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సు్ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni to Lead CSK IPL 2025 | సీఎస్కే ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..ఓ బ్యాడ్ న్యూస్ | ABP DesamRCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడుShubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Earthquake prediction for Ramagundam: రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
రామగుండానికి.. గండం…. పొంచి ఉన్న భూకంపం -అప్రమత్తం చేస్తున్న Epic
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
IPL 2025 DC VS RCB Result Update: ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. డీసీని గెలిపించిన రాహుల్.. 
ఢిల్లీ అజేయ రికార్డు.. వ‌రుస‌గా నాలుగో మ్యాచ్ లో విక్ట‌రీ.. 93 రన్స్ తో డీసీని గెలిపించిన రాహుల్.. 
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Mega Star Chiranjeevi On Mark Shankar:
"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు" హ్యాపీ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి 
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
Mangalagiri Latest News: మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి  నెల 13న శంకుస్థాపన చేయనున్న లోకేష్
మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి నెల 13న శంకుస్థాపన చేయనున్న లోకేష్
Kohli Stunning Record:  కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్లో ఆ ఫీట్ చేసిన తొలి ప్లేయ‌ర్.. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరిటే..
కోహ్లీ అరుదైన రికార్డు.. ఐపీఎల్లో ఆ ఫీట్ చేసిన తొలి ప్లేయ‌ర్.. ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు త‌న పేరిటే..
Embed widget