అన్వేషించండి

Kurnool Crime News: భార్యను, అడ్డొచ్చిన అత్తను కర్రతో బాది చంపేసిన వ్యక్తి!

Kurnool Crime News: కాపురానికి రానందని భార్యను, అడ్డు వచ్చినందుకు అత్తను కర్రతో బాది హత్య చేశాడో వ్యక్తి. అనంతరం అక్కడి నుంచి పారిపోగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 

Kurnool Crime News: ఎన్నెన్నో ఆశలతో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల పాటు వీరి కాపురం హాయిగా సాగింది. ఈక్రమంలోనే భర్త.. తన భార్యను తన ఇంటికి రమ్మన్నాడు. అక్కడే కాపురం పెడదామని చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈక్రమంలోనే భార్యపై విపరీతమైన కోపం పెంచుకున్న అతడు.. ఆమెను చంపేయాలనుకున్నాడు. వెంటనే ఓ పెద్ద కర్ర తీసుకొని వెళ్లి బాదాడు. కూతురును అల్లుడు చంపేస్తుండడంతో అడ్డుగా వెళ్లిన అత్తను కూడా అతడు చంపేశాడు. వీరిద్దరూ చనిపోయారని నిర్ధారించుకొని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. 

అసలేం జరిగిందంటే?

కర్నూలు జిల్లా కౌతాలం మండలం బాపురం గ్రామానికి చెందిన మహాదేవి వాలంటీరుగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు కర్ణాటక రాష్ట్రంలోని టెక్కలికోటకు చెందిన రమేష్ తో రెండు నెలల క్రితం వివాహం జరిగింది. మహాదేవి తల్లి కూడా బాపూరం గ్రామంలో వీఆర్ఏ గా పని చేస్తోంది. పెళ్లైన తర్వాత కాపురానికి కర్ణాటక రావాలని రమేష్ తన భార్యను కోరాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. కర్నూలులోనే ఉందామని చెప్పింది. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రమేషే.. అర్థరాత్రి సమయంలో భార్యను హత్య చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ కర్ర తీసుకొచ్చి భార్యపై దాడి చేశాడు. అది గుర్తించిన అత్త అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెపై కూడా దాడికి పాల్పడ్డాడు. తల మీద తీవ్రంగా గాయాలు కావడంతో తల్లీ, కూతుర్లు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరూ చనిపోయినట్లు గ్రహించిన రమేష్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రమేష్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.  

ఇటీవలే కన్నకూతురిని బండకేసి కొట్టి తండ్రి

మద్యం మత్తులో ఓ చిన్నారిని కన్న తండ్రి నేలకేసి కొట్టాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. మంగళగిరి నగర పరిధి నవులూరు ఎంఎస్ఎస్ కాలనీలో ఓ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చనిపోయిన చిన్నారి వయసు రెండేళ్లు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గోపి - మౌనిక అనే భార్యభర్తలు నవులూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గోపి బేల్దారు కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ మద్య కాలంలో మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగి రోజూ భార్యతో గొడవ పడే వాడు. ఇటీవలే కూడా పూటుగా  మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య మౌనికతో గొడవకు దిగాడు. ఇద్దరి మద్య ‌వాగ్వివాదం జరిగింది. 

పూర్తిగా మద్యం మత్తులో ఉన్న గోపి పట్టరాని ఆగ్రహంతో  తన పెద్ద కూతురు లక్ష్మీ పద్మను ఎత్తి నేలకేసి‌ కొట్టాడు. బండ తలకు బలంగా తగలడంతో ఆ పసి పాప అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన చూసిన స్థానికులు ఒక్క సారిగా కిరాతక తండ్రి గోపీపై దాడి ‌చేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి స్థానికుల నుంచి గోపీని రక్షించి స్టేషన్‌ కు తీసుకు వెళ్ళారు. పాప మృత దేహాన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ కు తరలించారు. ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తి తండ్రి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడిని, అతణ్ని ఉరితీయాలని స్థానికులు ఆవేశంతో ఊగిపోయారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Hathras Stampede: ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో 27 మంది మృతి
ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో 27 మంది మృతి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Hathras Stampede: ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో 27 మంది మృతి
ఉత్తరప్రదేశ్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్ర విషాదం - తొక్కిసలాటలో 27 మంది మృతి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Embed widget