అన్వేషించండి

Stock Markets High : స్టాక్ మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్ - సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హై

Business News : స్టాక్ మార్కెట్ లో సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హైని చేరుకున్నాయి. దీనికి కారణం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించిన డివిడెండే.

Stock Market News :  స్టాక్‌ మార్కెట్లు గురువారం కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. గురువారం ప్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత  పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టాయి.  సెన్సెక్స్‌, నిఫ్టీ  లైఫ్ను టైం హైని తాకాయి. అదే సమయంలో సెన్సెక్స్ తొలిసారిగా 74,253 పాయింట్లు, నిఫ్టీ 22,950 పాయింట్ల ఎగువన ముగిశాయి. 

ఫ్లాట్ గా ప్రారంభమై పరుగందుకున్న  సూచీలు              

ఆర్బీఐ కేంద్రానికి ప్రకటించిన డివిడెంట్ ప్రకటనతో  పాటు హెచ్‌ఎస్‌బీసీ వెలువరించిన డేటా సైతం సూచీల పరుగుకు మరో కారణంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.  కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 74,253.53 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సెన్సెక్స్‌ దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 75,499.91 పాయింట్లకు పెరిగి.. జీవకాల గరిష్ఠానికి చేరింది.  చివరకు 1,196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఆల్‌టైమ్‌ హైకి చేరుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో ముగిసింది.  చివరకు 369.85 పాయింట్లు పెరిగి.. 22,967.65 వద్ద స్థిరపడింది. దాదాపు 1577 షేర్లు పురోగమించగా.. 1761 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌ లాభాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్ప్, హిందాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. మెటల్, ఫార్మా మినహా, ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్ క్యాపిటల్ గూడ్స్ 2శాతం చొప్పున పెరిగాయి.

కేంద్రానికి ఊహించనంత డివిడెండ్ ప్రకటించిన ఆర్బీఐ             

స్టాక్ మార్కెట్ పరుగలకు కారణం రిజర్వ్ బ్యాంక్.   కేంద్రానికి అంచనాలకు మించి రిజర్వ్‌ బ్యాంక్‌ డివిడెండ్‌ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా  రూ. 2.11లక్షల కోట్లను చెల్లించేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ కారణంగా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. ఆర్బీఐ  రికార్డు డివిడెండ్ రూ. 2.11 లక్షల కోట్లు వస్తుందని కేంద్రం కూడా ఊహించలేదు.  2025 ఆర్థిక సంవత్సరం కోసం మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే వస్తుందని అంచనా వేసుకుంది. ఆ అంచనాలతో పోలిస్తే రెట్టింపు డివిడెండ్ ఆర్బీఐ ప్రకటించింది.  అధిక డివిడెండ్ జీడీపీలో   0.4 శాతం అదనపు ఆర్థిక ఆదాయాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.   

ఎన్నికల సమయంలో ఫ్లాట్ గా ఉండే మార్కెట్లు                               

సాధారణంగా ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఉంటాయి. ప్రభుత్వం మారుతుందా .. మారితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న అంశాలపై సున్నితంగా స్పందిస్తూ ఉంటాయి. మార్కెట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందనుకుంటే కాస్త యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల అమిత్ షా కూడా ఇన్వెస్టర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ఎక్కువగా స్టాక్స్ కొని పెట్టకోవాలని జూన్ నాలుగో తేదీ తర్వాత చాలా లాభం వస్తుందని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget