అన్వేషించండి

Miyapur attack: మియాపూర్ ప్రేమోన్మాది కత్తి దాడిలో యువతి తల్లి మృతి - నిందితుడి పరిస్థితి కూడా విషమం

Miyapur Attack: మియాపూర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తల్లి శోభ ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే నిందితుడు సందీప్ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Miyapur Attack: హైదారాబాద్ మియాపూర్ లో నిన్న జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి తల్లి మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి శోభ ఈరోజు ఉదయం ప్రాణాలు విడిచింది. అయితే తన ప్రియురాలు తనను దూరం పెడుతుందనే కోపతం.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి నిన్న ఉదయం ప్రియురాలు, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం నిందితుడు సందీప్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

అసలేం జరిగిందంటే..?

గుంటూరుకు చెందిన 19 ఏళ్ల వైభవి, సందీప్ గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వైభవి.. సందీప్ ను దూరం పెడుతోంది. కానీ సందీప్ మాత్రం ఆమెను వదలడం లేదు. తరచుగా వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నాడు. నిన్ను చంపి నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. మెసేజ్‌లు పంపుతున్నాడు. ఆమె వాటిని అంతగా పట్టించుకోలేదు.

ముగ్గురినీ ఆస్పత్రికి చేర్చిన స్థానికులు..

ఏ నెంబర్ నుంచి ఫోన్, మెసేజ్ చేసినా బ్లాక్ చేయడం ప్రారభించింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన సందీప్... ఈరోజు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మియపూర్ లోని వైభవి ఇంటికి వచ్చాడు. వైభవి తల్లి శోభతో గొడవ పడి ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. తర్వాత తను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు శోభ, వైభవిలను కొండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సందీప్ కు లోతైన గాయం కావడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అర్ధరాత్రి తల్లి శోభ పరిస్థితి కూడా విషమించడంతో గాంధీకి తరలించారు. ఈ క్రమంలోనే ఈరోజు పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది. 

రెండు నెలల క్రితం ఓయూలో ఇలాంటి ఘటనే..!

హైదరాబాద్ లో ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో కూడా ఇలానే ప్రేమ పేరుతో ఓ యువతిపై యువకుడు దాడి చేశాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ముషిరాబాద్‌కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమె డిగ్రీ చదువుతోంది. 

ముషీరాబాద్ బోలక్‌పూర్‌కు చెందిన ఓ యువతి, రంజిత్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్ సమీపంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఓ విషయంపై గొడప జరిగింది. ఈ గొడవతో రంజిత్ ఆగ్రహానికి గురై తనతో తెచ్చుకున్న ఆయుధంతో యువతిపై దాడి చేశాడు. ఆమె చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం రంజిత్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమీప హాస్టల్లో ఉన్న విద్యార్థులు విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన యువతిని కాచిగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget