అన్వేషించండి

Reliance Industries: ముకేశ్ అంబానీ టీమ్‌లో ఇద్దరు తెలుగువాళ్లు! విస్తరణలో వీళ్లు కీలకం!

Reliance AGM 2022: సోమవారం రిలయన్స్‌ 45వ ఏజీఎం జరిగిన సంగతి తెలిసిందే. కంపెనీ విస్తరణ నేపథ్యంలో బోర్డులోని ఇద్దరు తెలుగు వాళ్లపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Reliance AGM 2022: తమ వ్యాపారాలను మరింత విస్తరించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) నిర్ణయించింది. చాలా కంపెనీల బోర్డుల్లోంచి ముకేశ్‌ అంబానీ వైదొలగుతున్నారు. ఆయన వారసులు పగ్గాలు అందుకుంటున్నారు. ఈ ఏడాది దీపావళికి ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు ఆరంభిస్తామని కంపెనీ వెల్లడించింది. సోమవారం రిలయన్స్‌ 45వ ఏజీఎం జరిగిన సంగతి తెలిసిందే. కంపెనీ విస్తరణ నేపథ్యంలో బోర్డులోని ఇద్దరు తెలుగు వాళ్లపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

పీఎంఎస్‌ ప్రసాద్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించిన తెలుగు వ్యక్తి పీఎంఎస్‌ ప్రసాద్‌ (PMS Prasad). కార్పొరేట్‌ వర్గాల్లో ఆయన తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గుంటూరులోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన కంపెనీలో 30 ఏళ్లుగా అనేక బాధ్యతలను నిర్వహించారు. ధీరూభాయ్‌ అంబానీ సమయంలో రిలయన్స్‌లో చేరి ఆయనకు నమ్మకస్థుడిగా ఎదిగారు. కొన్నాళ్లు సీఈవోగా పనిచేశారు. 1999లో ప్రపంచంలోనే అతిపెద్దదైన జామ్‌ నగర్‌ కాంప్లెక్స్‌ రిఫైనరీ నడిపించారు. జియో స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారు. పెట్రో కెమికల్స్, రిఫైనింగ్‌, మార్కెటింగ్‌, చమురు అణ్వేషణ, వెలికితీత, ఫైబర్స్‌ వ్యాపారాల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. 2008లో ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్నారు. డెహ్రాడూన్‌లోని పెట్రోలియం ఇంజినీరింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ప్రస్తుతం రిలయన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

కేవీ చౌదరీ

రిలయన్స్‌ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న మరో తెలుగు పేరు కేవీ చౌదరీ. గతంలో కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల బోర్డు ఛైర్మన్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. 2019లో ఆయన రిలయన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనేక కమిటీల్లో కీలకంగా ఉన్నారు. ఆడిట్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిటిలీ, హ్యూమన్‌ రిసోర్సెస్‌, నామినేషన్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. స్టేక్‌ హోల్డర్స్‌ రిలేషన్‌షిప్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులు, పోస్టుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Nuclear ash over the Himalayas: హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
హిమాలయాలపై అమెరికా పెట్టిన అణుకుంపటి -ఎవరికీ తెలియని సంచలన విషయాలు ఇవిగో
Cheapest Cars in India: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే! 34 KM మైలేజ్‌తోపాటు ADAS ఫీచర్ ఉన్న వాహనాల ధర ఎంత?
Embed widget