అన్వేషించండి

AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

AP ICET 2022 : ఏపీ ఐసెట్-2022 నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జులై 25న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.

AP ICET 2022 : ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల అర్హత పరీక్ష ఐసెట్ నోటిఫికేషన్‌ సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఎన్‌. కిషోర్‌బాబు శనివారం విడుదల చేశారు. జూన్‌ 10వ తేదీ వరకు అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అపరాధ రుసుంతో జులై 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని సెట్ కన్వీనర్ తెలిపారు. జులై 25న రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఐసెట్ పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడానికి ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in సందర్శించాలని సూచించారు. 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP ICET నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( AP ICET 2022) రిజిస్ట్రేషన్లు మే 14, 2022 ప్రారంభం అయ్యాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AP ICET నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. ముఖ్యమైన తేదీల జాబితా, దరఖాస్తు చేసే విధానం కింద పేర్కొన్నారు. 

  1. రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివేట్ అయింది. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు
  2. అప్లికేషన్లు నమోదు చేసుకోవడానికి గడువు జూన్ 10, 2022తో ముగుస్తుంది
  3. జులై 25, 2022న పరీక్ష నిర్విహస్తారు

AP ICET 2022 దరఖాస్తు ఫారమ్ పూర్తి చేసేందుకు ఆలస్య రుసుము చెల్లించకుండా జూన్ 10 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జరిమానా చెల్లించి తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 25న పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. 

  •  ఆసక్తిగల అభ్యర్థులు ఏపీ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in కు వెళ్లాలి.
  • హోమ్‌పేజీలో, 'స్టెప్ 1 ఫీజు చెల్లింపు' లింక్‌పై క్లిక్ చేసి, ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించండి
  • చెల్లింపు తర్వాత, స్టేటస్ తనిఖీ చేసి, ఆపై దరఖాస్తు ఫారమ్‌ను ప్రారంభించాలి
  • అన్ని వివరాలు పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరిగా సమర్పించుపై క్లిక్ చేయండి
  • అప్లికేషన్ ను పేజీ ప్రింట్ అవుట్ తీసుకోండి

ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్ 

ఏపీ ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎడ్ సెట్ నోఫికేషన్ ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌  అముదవల్లి శుక్రవారం విడుదల చేశారు. అర్హత పరీక్షకు మే 9 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు రుజుం ఓసీ అభ్యర్థులకు రూ.650, బీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. ఎడ్ సెట్ పరీక్షను జులై 13న నిర్వహించనున్నారు. బీఈడీ, స్పెషల్ బీఈడీ చేసేందుకు బీఏ లేదా బీఎస్సీ లేదా బీకాం లేదా బీసీఏ లేదా బీబీఎం కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో పాస్ అవ్వాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం cets.apsche.ap.gov.in లో విజిట్ చేయండి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Srisailam Lathi charge: శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Telangana municipal elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
IND vs PAK T20 World Cup 2026: టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో ఆడేందుకు సిద్ధం; పాకిస్తాన్ యు-టర్న్! ICC సమావేశం తర్వాత నిర్ణయం!
టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో ఆడేందుకు సిద్ధం; పాకిస్తాన్ యు-టర్న్! ICC సమావేశం తర్వాత నిర్ణయం!

వీడియోలు

T20 World Cup 2026 Jasprit Bumrah, Abhishek Sharma Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
T20 World Cup 2026 Jasprit Bumrah Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
Pakistan Conditions to Play with India | భారత్‌తో మ్యాచ్ ..షరతులు పెట్టిన పాక్
Nepal vs England T20 World Cup | ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్
Sourav Ganguly slams Pakistan | పాకిస్తాన్ పై సౌరబ్ గంగూలీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srisailam Lathi charge: శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Telangana municipal elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
IND vs PAK T20 World Cup 2026: టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో ఆడేందుకు సిద్ధం; పాకిస్తాన్ యు-టర్న్! ICC సమావేశం తర్వాత నిర్ణయం!
టీ20 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో ఆడేందుకు సిద్ధం; పాకిస్తాన్ యు-టర్న్! ICC సమావేశం తర్వాత నిర్ణయం!
DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
లగ్జరీ కార్ల భారీ ధర వెనుక అసలు కారణాలు ఇవే - ఇలాంటి విషయాల కోసమే డబ్బు ఖర్చు పెట్టేది
లగ్జరీ కార్లు ఎందుకు అంత ఖరీదెక్కువ? నిజంగా దేని కోసం మనం అంత డబ్బు ఖర్చు పెడతాం?
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?
హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?
BCCI Central Contract: BCCI సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బిగ్‌ ప్లేయర్స్‌ తొలగింపు! కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
BCCI సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బిగ్‌ ప్లేయర్స్‌ తొలగింపు! కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
Embed widget