అన్వేషించండి

Kakinada Crime : ఒంటరి మహిళపై కన్నేసిన అన్నదమ్ములు, అత్యాచారం ఆపై హత్య- గడ్డివాములో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు

Kakinada Crime : ఇటీవల కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించి గడ్డివాములో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. అన్నదమ్ములు మహిళపై అత్యాచారం చేసి హతమార్చారని పోలీసులు తెలిపారు.

Kakinada Crime : కాకినాడ జిల్లాలో సంచలనం రేపిన గడ్డివాములో గుర్తుతెలియని మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. ఫిబ్రవరి 24న కాకినాడ జిల్లాలోని రాయవరం మండలం మాచవరం గ్రామ సమీపంలో పొలాల వద్ద గడ్డివాములో దగ్ధమైన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఒంటిరిగా ఉంటున్న ఓ వితంతువును అదే ప్రాంతంలో ఉంటోన్న ఇద్దరు అన్నదమ్ములు కలిసి అత్యాచారం చేసి వైరును మెడకు బిగించి చంపడమే కాకుండా దగ్గర్లో ఉన్న గడ్డివాములో పెట్టి తగులబెట్టారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించి పోలీసులు విచారణలో తేలిన విషయాలను రామచంద్రపురం డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి వెల్లడించారు.

ముందు వేధింపులు.. ఆపై పగ..

మాచవరం గ్రామంలోని స్థానిక దేవుడు కాలనీలో కొవ్వూరి సత్యవేణి అనే మహిళ భర్త మృతిచెందగా ఒంటరిగా జీవిస్తోంది. ఒంటిరిగా ఉంటున్న సత్యవేణిపై ఇదే కాలనీలో ఉంటోన్న నల్లమిల్లి ఉమామహేశ్వర రెడ్డి, వెంకటసత్యనారాయణ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ముల కన్నుపడిరది. దీంతో సత్యవేణిని పలుసార్లు వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా అసభ్యంగా కూడా ప్రవర్తించడంతో ఆమె స్థానిక పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో గ్రామ పెద్దలు మందలిండంతో సత్యవేణిపై పగ పెంచుకున్నారు అన్నదమ్ములు. సత్యవేణిని అత్యాచారం చేసి హత్య చేయాలని ఫ్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒంటరిగా వస్తున్న సత్యవేణిని గమనించి నిందితులిద్దరూ చినతలుపులమ్మ లోవకు వెళ్లే సమీపంలో మహిళను నిర్మాణుష్య ప్రాంతానికి లాక్కెళ్లి ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై అక్కడ దొరికిన వైరును మహిళ మెడకు బిగించి చంపారు. ఆమె శరీరంపై ఉన్న బంగారు వస్తువులను తీసుకుని మృతదేహాన్ని అక్కడే ఉన్న గడ్డివాములో పెట్టి దగ్ధం చేశారు.

మిస్టరీ నుంచి హత్య కేసుగా 

గడ్డివాములో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాన్ని గమనించిన రైతు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఆ మృతదేహం పురుషునిదా లేక మహిళదా అన్నది కూడా గుర్తించలేనంతగా కాలిపోవడంతో పోలీసులు ఈ మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. గడ్డివాము సమీపంలో మహిళ చెప్పులు, పగిలిన గాజు పెంకులు కనపడడంతో మహిళగా గుర్తించి ఆపై అదృశ్యం అయినవారి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే మాచవరంలోని దేవుడు కాలనీలో సత్యవేణి కనిపించడంలేదని గుర్తించారు గ్రామ మహిళా పోలీసులు. ఈ విషయాన్ని పోలీసులు దర్యాప్తు బృందానికి తెలియచేయడంతో అదే రోజు నుంచి ఇద్దరు అన్నదమ్ములు కనడడం లేదని గమనించడంతో వారి కదలికలపై దృష్టిసారించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో అసలు విషయాన్ని కక్కారు నిందితులు. వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచగా కోర్టు రిమాండ్‌ విధించింది.
 
నిందితుల తల్లి ఆత్మహత్య..

పోలీసులు ప్రెస్‌మీట్‌లో హత్య జరిగిన విధానం వివరించకముందే గ్రామంలో ఈ హత్యకు పాల్పడింది ఇద్దరు అన్నదమ్ములైన ఉమామహేశ్వరరెడ్డి, వెంకటసత్యనారాయణరెడ్డి అని బయటకు పొక్కడంతో నిందితుల తల్లి పద్మ ఈనెల ఎనిమిదిన  ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికి నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. చివరకు బంధువులే అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన పరిస్థితి నెలకొంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP DesamBJP Madhavi Latha vs Akbaruddin Owaisi | శ్రీరామ నవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి లత | ABP DesamTruck Hit Motorcycle In Hyderabad  | బైకును ఢీ కొట్టిన లారీ.. పిచ్చి పట్టినట్లు ఈడ్చుకెళ్లాడు | ABPPerada Tilak vs Ram Mohan Naidu | రామ్మోహన్ నాయుడు ఓడిపోతారు ఇదే కారణమంటున్న పేరాడ తిలక్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌  సేన
గుజరాత్‌ను చిత్తు చేసిన ఢిల్లీ, తేలిపోయిన గిల్‌ సేన
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Samsung New Smart TV: కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
కొత్త టీవీలు లాంచ్ చేసిన శాంసంగ్ - వావ్ అనిపించే డిస్‌ప్లేలతో!
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Jeep Compass New Car: జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
జీప్ కంపాస్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ గ్లోబల్ లాంచ్ - మనదేశంలో ఎప్పుడు?
UPSC 2023 Ranker Ananya Reddy: కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అధికారం ఎందుకు కోల్పోయారు? మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాపర్ అనన్యా రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget