అన్వేషించండి

Coronavirus Cases India: ఆఫీసుకెళ్తున్నారా? ఆగండాగండి! ఇంకొన్ని రోజులు ఇంటివద్దే పని చేయమంటున్న కంపెనీలు

కొవిడ్‌ తీవ్రత తగ్గడంతో ఇక ఆఫీసులకు వెళ్లే టైమొచ్చిందని అంతా భావించారు. కానీ రెండు రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో భారత వ్యాపార వర్గాలు వేచిచూసే ధోరణికే కంపెనీలు ఓటేస్తున్నాయి.

WFH or WFO India Inc Decides To Wait and Watch as Covid-19 Cases Spike Again: మూడు వేవ్‌లు ముగిశాయి! కొవిడ్‌ తీవ్రత చాలా తగ్గిపోయింది. అందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తైంది! ఇక ఆఫీసులకు వెళ్లే టైమొచ్చిందని అంతా భావించారు. కానీ రెండు రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో భారత వ్యాపార వర్గాలు వేచిచూసే ధోరణిని అనుసరించాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పుటికప్పుడే ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించే ఉద్దేశం తమకు లేదని చెబుతున్నాయి. మున్ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అంటున్నాయి.

భారతీ ఎయిర్‌టెల్‌, ఎరిక్‌సన్‌, హ్యూందాయ్‌, ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో, హోండా కార్స్‌, టెక్‌ మహీంద్రా, శామ్‌సంగ్‌, ఉబెర్‌, నెస్లే, ఎంఫాసిస్‌, పానసోనిక్‌ ఇండియా, క్యాష్ కరో, అప్‌గ్రేడ్‌, అపోలో టైర్స్‌, వొడాఫోన్‌ ఐడియా, కేపీఎంజీ వంటి కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలు, కరోనా పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి.

'పరిస్థితులను ఎయిర్‌టెల్‌ నిశితంగా పర్యవేక్షిస్తోంది. అన్ని కార్యాలయాల్లో కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది' అని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. తాము హైబ్రీడ్‌ పని విధానాన్ని అనుసరిస్తున్నామని హోండాకార్స్‌ ఇండియా పేర్కొంది. రెండేళ్లుగా ఇదే విధానం కొనసాగిస్తున్నామని, అవసరాన్ని బట్టి ఇంటివద్ద పనికే ప్రోత్సహిస్తున్నామని వివరించింది. తమ హెడ్‌క్వార్టర్స్‌, ఇతర ఆఫీసుల్లో తక్కువ మంది స్టాఫ్‌నే కొనసాగిస్తామని, మిగతావారికి వర్క్‌ ఫ్రం హోం ఇస్తామని హ్యుందాయ్‌ కార్స్‌ వెల్లడించింది. ఆఫీసులకు వచ్చేవారు మాస్కులు వేసుకోవాలని, టెంపరేచర్‌ చెకప్స్‌, సోషల్‌ డిస్టన్స్‌, చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి కఠినంగా అమలు చేస్తామని తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, సూచనల మేరకు తాము కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తామని ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ఉద్యోగులు భయపడాల్సిందేమీ లేదని, లక్షణాలు ఉంటే ఇంటివద్దే ఉండి పనిచేయాలని జొమాటో తెలిపింది. మున్ముందు పరిస్థితులను బట్టి కొన్ని వారాలు ఇంటివద్దే పని చేసేందుకు అనుమతిస్తామని కంపెనీ సీఈవో దీపిందర్ గోయెల్‌ అన్నారు. నెస్లే సైతం హైబ్రీడ్‌ విధానానికే ఓటేస్తున్నామని వెల్లడించింది.

భారత్‌లో 24 గంటల్లోనే 2,380 కొవిడ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,433కు చేరకుంది. రెండు రోజుల్లో 50 శాతానికి పైగా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా వంటి పెద్దపెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటివద్దే ఉండి పనిచేయమంటున్నాయి. పూర్తి ఆఫీసులకు అనుమతించడం లేదు. హైబ్రిడ్‌ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలకు ఉద్యోగులు వెళ్తున్నారు. వారు మళ్లీ ఇప్పుడు హైబ్రీడ్‌, వర్క్‌ ఫ్రం హోం విధానం అనుసరిస్తామని చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget