అన్వేషించండి

Reliance Industries: ముకేశ్ అంబానీ టీమ్‌లో ఇద్దరు తెలుగువాళ్లు! విస్తరణలో వీళ్లు కీలకం!

Reliance AGM 2022: సోమవారం రిలయన్స్‌ 45వ ఏజీఎం జరిగిన సంగతి తెలిసిందే. కంపెనీ విస్తరణ నేపథ్యంలో బోర్డులోని ఇద్దరు తెలుగు వాళ్లపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Reliance AGM 2022: తమ వ్యాపారాలను మరింత విస్తరించేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) నిర్ణయించింది. చాలా కంపెనీల బోర్డుల్లోంచి ముకేశ్‌ అంబానీ వైదొలగుతున్నారు. ఆయన వారసులు పగ్గాలు అందుకుంటున్నారు. ఈ ఏడాది దీపావళికి ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలు ఆరంభిస్తామని కంపెనీ వెల్లడించింది. సోమవారం రిలయన్స్‌ 45వ ఏజీఎం జరిగిన సంగతి తెలిసిందే. కంపెనీ విస్తరణ నేపథ్యంలో బోర్డులోని ఇద్దరు తెలుగు వాళ్లపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

పీఎంఎస్‌ ప్రసాద్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీ ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించిన తెలుగు వ్యక్తి పీఎంఎస్‌ ప్రసాద్‌ (PMS Prasad). కార్పొరేట్‌ వర్గాల్లో ఆయన తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. గుంటూరులోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన కంపెనీలో 30 ఏళ్లుగా అనేక బాధ్యతలను నిర్వహించారు. ధీరూభాయ్‌ అంబానీ సమయంలో రిలయన్స్‌లో చేరి ఆయనకు నమ్మకస్థుడిగా ఎదిగారు. కొన్నాళ్లు సీఈవోగా పనిచేశారు. 1999లో ప్రపంచంలోనే అతిపెద్దదైన జామ్‌ నగర్‌ కాంప్లెక్స్‌ రిఫైనరీ నడిపించారు. జియో స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారు. పెట్రో కెమికల్స్, రిఫైనింగ్‌, మార్కెటింగ్‌, చమురు అణ్వేషణ, వెలికితీత, ఫైబర్స్‌ వ్యాపారాల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. 2008లో ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు అందుకున్నారు. డెహ్రాడూన్‌లోని పెట్రోలియం ఇంజినీరింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ప్రస్తుతం రిలయన్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

కేవీ చౌదరీ

రిలయన్స్‌ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న మరో తెలుగు పేరు కేవీ చౌదరీ. గతంలో కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల బోర్డు ఛైర్మన్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌గా సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. 2019లో ఆయన రిలయన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనేక కమిటీల్లో కీలకంగా ఉన్నారు. ఆడిట్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిటిలీ, హ్యూమన్‌ రిసోర్సెస్‌, నామినేషన్‌, రెమ్యూనరేషన్‌ కమిటీ, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. స్టేక్‌ హోల్డర్స్‌ రిలేషన్‌షిప్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులు, పోస్టుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pushpa 2 Ticket Rates: పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
మద్యం ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు! ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Embed widget