అన్వేషించండి

Mobile Tariff Hike: కొత్త సంవత్సరంలో 'హెలో' అనాలంటే మరింత ఎక్కువ చెల్లించాలి, టారిఫ్‌లు పెరిగే ఛాన్స్‌!

నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచవచ్చని జెఫరీస్ నివేదికలో ఉంది.

Mobile Tariff Hike Likely: కొత్త సంవత్సరంలో (2023) మొబైల్ ఫోన్ టారిఫ్‌ మరింత ఖరీదైనది కావచ్చు. నూతన ఏడాది రాగానే, మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచుతామని అన్ని టెలికాం కంపెనీలు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా) ఒకదాటి తర్వాత మరొకటి ప్రకటించవచ్చు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) మాత్రం ఈ రేట్ల రేసులో పాల్గొనకపోవచ్చు. 

విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ (Jefferies) విశ్లేషకులు ఇండియన్‌ టెలికాం కంపెనీల మీద ఇచ్చిన రిపోర్ట్‌లో ఈ విషయాన్ని వివరించారు.

కంపెనీల మార్జిన్లు, రాబడి మీద పెరిగిన ఒత్తిడి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-23 లేదా FY23) నాలుగో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ మొబైల్ టారిఫ్‌లను 10 శాతం వరకు పెంచవచ్చని జెఫరీస్ నివేదికలో ఉంది. ఈ రేట్ల పెంపు తర్వాత.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24 లేదా FY24) & ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ (2024-25 లేదా FY25) నాలుగో త్రైమాసికంలో (జనవరి- మార్చి కాలం) రేట్ల పెంపు ఉండవచ్చని తమ రిపోర్ట్‌లో జెఫరీస్‌ విశ్లేషకులు అంచనా వేశారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఈ రేట్ల పెంపు ఉంటుందని తెలిపారు.

గతంలో పెంచిన టారిఫ్‌ల వల్ల అందాల్సిన ప్రయోజనం ఆయా కంపెనీలకు ఇప్పటికి అందిందని చెప్పిన జెఫరీస్‌, కంపెనీ ఆదాయం & మార్జిన్‌ మీద మళ్లీ ఒత్తిడి పెరుగుతోందని నివేదికలో చెప్పింది. దీని కారణంగా ఈ టెలికాం కంపెనీలకు ఏమీ మిగలడదం లేదని, టారిఫ్‌లు మరోసారి పెంచడం తప్ప మరో ఆప్షన్‌ లేదని విశ్లేషించింది.

ఆర్పులో స్వల్ప పెరుగుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో, టెలికాం కంపెనీల 'ఒక్కో వినియోగదారుడి మీద సగటు ఆదాయం'లో (ARPU - ఆర్పు) స్వల్ప పెరుగుదల ఉంది. రిలయన్స్ జియో ఆర్పు 0.8 శాతం, భారతీ ఎయిర్‌టెల్ ఆర్పు 4 శాతం, వొడాఫోన్ ఐడియా ఆర్పు 1 శాతం పెరిగాయి. కొన్ని ఎంపిక చేసిన సర్కిళ్లలో భారతీ ఎయిర్‌టెల్ రూ. 99 ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌ను రద్దు చేసింది. ఇప్పుడు 28 రోజుల టారిఫ్ ప్లాన్ కోసం రూ. 99 కి బదులుగా రూ. 155 చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం, ఈ రీఛార్జ్ ప్లాన్‌ను హరియాణా, ఒడిశాలో ఈ కంపెనీ అమలు చేస్తోంది. రాబోయే రోజుల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేయవచ్చని భావిస్తున్నారు.

5G సేవలు ప్రారంభించడంతో పెరిగిన ఒత్తిడి
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ దేశంలోని అనేక నగరాల్లో 5G మొబైల్ సేవలను ప్రారంభించాయి. ఈ కంపెనీలు 5 స్పెక్ట్రంను పొందడానికి వేలంలో వేల కోట్ల రూపాయల డబ్బును వెచ్చించాయి. 5జీ స్పెక్ట్రం కోసం, ప్రస్తుతం ఉన్న మూడు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు (రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా) కలిసి రూ. 1,50,173 కోట్లు వెచ్చించాయి. దీనికి సంబంధించిన లైసెన్స్ ఫీజు చెల్లించేందుకు ఈ కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి, ఈ పరిస్థితుల్లో ఈ టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను పెంచాల్సి ఉంటుంది. 

2021 సంవత్సరంలో... భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో ప్రి-పెయిడ్ మొబైల్ టారిఫ్‌లను పెంచాయి. రాబోయే కాలంలో, ఈ 3 టెలికాం కంపెనీలు ప్రి-పెయిడ్‌తో పాటు పోస్ట్‌- పెయిడ్ టారిఫ్‌లను పెంచవచ్చు. మరో మొబైల్ టారిఫ్‌ హైక్‌ ఉండవచ్చని ఇప్పటికే అన్ని టెలికాం కంపెనీల టాప్ మేనేజ్‌మెంట్లు ప్రకటించాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget