అన్వేషించండి

Stock Markets High : స్టాక్ మార్కెట్లకు ఆర్బీఐ బూస్ట్ - సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హై

Business News : స్టాక్ మార్కెట్ లో సూచీలు పరుగులు పెట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హైని చేరుకున్నాయి. దీనికి కారణం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించిన డివిడెండే.

Stock Market News :  స్టాక్‌ మార్కెట్లు గురువారం కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. గురువారం ప్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత  పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టాయి.  సెన్సెక్స్‌, నిఫ్టీ  లైఫ్ను టైం హైని తాకాయి. అదే సమయంలో సెన్సెక్స్ తొలిసారిగా 74,253 పాయింట్లు, నిఫ్టీ 22,950 పాయింట్ల ఎగువన ముగిశాయి. 

ఫ్లాట్ గా ప్రారంభమై పరుగందుకున్న  సూచీలు              

ఆర్బీఐ కేంద్రానికి ప్రకటించిన డివిడెంట్ ప్రకటనతో  పాటు హెచ్‌ఎస్‌బీసీ వెలువరించిన డేటా సైతం సూచీల పరుగుకు మరో కారణంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.  కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 74,253.53 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సెన్సెక్స్‌ దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 75,499.91 పాయింట్లకు పెరిగి.. జీవకాల గరిష్ఠానికి చేరింది.  చివరకు 1,196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఆల్‌టైమ్‌ హైకి చేరుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో ముగిసింది.  చివరకు 369.85 పాయింట్లు పెరిగి.. 22,967.65 వద్ద స్థిరపడింది. దాదాపు 1577 షేర్లు పురోగమించగా.. 1761 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌ లాభాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్ప్, హిందాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. మెటల్, ఫార్మా మినహా, ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్ క్యాపిటల్ గూడ్స్ 2శాతం చొప్పున పెరిగాయి.

కేంద్రానికి ఊహించనంత డివిడెండ్ ప్రకటించిన ఆర్బీఐ             

స్టాక్ మార్కెట్ పరుగలకు కారణం రిజర్వ్ బ్యాంక్.   కేంద్రానికి అంచనాలకు మించి రిజర్వ్‌ బ్యాంక్‌ డివిడెండ్‌ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా  రూ. 2.11లక్షల కోట్లను చెల్లించేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ కారణంగా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. ఆర్బీఐ  రికార్డు డివిడెండ్ రూ. 2.11 లక్షల కోట్లు వస్తుందని కేంద్రం కూడా ఊహించలేదు.  2025 ఆర్థిక సంవత్సరం కోసం మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే వస్తుందని అంచనా వేసుకుంది. ఆ అంచనాలతో పోలిస్తే రెట్టింపు డివిడెండ్ ఆర్బీఐ ప్రకటించింది.  అధిక డివిడెండ్ జీడీపీలో   0.4 శాతం అదనపు ఆర్థిక ఆదాయాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.   

ఎన్నికల సమయంలో ఫ్లాట్ గా ఉండే మార్కెట్లు                               

సాధారణంగా ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఉంటాయి. ప్రభుత్వం మారుతుందా .. మారితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న అంశాలపై సున్నితంగా స్పందిస్తూ ఉంటాయి. మార్కెట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందనుకుంటే కాస్త యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల అమిత్ షా కూడా ఇన్వెస్టర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ఎక్కువగా స్టాక్స్ కొని పెట్టకోవాలని జూన్ నాలుగో తేదీ తర్వాత చాలా లాభం వస్తుందని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
IDFC First Bank Case: రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
Petrol Diesel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 10 రోజుల్లో నాలుగో షాక్! హైదరాబాద్‌లో నేటి ధరలివే
RBI Loan Recovery Guidelines 2026: అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో
అప్పు ఇచ్చారని అడ్డగోలుగా వసూలుకు ప్రయత్నిస్తే నేరమే - ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇవిగో

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Bihar police frisked by boy: బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
బీహార్‌లో గ్యాంగ్ స్టర్ ఇంట్లో సోదాలకు పోలీసులు ఎలా వెళ్తారో తెలుసా? - ఈ వీడియో చూస్తే సినిమాల్లో చూపించేది తక్కువే అనుకుంటారు!
TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
Embed widget