అన్వేషించండి

AP Inter Exams: అలర్ట్! ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడే ఛాన్స్ - కారణం ఏంటంటే

Inter Exams Postpone: ముందస్తు షెడ్యూలు ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి మొదలై 28వ తేదీతో పూర్తి కావాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్స్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ బోర్డ్ పరీక్షలు (AP Inter Exams) వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ప్రకటించిన జేఈఈ మెయిన్‌ ఎక్సామ్స్ (JEE Main) డేట్‌లు, గతంలో ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలు (Inter Exams Dates) ఒకే తేదీల్లో వస్తున్నాయి. దీంతో ఇంటర్‌ పరీక్షల వాయిదాపై అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూలు ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి మొదలై 28వ తేదీతో పూర్తి కావాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్స్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. 

జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్ష జరిగే 16న ఇంటర్‌ సెకండ్ ఇయర్ మాథ్స్, బోటనీ, సివిక్స్, 19న మాథ్స్-2బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు ఉన్నాయి. జేఈఈ మెయిన్‌ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు 2 విడతలుగా నిర్వహిస్తారు. ఇంటర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు ఉంటాయి. కాబట్టి, ఒకేరోజు విద్యార్థులు జేఈఈ మెయిన్‌, ఇంటర్‌ పరీక్షలు రాయడం అస్సలు కుదిరే పని కాదు. అందుకే ఇంటర్‌ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలా? లేదంటే ఒకే తేదీన ఉన్నటువంటి పరీక్షల్ని వాయిదా వేస్తే సరిపోతుందా? అన్న కోణంలో అధికార యంత్రాంగం సమాలోచనలు జరుపుతోంది. 

ఇంటర్‌ ఫస్టియర్ (Inter Exams Date) పరీక్షలను యథాతథంగా కొనసాగించి, రెండో ఏడాది వాయిదా వేస్తే ఎలాగుంటుందనే అంశంపైన కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇంటర్‌ పరీక్షలు వాయిదా పడితే ఆ ఎఫెక్ట్ 10వ తరగతి పరీక్షలపైన కూడా పడుతుంది. ఈ క్రమంలో సెకండరీ స్కూల్ బోర్డు (SSC Board) ఇంటర్‌ బోర్డు అధికారులు బుధవారం ప్రత్యేకంగా సమావేశం అవ్వనున్నారు.

జూన్‌లో ఈఏపీసెట్‌?

జేఈఈ మెయిన్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షల వాయిదా కారణంగా ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ను జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్‌ మొదటి విడత 16 నుంచి 21 వరకు, రెండోవిడత మే 24 నుంచి 29 వరకు ఉంది.

తెలంగాణలో (Telangana Inter) సాధారణంగానే..
తెలంగాణలో ఇంటర్ పరీక్షల (Telangana Inter Exams) విషయంలో ఎలాంటి సమస్యా లేదు. ఇక్కడ ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. అలాగే ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Supreme Court On Third Language: 9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
9వ తరగతిలో మూడో భాష వద్దు - కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన!
How To Join ISRO After Graduation: ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ఇస్రోలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి? టైమింగ్స్ ఏంటీ? ఇప్పుడు కొత్తగా రిక్రూట్‌మెంట్ జరుగుతోందా?
ISRO Scientists Resign:ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?
ఇస్రోలో 100 మందికిపైగా శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామా చేశారు? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget