అన్వేషించండి

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి!

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కరాటోయా నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి చెందారు.

Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్‌లోని కరాటోయా నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న పడవ బోల్తా  పడింది. ఈ ప్రమాదంలో 23 మంది దుర్మరణం చెందారు. ఇంకా పలువురు గల్లంతయ్యారు. ప్రమాదం సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారి సంఖ్య కచ్చితంగా ఎంతనేది తెలియలేదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 70 మంది ఉన్నట్లు సమాచారం అన్నారు.  

అసలేం జరిగింది?

బంగ్లాదేశ్‌లోని కరాటోయా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. “మేము 23 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అగ్నిమాపక సిబ్బంది, డైవర్లు మరిన్ని మృతదేహాల కోసం వెతుకుతున్నారు, ”అని వార్తా సంస్థ AFP స్థానిక పోలీసు అధికారి షఫీకుల్ ఇస్లాం తెలిపారు. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని ప్రమాదం జరిగిన ఉత్తర పంచాఘర్ జిల్లా పాలనాధికారి జహురుల్ ఇస్లాం తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. 

తరచూ ప్రమాదాలు 

స్థానిక వార్త సంస్థల సమాచారం ప్రకారం, తప్పిపోయిన వ్యక్తుల కచ్చితమైన సంఖ్య ఇంకా నిర్థారించలేదు. అయితే 70 మందికి పైగా పడవలో ఉన్నారని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు చెప్పారు. శతాబ్దాల నాటి ఆలయానికి వెళుతున్న యాత్రికులతో పడవ బోల్తా నదిలో పడింది.  ఉత్తర బంగ్లాదేశ్‌లోని బోడా పట్టణానికి సమీపంలో కరాటోయా నది మధ్యలో ఓడ అకస్మాత్తుగా ఒరిగిపోయి నీట మునిగిపోయింది. బంగ్లాదేశ్‌లో ఫెర్రీ ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. నదుల ద్వారా ప్రయాణించినప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించడంలేదని అధికారులు అంటున్నారు. అందుకే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. మే నెలలో ఇదే విధమైన ప్రమాదం జరిగింది. బోటు  ఇసుకతో నిండిన బల్క్ క్యారియర్‌ను ఢీకొని, పద్మ నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 26 మంది మరణించారు. జూన్ 2020లో నౌకను ఢీకొనడంతో ఢాకాలో ఫెర్రీ బోల్తా పడింది. అప్పుడు 32 మంది మరణించారు. అదే ఏడాది ఆగస్టులో నేత్రకోనలోని మదన్‌ ఉపజిల్లాలో పడవ మునిగి 17 మంది మరణించారు. అంతకు ముందు ఫిబ్రవరి 2015లో బంగ్లాదేశ్‌లోని ఓ నదిలో రద్దీగా ఉండే ఓడ కార్గో నౌకను ఢీకొనడంతో సుమారు 78 మంది చనిపోయారు.

Also Read : North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!

Also Read: UN Security Council: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత హోదా- రష్యా మద్దతు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget