అన్వేషించండి

DOST: 'దోస్త్‌' ప్రవేశాల షెడ్యూల్‌లో మార్పు! సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్‌' ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో సెల్ప్ రిపోర్టింగ్ చేసే గడువును పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి 'దోస్త్‌' ద్వారా ప్రవేశాలు పొందినవారికి ఉన్నత విద్యామండలి కీలక సూచన చేసింది. సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో సెల్ప్ రిపోర్టింగ్ చేసే గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కురుస్తున్న ఏకధాటి వర్షాల వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు గడువును పెంచారు. మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులతోపాటు..  అన్ని విడతల్లో సీట్లు సాధించిన విద్యార్థులు జులై 26లోపు సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా జులై 26 నుంచే తరగతులు కూడా ప్రారంభంకానున్నాయి. కళాశాలలో చేరిన వారు మరో బ్రాంచిలోకి మారేందుకు జులై 28 నుంచి 31 వరకు ఇంట్రా కాలేజ్‌ ప్రక్రియ జరుగుతుందని, వారికి ఆగస్టు 1న సీట్లు కేటాయిస్తామని 'దోస్త్‌' అధికారులు ఈ మేరకు ప్రకటించారు.

మొదటి విడత ఇలా..
దోస్త్ మొద‌టి విడత‌లో 73,220 మంది విద్యార్థులకు జూన్ 16న సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు.

రెండో విడత ఇలా..
డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ(దోస్త్‌) రెండో విడత సీట్ల కేటాయింపులో భాగంగా 49,267 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.  రెండో విడతలో సీట్లు పొందిన వారిలో కామర్స్‌(బీబీఏ సహా)- 21,255, లైఫ్‌ సైన్సెస్‌- 11,944, ఫిజికల్‌ సైన్సెస్‌- 9,076, ఆర్ట్స్‌- 6,307, డేటా సైన్స్‌- 431, ఇతర కోర్సులో 81 మంది ఉన్నారు. తొలి విడతలో 73,220 మంది సీట్లు దక్కించుకున్నా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 49 వేల మందే చేశారు. 

మూడో విడత ఇలా..
డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన 'దోస్త్‌' మూడో విడత సీట్లను జులై 20న అధికారులు కేటాయించారు. రెండో విడతలో మొత్తం 49,267 మందికి సీట్లను కేటాయించగా.. మూడో విడతలో 72,949 మందికి సీట్లు కేటాయించారు. మూడో విడతలో సీట్లు పొందినవారిలో 10,939 మంది ఆర్ట్స్‌ కోర్సును ఎంచుకోగా.. 32,209 మంది కామర్స్‌ కోర్సును ఎంచుకున్నారు. ఇక లైఫ్‌ సైన్స్‌ కోర్సును 16,859 మంది, ఫిజికల్‌ సైన్సెస్‌ కోర్సును 12,620 మంది ఎంచుకున్నారు. డిఫార్మసీ సీట్లు పొందిన వారు కేవలం 235 మంది మాత్రమే ఉన్నారు. ఇతర కోర్సులను ఎంచుకున్న వారు 87 మంది ఉన్నారు. 

'దోస్త్' మూడు రౌండ్ల సీట్లకేటాయింపు వివరాలు పరిశీలిస్తే.. మొత్తంగా 1,95,436 మంది విద్యార్థులకు అధికారులు సీట్లను కేటాయించారు. మొదటి విడతలో 73,220, రెండో విడతలో 49,267, మూడో విడతలో 72949 మందికి సీట్లు పొందారు. అయితే వీరిలో మొదటి విడతలో సీటు పొందినవారు.. రెండో విడతకు, రెండో విడతలో సీటు పొందిన వారు మూడో విడత కౌన్సెలింగ్‌లో ఉత్తమ కాలేజీ, కోర్సు కోసం కౌన్సెలింగ్‌లో పాల్గొంటూ ఉంటారు. ఈ క్రమంలో మొత్తం ఎన్ని సీట్లు భర్తీ అయినాయి తెలియాలంటే తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉంది.

ఆగస్టు 1 నుంచి స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌..
'దోస్త్' స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులకు ఆగస్టు 16న సీట్లను కేటాయించనున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు
AP Pensions: దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ
దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, తొలగించలేదని మంత్రి క్లారిటీ
Ganesh Visarjan Tragedies: గణేశ్‌ శోభాయాత్రలో విషాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి, కొందరి పరిస్థితి విషమం
గణేశ్‌ శోభాయాత్రలో విషాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి, కొందరి పరిస్థితి విషమం
Renault Kiger Emi and Down Payment: అదిరే ఫీచ‌ర్ల‌తో ఇచ్చిప‌డేస్తున్న Renault కిగ‌ర్ ను సొంతం చేసుకోండిలా.. డౌన్ పేమెంట్, ఈఎంఐ బ్రేకప్ వివ‌రాలు..
అదిరే ఫీచ‌ర్ల‌తో ఇచ్చిప‌డేస్తున్న Renault కిగ‌ర్ ను సొంతం చేసుకోండిలా.. డౌన్ పేమెంట్, ఈఎంఐ బ్రేకప్ వివ‌రాలు..
Advertisement

వీడియోలు

Assembly Sessions on BC reservation Bill | గంగుల కమలాకర్‌పై కామెడీ పంచులు విసిరిన సీఎం రేవంత్
PM Modi meeting China President XI Jinping | జిన్‌పింగ్‌తో మోదీ
KTR vs Revanth in Assembly Sessions | 52 సార్లు ఢిల్లీ వెళ్లి పీఎంని కలవకుండా సీఎం ఎందుకొచ్చారు?: కేటీఆర్
Gangula Kamalakar in Assembly | బీసీ బిల్లుపై గంగుల కమలాకర్ ఫైర్
Fan Made Picture Of Pawan Kalyan  |  భూతద్దంతో పవన్ కల్యాణ్ చిత్రాన్ని గీసిన అభిమాని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పలు జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు
AP Pensions: దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ
దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, తొలగించలేదని మంత్రి క్లారిటీ
Ganesh Visarjan Tragedies: గణేశ్‌ శోభాయాత్రలో విషాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి, కొందరి పరిస్థితి విషమం
గణేశ్‌ శోభాయాత్రలో విషాదాలు.. రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి, కొందరి పరిస్థితి విషమం
Renault Kiger Emi and Down Payment: అదిరే ఫీచ‌ర్ల‌తో ఇచ్చిప‌డేస్తున్న Renault కిగ‌ర్ ను సొంతం చేసుకోండిలా.. డౌన్ పేమెంట్, ఈఎంఐ బ్రేకప్ వివ‌రాలు..
అదిరే ఫీచ‌ర్ల‌తో ఇచ్చిప‌డేస్తున్న Renault కిగ‌ర్ ను సొంతం చేసుకోండిలా.. డౌన్ పేమెంట్, ఈఎంఐ బ్రేకప్ వివ‌రాలు..
Godavari floods: గోదావరి ఉగ్రరూపం- ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక! కోనసీమలో హై అలర్ట్
గోదావరి ఉగ్రరూపం- ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక! కోనసీమలో హై అలర్ట్
Nivetha Pethuraj: రేసింగ్‌లో ఫ్రెండ్ షిప్... ఆ తర్వాత లవ్ - నిశ్చితార్థం, పెళ్లిపై హీరోయిన్ నివేదా పేతురాజ్ రియాక్షన్
రేసింగ్‌లో ఫ్రెండ్ షిప్... ఆ తర్వాత లవ్ - నిశ్చితార్థం, పెళ్లిపై హీరోయిన్ నివేదా పేతురాజ్ రియాక్షన్
Harish Rao On Kaleshwaram Report: మాకు 8బి నోటీసులు ఇవ్వలేదు.. కాళేశ్వరం  నివేదిక ఓ చెత్త కాగితం: అసెంబ్లీలో హరీష్ రావు
మాకు 8బి నోటీసులు ఇవ్వలేదు.. కాళేశ్వరం నివేదిక ఓ చెత్త కాగితం: అసెంబ్లీలో హరీష్ రావు
Mann Ki Baat: ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయి.. ప్రధాని మోదీ ఆందోళన
ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయి.. ప్రధాని మోదీ ఆందోళన
Embed widget