అన్వేషించండి

Share Market Closing Today: మార్కెట్‌లో మెరిసిన మెటల్‌ షేర్లు - 25,950 దగ్గర నిఫ్టీ, 84,900 దగ్గర సెన్సెక్స్‌ క్లోజింగ్‌

Stock Markets At Record Levels: ఈ రోజు కూడా మార్కెట్‌లో రికార్డ్‌ల పర్వం కొనసాగించింది. నిఫ్టీ మొదటిసారిగా 26,000 స్థాయిని దాటింది. బ్యాంక్ నిఫ్టీ, మెటల్ షేర్లు మెరిశాయి.

Stock Market Closing On 24 September 2024: ఈ రోజు సెషన్‌లో చారిత్రాత్మక గరిష్టాన్ని (Stock markets at record levels) తాకిన మార్కెట్లు, నిన్నటి బలాన్ని నిలబెట్టుకున్నాయి. ట్రేడ్‌ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 14.57 పాయింట్లు మాత్రమే పడిపోయి 84,914.04 స్థాయి వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.35 పాయింట్లు పెరిగి 25,940.40 వద్ద నిలిచాయి. మార్కెట్‌లోని ఈ స్థాయులు దేశీయ స్టాక్ మార్కెట్‌లోని బలాన్ని చూపుతున్నాయి.

స్టాక్‌ మార్కెట్‌లో సరికొత్త శిఖరాలు
మధ్యాహ్నం 3 గంటలకు, భారతీయ స్టాక్ మార్కెట్ చారిత్రక రికార్డును సృష్టించింది. NSE నిఫ్టీ మొదటిసారిగా 26,000 మైలురాయిని దాటింది. 25,000 నుంచి 26,000 వరకు చేరుకోవడానికి నిఫ్టీ అద్భుతం చేసింది, కేవలం 37 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ ఫీట్ సాధించింది. నిఫ్టీ 26,011.55 వద్ద (Nifty at fresh all-time high) రికార్డ్‌ స్థాయిని క్రియేట్‌ చేయగా, BSE సెన్సెక్స్ 85,163.23 వద్ద కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది, ఇది ఆల్ టైమ్ హై లెవెల్ ‍(Sensex at fresh all-time high). నిఫ్టీ బ్యాంక్ కూడా రికార్డ్‌ గరిష్టానికి చేరుకుంది. ఈ ఇండెక్స్‌ 54,247.70 వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని టచ్‌ చేయడం స్టాక్ మార్కెట్‌కు కొత్త ఊపునిచ్చింది. 

పెరిగిన & పడిపోయిన షేర్లు
ట్రేడ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో... 14 స్టాక్స్‌ లాభాలను, 16 స్టాక్స్‌ నష్టాలను చవిచూశాయి. టాటా స్టీల్‌ 4.25 శాతం, పవర్‌గ్రిడ్‌ 2.67 శాతం, టెక్‌ మహీంద్ర 1.63 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.20 శాతం, మహీంద్ర అండ్‌ మహీంద్ర 0.74 శాతం లాభాలతో టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు... హిందుస్థాన్‌ యూనిలీవర్‌ 2.61 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.54 శాతం, కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ 1.26 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.25 శాతం, టైటన్‌ 1 శాతం లాస్‌తో టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.

ఈరోజు ఆస్ట్రాజెనెకా ఫార్మా షేర్లు అద్భుతంగా 17 శాతం జంప్‌ చేశాయి, రూ.7,878 స్థాయికి చేరాయి. భారతదేశంలో క్యాన్సర్ ఔషధాన్ని ప్రారంభించేందుకు కంపెనీ ఆమోదం పొందింది. ఈ వార్తతో స్టాక్‌ భారీగా పెరిగింది.

మెరిసిన మెటల్ షేర్లు
ఈ రోజు మెటల్ స్టాక్స్‌ బలంగా ఎదిగాయి. చైనాలో RRR తగ్గింపు వార్తల తర్వాత భారతీయ మెటల్ స్టాక్స్‌లో ప్రకాశం పెరుగుతోంది. టాటా స్టీల్, ఎన్‌ఎండీసీ, హిందాల్కో వంటి షేర్లు ర్యాలీ చేశాయి. దీంతో మెటల్ ఇండెక్స్ బలమైన ముగింపు ఇచ్చింది.

మార్కెట్ క్యాప్‌
బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 476.01 లక్షల కోట్లకు తగ్గింది. అయితే, నిన్నటి ముగింపు స్థాయి రూ. 476.17 లక్షల కోట్లను దాదాపుగా నిలబెట్టుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: రూ.26కే ఎయిర్‌టెల్‌ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ - 30 రోజుల వ్యాలిడిటీతో మరో 3 చౌక డేటా ఓచర్లు 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
నెలకు 1000 km డ్రైవ్‌ చేసే సీనియర్‌ సిటిజన్లకు రూ.15 లక్షల్లో పర్‌ఫెక్ట్‌ ఆటోమేటిక్‌ కార్‌ - దీనిని మిస్‌ అవ్వొద్దు!
సీనియర్‌ సిటిజన్లు ఈజీగా హ్యాండిల్‌ చేయగల సేఫ్‌, ఆటోమేటిక్‌ కార్‌ - రూ.15 లక్షల బడ్జెట్‌లో
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Snack for Weight Loss : ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ABP Southern Rising Summit 2025: దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
Embed widget